మడకశిర: స్థానిక 3వ వార్డులోని శివపురంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. శివాపురం ప్రాంతంలో నివాసముంటున్న బోయ భారతి బతుకు తెరువు కోసం కిరాణా కొట్టు ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలో భారతి అంటే గిట్టని వారు ఆమె ఫొటో పెట్టి పసుపు కుంకుమ, కోడి గుడ్లు, నిమ్మకాయలతో మంగళవారం రాత్రి క్షుద్ర ప్రయోగం చేశారు. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన వారు అక్కడి దృశ్యాలు చూసి భయభ్రాంతులకు లోనయ్యారు. ఘటనపై పోలీసులకు బాధితురాలు భారతి ఫిర్యాదు చేశారు.
ADVERTISEMENT
ADVERTISEMENT