-
Simhachalam Temple: సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భక్తుల రద్దీ (ఫొటోలు)
-
Simhachalam: దర్శనానికి వచ్చి ఉంగరం దొంగిలిస్తారా..?
సింహాచలం: ‘శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం..’అని సింహాచలం కొండకి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించే సరికి వారంతా కంగుతిన్నారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా.! స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా..’అంటూ భక్తులు ఆవేశంతో స్థానాచార్యులపై గర్జించారు. ‘చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. పోలీసులు తీసుకెళ్లకముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి.’ అంటూ స్థానాచార్యులు మరింత గర్జించి అడగటంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి.దేవస్థానం అర్చకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజయనగరానికి చెందిన భక్తురాలు తాము ఉంగరం తీయలేదని ఎంత చెబుతున్నా వినకుండా మీరే దొంగ అంటూ పదే పదే ప్రశ్నించడంతో వారంతా ఆగ్రహంతో చిందులు వేశారు. పైగా చేతికున్న ఉంగరాలను చూపెట్టమని.. దొంగిలించిన ఉంగరంలా ఇవి ఉన్నాయంటూ స్థానాచార్యులు అడగటంతో భక్తుల నోటి మాట రాలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని భక్తులంతా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు. ఇదీ సింహగిరిపై బుధవారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వినోదోత్సవం. స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన ఉంగరం వెతికే ఘట్టాన్ని బుధవారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. ఏడు పరదాల్లో దాగి ఉన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో అధిష్టింపజేశారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు కర్ర, తాడు పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.టెక్కలికి చెందిన భక్తులను ప్రశి్నస్తున్న స్థానాచార్యులు ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యవంతం చెందారు. ఉత్స వం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాను తొలగించారు. చివరికి స్వామి చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. ఎస్.కోట మండలం బొద్దాంకి చెందిన నూతన దంపతులు ఈశ్వరరావు, మాధవి, ఆరిలోవ ప్రాంతానికి చెందిన మౌళీ, గౌతమి, ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యారి్థనులు హిమజ, ప్రత్యూష, లావణ్య, శ్వేత అశ్విని, టెక్కలికి చెందిన అక్కాతమ్ముళ్లు జీవిత, నవీన్కుమార్లను పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి తీసుకురాగా వారిని స్థానాచార్యులు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా దాసన్నపేటకి చెందిన రోజా అనే మహిళ తన కుమార్తె మిక్కి, అల్లుడు కిశోర్, మనవలతో కలిసి సింహగిరికి రాగా వారిని తాళ్లతో బంధించారు. వాళ్ల చేతికి ఉన్న ఉంగరం.. దొంగిలించిన ఉంగరంగానే ఉందని స్థానాచార్యులు, అర్చకులు అనుమా నం వ్యక్తం చేయడంతో వారంతా వాదనకు దిగారు. నా కూతురుకు, అల్లుడికి నిశి్చతార్థం రోజు పెట్టిన ఉంగరాలు ఇవని, దొంగిలించినవి కాదని స్థానాచార్యులతో రోజా వాదించారు. ఇదిలా ఉండగా దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, ఆలయ కొత్వాల్ నాయక్ లంక సూరిబాబు, ఆలయ ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, సూపరింటెండెంట్ వెంకటరమణ, ట్రస్ట్బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు సైతం దొంగలుగా పట్టుపట్టారు. తొలుత స్థానాచార్యులను కూడా తాళ్లతోనే బంధించి తీసుకురావడం విశేషం. అదే సమయంలో సింహగిరి వచ్చిన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వినోదోత్సవంలో పాల్గొని.. స్వామిని దర్శించుకున్నారు. -
దర్శనానికి వచ్చి ఉంగరం దొంగిలిస్తారా..?
సింహాచలం: ‘శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం..’అని సింహాచలం కొండకి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించే సరికి వారంతా కంగుతిన్నారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా.! స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా..’అంటూ భక్తులు ఆవేశంతో స్థానాచార్యులపై గర్జించారు. ‘చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. పోలీసులు తీసుకెళ్లకముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి.’ అంటూ స్థానాచార్యులు మరింత గర్జించి అడగటంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి.తాము ఉంగరం తీయలేదని ఎంత చెబుతున్నా వినకుండా మీరే దొంగ అంటూ పదే పదే ప్రశ్నించడంతో వారంతా ఆగ్రహంతో చిందులు వేశారు. పైగా చేతికున్న ఉంగరాలను చూపెట్టమని.. దొంగిలించిన ఉంగరంలా ఇవి ఉన్నాయంటూ స్థానాచార్యులు అడగటంతో భక్తుల నోటి మాట రాలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని భక్తులంతా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు. ఇదీ సింహగిరిపై బుధవారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వినోదోత్సవం. స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన ఉంగరం వెతికే ఘట్టాన్ని బుధవారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు.ఏడు పరదాల్లో దాగి ఉన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో అధిష్టింపజేశారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు కర్ర, తాడు పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యవంతం చెందారు. ఉత్స వం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాను తొలగించారు. చివరికి స్వామి చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. ఎస్.కోట మండలం బొద్దాంకి చెందిన నూతన దంపతులు ఈశ్వరరావు, మాధవి, ఆరిలోవ ప్రాంతానికి చెందిన మౌళీ, గౌతమి, ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యారి్థనులు హిమజ, ప్రత్యూష, లావణ్య, శ్వేత అశ్విని, టెక్కలికి చెందిన అక్కాతమ్ముళ్లు జీవిత, నవీన్కుమార్లను పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి తీసుకురాగా వారిని స్థానాచార్యులు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా దాసన్నపేటకి చెందిన రోజా అనే మహిళ తన కుమార్తె మిక్కి, అల్లుడు కిశోర్, మనవలతో కలిసి సింహగిరికి రాగా వారిని తాళ్లతో బంధించారు.వాళ్ల చేతికి ఉన్న ఉంగరం.. దొంగిలించిన ఉంగరంగానే ఉందని స్థానాచార్యులు, అర్చకులు అనుమా నం వ్యక్తం చేయడంతో వారంతా వాదనకు దిగారు. నా కూతురుకు, అల్లుడికి నిశి్చతార్థం రోజు పెట్టిన ఉంగరాలు ఇవని, దొంగిలించినవి కాదని స్థానాచార్యులతో రోజా వాదించారు. ఇదిలా ఉండగా దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, ఆలయ కొత్వాల్ నాయక్ లంక సూరిబాబు, ఆలయ ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, సూపరింటెండెంట్ వెంకటరమణ, ట్రస్ట్బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు సైతం దొంగలుగా పట్టుపట్టారు. తొలుత స్థానాచార్యులను కూడా తాళ్లతోనే బంధించి తీసుకురావడం విశేషం. అదే సమయంలో సింహగిరి వచ్చిన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వినోదోత్సవంలో పాల్గొని.. స్వామిని దర్శించుకున్నారు. -
Simhachalam Kalyanam Photos: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం (ఫొటోలు)
-
సింహాచలం భూ సమస్యలపై ప్రజలకు అవంతి హామీ
-
సింహాచలం స్టేషన్కు ‘అమృత’ భాగ్యం!
సాక్షి,విశాఖపట్నం : సింహాచలం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో రూ.20 కోట్లతో రైల్వే శాఖ సింహాచలం స్టేషన్ అభివృద్ధి పనులను చేపట్టింది. అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ విజయనగరం జిల్లా కంటకాపల్లి రైల్వే ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగిందన్నారు. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోందని చెప్పారు. ‘త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్ళు పట్టాలెక్కనున్నాయి. వారానికి ఒక వందే భారత్ రైలు నిర్మాణం జరుగుతోంది. రైల్వేలను రాజకీయాలతో ముడిపెట్టి చూడొద్దు. ఏపీలో రైల్వేల అభివృద్ధి కోసం 8వేల 406కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. భూ కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. దేశంలో 5జీ మొబైల్ సర్వీసుల విస్తరణ చాలా వేగంగా జరుగుతోంది. దీపావళి నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. నాలుగువేల నూతన సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటవుతున్నాయి. ఇందులో ఎక్కువ ఉత్తరాంధ్రలోనే నిర్మాణం జరుగుతున్నాయి’అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇదీచదవండి..విశాఖలో అమెరికా దిగ్గజ ఐటీ అనుబంధ సంస్థ -
తిరుమల శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు
-
సింహాచలంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి
-
మాధవ స్వామి ఆలయంలో- శివరాత్రి సంబరాలు
-
ఘనంగా సింహాద్రి అప్పన్న డోలోత్సవం
-
భక్తజన సంద్రంగా సింహాచలం..గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు.. (ఫొటోలు)
-
సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
సింహాద్రి అప్పన్న ఆలయంలో చందనోత్సవం ఘనంగా నిర్వహించాం
-
నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తున్న అప్పన్న స్వామి
-
టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించిన వైవీ సుబ్బారెడ్డి
-
సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
సాక్షి, సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం(స్వామి వారి నిజరూప దర్శనం) వైభవంగా మొదలైంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమైంది. భక్తులకు నిజ రూపంలో అప్పన్న స్వామి దర్శనమిస్తున్నారు. స్వామివారికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ తరఫున ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి తెల్లవారుజామున ఒంటి గంట నుంచి దేవస్థానం అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభించారు. భక్తులకు ఉదయం 4 గంటల నుంచి దర్శనాలు ప్రారంభించారు. రాత్రి 8.30 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి తొలివిడతగా మూడు మణుగుల చందనం (120 కిలోలు) సమర్పిస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: దేవుడి సేవలన్నింటికీ ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ -
సింహాద్రి అప్పన్న ఆలయంలో చందనోత్సవం
-
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై మరోసారి రోడ్డెక్కిన ఉద్యోగులు
-
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం (ఫొటోలు)
-
ఆటో నుంచి రూ.500 నోట్ల వర్షం
నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం నోట్ల వర్షం కురిసింది. రోడ్డుపై వెళ్తున్న ఆటో నుంచి రూ.500 నోట్లు ఎగిరాయి. రోడ్డు మీద జలజలా రాలిపడ్డాయి. రోడ్డు మీద ఉన్న వారు కేకలు వేసినా ఆటోడ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. మడపాం టోల్గేట్ వద్ద ఒక ఆటోలో నుంచి రూ.500 నోట్లు కిందకు పడ్డాయి. గమనించిన టోల్గేట్ సిబ్బంది ఆటోడ్రైవర్ను కేకలు వేశారు. అయినా అతడు వినిపించుకోకుండా వెళ్లిపోవడంతో టోల్గేట్ సిబ్బంది రోడ్డుపై పడిన నోట్లను తీసుకున్నారు. పోలీసులకు విషయం తెలియడంతో నరసన్నపేట ఎస్ఐ సింహాచలం టోల్గేట్ వద్ద సీసీ పుటేజీని పరిశీలించారు. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు వస్తున్న పసుపురంగు ఆటోలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో పురుషులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. కరజాడ వద్ద నుంచే వీరు నోట్లు విసురుకుంటూ వస్తున్నట్లు తెలిసింది. టోల్గేట్ వద్దకు వచ్చే సరికి నోట్ల వర్షం పెరిగింది. ఈ నోట్లు ఎవరివి, ఆ ఆటో ఎవరిది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ పుటేజీలో ఆటో నంబరును గుర్తించారు. ఇవి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోట్లు అనే ప్రచారం జరుగుతోంది. ఒక్క టోల్గేటు వద్దే రూ.88 వేలు లభిస్తే.. కరజాడ నుంచి లెక్కిస్తే లక్షల్లో ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి రూ.88 వేలను స్వాధీనం చేసుకున్నామని, సోమవారం తహసీల్దార్ కోర్టుకు పంపుతామని, ఎవరైనా క్లెయిమ్ చేయడానికి వస్తే ఆధారాలు చూసి విచారిస్తామని ఎస్ఐ తెలిపారు. -
అప్పన్నను దర్శించుకున్న సింగర్ సునీత
సాక్షి, విశాఖపట్నం(సింహాచలం): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం ప్రముఖ సినీ గాయని సునీత దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆమె పేరిట అర్చకులు స్వామికి పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి ప్రసాదాన్ని ఏఈవో రాజు ఆమెకు అందజేశారు. చదవండి: ('హైదరాబాద్తో ఎన్నో జ్ఞాపకాలు.. ఎప్పుడో చెప్పలేను కానీ ఖచ్చితంగా చేస్తా') -
దివ్య మంగళరూపం నిజరూప దర్శనం
అణువణువూ అనంత భక్తితత్వంతో నిండిన ప్రకృతి రమణీయతలో భువిపై కొలువుదీరిన లక్ష్మీనారాయణుడు.. భూలోక వైకుంఠం.. సింహగిరిపై వెలసిన వరాహనరసింహుడు. ఏడాదిపొడవునా చందనలేపిత సుగంధ ద్రవ్యాల్లో చల్లబడుతూ వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రమే మంగళకర నిజరూప దర్శనమిచ్చే భక్తవరదుడు.. నిండైన చందనంలో నిత్యం కొలువుండే నరహరి నిజరూపాన్ని కనులారా తిలకించి మనసారా తరించేందుకు సమయం ఆసన్నమైంది.. చందనోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 4 గంటల నుంచి ఆ భాగ్యం భక్తులకు లభించనుంది. సింహాచలం: సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనానికి వేళాయింది. చందనోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆ భాగ్యం భక్తులకు లభించనుంది. ఉదయం నాలుగు గంటల నుంచి స్వామి నిజరూప దర్శనం ప్రారంభం కానుంది. చందనోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఆలయ అర్చకులు, వైదిక కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేష పూజలు నిర్వహించిన అనంతరం వెండి బొరుగులతో చందనం వలుపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నిజరూపభరితుడ్ని చేస్తారు. అనంతరం ఆరాధన నిర్వహించి తొలి దర్శనాన్ని ఉదయం 3గంటల సమయంలో దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుకు అందిస్తారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి స్వామికి పట్టువస్త్రాలు అందించే దేవాదాయశాఖ మంత్రి, ఉన్నతాధికారులు, టీటీడీ తరఫున పట్టువస్త్రాలు అందించే అధికారులకు దర్శనం అందిస్తారు. అనంతరం ఉదయం 4 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభిస్తారు. రాత్రి 7గంటల వరకే క్యూలో అనుమతి స్వామివారి నిజరూపదర్శనానికి విచ్చేసే భక్తులను రాత్రి 7 గంటలలోపు క్యూల్లోకి అనుమతిస్తారు. అనంతరం క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటివరకు క్యూల్లో వేచిఉన్న భక్తులకు స్వామివారి దర్శనాలు అందజేస్తారు. దర్శన సమయాలు ఉచిత, రూ.300 టిక్కెట్లు కలిగిన భక్తులందరికీ ఉదయం 4 గంటల నుంచి రాత్రి వరకు దర్శనం అందజేస్తారు. రూ.1500 టిక్కెట్టుపై వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు ఉదయం 4నుంచి 6 గంటలు తిరిగి 7 గంటల నుంచి 9 గంటల వరకు రెండు స్లాట్లు పెట్టారు. అలాగే రూ.1200 టిక్కెట్టుపై వచ్చే వీవీఐపీలకు కూడా ఉదయం 4గంటల నుంచి 6గంటల వరకు, తిరిగి 7గంటల నుంచి 9గంటల వరకు దర్శనాల సమయం కేటాయించారు. దివ్యాంగుల కోసం.. దివ్యాంగులకు సాయంత్రం 5గంటల నుంచి 6 గంటలలోపు దర్శన సమయాన్ని కేటాయించారు. ఉచిత, రూ.300,రూ.1000,రూ.1200,రూ.1500 టిక్కెట్ల క్యూలను, క్యూలపై షామియానాలు, టెంట్ల్ ఏర్పాటు చేశారు. 25వేల మంది భక్తులు మొత్తం క్యూల్లో పట్టేలా ఏర్పాట్లు చేశారు. మంచినీరు, మజ్జిగ, ఇతర శీతలపానియాలు క్యూల్లో అందించే ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటల నుంచి సహస్రఘటాభిషేకం రాత్రి 9 గంటల నుంచి సహస్రఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసం వెండి కలశాలను, మట్టి కలశలను సిద్ధం చేశారు. అలాగే ఆలయ దక్షిణ రాజగోపురం వద్ద బ్రిడ్జిపై నుంచి సహస్రఘటాభిషేకం నిర్వహణలో పాల్గొనే శ్రీవైష్ణవస్వాములు వెళ్లేలా, దుగువ నుంచి దర్శనం అనంతరం వెళ్లే భక్తులు వెళ్లేలా వంతెన ఏర్పాటు చేశారు. ఒక పక్క ఏడు గంటలలోపు క్యూలో ఉన్న భక్తులకు దర్శనాలు అందిస్తూనే, మరో వైపు సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వíస్తారు. విధుల్లో పోలీసులు చందనోత్సవం సందర్భంగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు సోమవారం ఉదయానికే చేరుకున్నారు. కొండదిగువ ట్రాఫిక్ పోలీసులకు, సింహగిరిపై లా అండ్ ఆర్డర్ పోలీసులకు వేర్వేరుగా శిబిరాలు ఏర్పాటు చేసి పోలీస్ అధికారులు ఏయే ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాలో డ్యూటీ చార్ట్లు వేశారు. విద్యుత్ కాంతులతో సింహగిరి చందనోత్సవాన్ని పురస్కరించుకుని సింహగిరి విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. అలాగే ఆలయాన్ని పెద్ద ఎత్తున పుష్పాలంకరణ చేశారు. -
నాన్న మంత్రిగా ఉన్నప్పుడు వచ్చా.. ఇప్పుడు మంత్రినై వచ్చా..
సాక్షి, సింహాచలం(పెందుర్తి): 30 ఏళ్ల క్రితం నాన్న రాష్ట్ర మంత్రిగా తొలిసారి శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆయన చిటికిన వేలు పట్టుకొని సింహగిరిపై నడిచాను.. ఇప్పుడు తాను మంత్రిగా స్వామి దర్శనానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని గురువారం సాయంత్రం ఆయన దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు, దేవస్థానం ఈవో సూర్యకళ పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆయన పేరిట అర్చకులు స్వామికి అష్టోత్తరంపూజ నిర్వహించారు. దేవస్థానం తరపున శేషవస్త్రాలు, జ్ఞాపికను, ప్రసాదాన్ని ఈవో అందజేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంతో తమ కుటుంబానికి ఎంతో దగ్గర అనుబంధం ఉందన్నారు. ఆ స్వామిని ఆరాధ్యదైవంగా పూజిస్తామన్నారు. ఆ సింహాద్రినాథుడి ఆశీస్సులు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దయ వల్లే నాకు మంత్రిగా అవకాశం లభించిందన్నారు. పంచగ్రామాల భూసమస్య పరిష్కారానికి ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీ వేసిందని, సమస్య పరిష్కారానికి తన వంతు కృషి కూడా చేస్తానని తెలిపారు. రాజగోపురం వద్ద దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యులు సువ్వాడ శ్రీదేవి, దొడ్డి రమణ, పెనుమత్స శ్రీదేవి వర్మ, ప్రత్యేక ఆహ్వానితుడు దొడ్డి రమణ తదితరులు స్వాగతం పలికారు. -
అరసవల్లిలో వైభవంగా రథసప్తమి
అరసవల్లి/తిరుమల: శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం రథ సప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సుమారు 60 వేల మంది వరకు భక్తులు ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఆదిత్యుడిని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. అరసవల్లి ఆలయానికి మాస్టర్ ప్లాన్ అమలుకు త్వరలోనే చర్యలు చేపడతానని మంత్రి వెలంపల్లి చెప్పారు. ఆలయ వివరాలను ఆర్జేసీ సురేష్బాబు, ఈవో వి.హరిసూర్యప్రకాష్ను అడిగి తెలుసుకున్నారు. దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సప్తవాహనాలపై శ్రీనివాసుడి కటాక్షం.. తిరుమల శ్రీవారు సప్తవాహనాలను అధిరోహించి మంగళవారం భక్తులను కటాక్షించారు. తిరుమల ఆలయంలో రథసప్తమి మహోత్సవం వైభవంగా సాగింది. కోవిడ్ నేపథ్యంలో దీన్ని ఏకాంతంగా నిర్వహించారు. కార్యక్రమాలను ఎస్వీబీసీ చానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఉషోదయాన సూర్యప్రభ వాహనంతో సప్తవాహన సేవోత్సవం ప్రారంభమైంది. అనంతరం శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీమలయప్పస్వామి చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై కొలువుదీరారు. మధ్యాహ్నం శ్రీసుదర్శన చక్రత్తాళ్వారులకు అభ్యంగనం ఆచరించారు. రాత్రి చంద్రప్రభ వాహనంతో వాహనసేవలు పరిసమాప్తమయ్యాయి. సింహగిరిపై విశేషంగా రథసప్తమి సింహాచలం: విశాఖ జిల్లా సింహాచలంలో వేంచేసిన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో రథసప్తమి పూజలను మంగళవారం విశేషంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ ప్రాంగణంలో హంసమూలన ఉన్న పురాతన రాతిరథంపై వేంజేపచేసి ఉదయం పంచామృతాభిషేకం, అరుణపారాయణ పఠనం నిర్వహించారు. అనంతరం రాతిరథంపైనే స్వామికి నిత్య కల్యాణాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులను సూర్యప్రభ వాహనంపై వేంజేపచేసి తిరువీధిని నిర్వహించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తెలంగాణలో సన్నబియ్యం రాజకీయం..
టీడీపీ అంటేనే కుట్ర కుతంత్రం.. చంద్రబాబుపై రెచ్చిపోయిన మల్లాది విష్ణు
అదిరిపోయే ఫీచర్లతో.. నయా స్మార్ట్ఫోన్ లాంచింగ్కు షావోమీ రెడీ!
కేకేఆర్ గెలుపు.. గాల్లో తేలిపోయిన షారుక్.. చూసుకోకుండా..!
ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ లేటెస్ట్ అప్ డేట్
తమిళనాడుకు రెడ్ అలర్ట్..
పాయల్ రాజ్పుత్ రక్షణ మూవీ టీమ్ నుండి వేధింపులను ఎదుర్కొంటుంది
వరంగల్లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
నేమ్ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
స్టార్లైనర్ క్యాప్సుల్ ప్రయోగం మళ్లీ వాయిదా..కారణం..
తప్పక చదవండి
- వరంగల్లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
- స్టార్లైనర్ క్యాప్సుల్ ప్రయోగం మళ్లీ వాయిదా..కారణం..
- ‘కంగనా కాలు మోపిన ఆలయాలను శుద్ధి చేయాలి’
- అమెరికాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం : ఎన్ని కలలు కన్నారో..!
- సింపుల్గా పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్.. అమ్మాయి ఎవరంటే?
- పోర్షే కారు ప్రమాదం: ‘పబ్లో భారీ ఖర్చు’.. వెల్లడించిన పోలీసులు
- IPL 2024: వాళ్ల వల్లే గెలిచాం.. ఫైనల్లోనూ మేమే: శ్రేయస్ అయ్యర్
- బయోపిక్లో భార్య రేప్ సీన్.. షాకైన కేన్స్ ఆడియెన్స్
- ‘కాంగ్రెస్ పాలనలో కన్నీటి దృశ్యాలివి’.. కేటీఆర్ వ్యాఖ్యలు
- పవన్ ఏ దేశానికి వెళ్లారు?
Advertisement