-
Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు తుది అంకానికి చేరుకుంది. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ బెర్తులు ఖరారు చేసుకోగా.. నాలుగో స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య గట్టి పోటీ నెలకొంది.బెంగళూరు వేదికగా ఈ రెండు జట్లు శనివారం తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించే సూచనలు ఉన్నాయి. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ రద్దైతే మాత్రం ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా చెన్నై టాప్-4కు దూసుకువెళ్తుంది.బహుశా ఇదే ఆఖరిసారిఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే ఆఖరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో ఆర్సీబీ మేటి క్రికెటర్ విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మహీ భాయ్.. నేను మరోసారి కలిసి(ప్రత్యర్థులుగా) ఆడబోతున్నాం.బహుశా ఇదే ఆఖరిసారి కావొచ్చేమో ఎవరికి తెలుసు! ఏదేమైనా మా అభిమానులకు ఇదొక గొప్ప కానుకలాంటిదే. టీమిండియాలో ఇద్దరం కలిసి ఎన్నో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాం.మహీ భాయ్ తన ఫినిషింగ్ టచ్తో ఎన్నో మ్యాచ్లలో జట్టును గెలిపించాడని అందరికీ తెలిసిందే’’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఐపీఎల్లో ధోనితో కలిసి ఆడే ఆఖరి మ్యాచ్ ఇదే కావొచ్చంటూ.. ధోని రిటైర్మెంట్పై కోహ్లి సంకేతాలు ఇచ్చాడు.రుతురాజ్ గైక్వాడ్కు పగ్గాలుకాగా 42 ఏళ్ల ధోని చెన్నై సూపర్ కింగ్స్ను ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్గా నిలిపాడు. అయితే, ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించిన తలా.. వికెట్కీపర్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు.ఈ సీజన్లో పలు మ్యాచ్లలో వింటేజ్ ధోనిని తలపిస్తూ పరుగుల విధ్వంసం సృష్టించిన మహీ.. 10 ఇన్నింగ్స్లో కలిపి 136 పరుగులు సాధించాడు. మోకాలి నొప్పి వేధిస్తున్నా సీఎస్కే తరఫున బరిలోకి దిగిన అతడు.. వచ్చే సీజన్లో ఆటకు గుడ్బై చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లి వ్యాఖ్యలు ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చాయి.చదవండి: MI: అంతా ఫేక్!.. అర్జున్ టెండుల్కర్ ఓవరాక్షన్.. ఆ తర్వాత ఇలా! -
IPL 2024: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరదు! అదెలా?
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్లో మూడో బెర్తు కూడా ఖరారైంది. కోల్కతా నైట్ రైడర్స్ టేబుల్ టాపర్గా ముందుగానే టాప్-4లో తిష్ట వేయగా.. రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ కూడా అర్హత సాధించాయి.లక్నో సూపర్ జెయింట్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం(మే 14)తో ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా రాజస్తాన్.. గుజరాత్ టైటాన్స్తో గురువారం నాటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సన్రైజర్స్ ప్లే ఆఫ్స్లో నేరుగా చోటు దక్కించుకున్నాయి.ఆ మూడు జట్ల మధ్య పోటీఇక ప్లే ఆఫ్స్లో మిగిలిన ఒక్క స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పోటీపడుతున్నాయి. నిజానికి రన్రేటు పరంగా ఈ రెండు జట్ల కంటే వెనుకబడి ఉన్న లక్నో(12 పాయింట్లు, నెట్ రన్రేటు -0.787) ఈ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్లే!ఒకవేళ ఆశలు సజీవం చేసుకోవాలంటే.. ముంబై ఇండియన్స్తో శుక్రవారం నాటి మ్యాచ్లో భారీ తేడాతో లక్నో గెలవాలి. అయినప్పటికీ సీఎస్కే- ఆర్సీబీ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. అందులోనూ ఆర్సీబీని సీఎస్కే కచ్చితంగా.. అది కూడా స్వల్ప తేడాతో ఓడిస్తేనే లక్నోకు అవకాశం ఉంటుంది.సీఎస్కే- ఆర్సీబీ ఫలితంపై సర్వత్రా ఆసక్తిఈ నేపథ్యంలో.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లక్నో వరుసగా మూడోసారి ప్లే ఆఫ్స్ చేరడం సాధ్యంకాదు. కాబట్టి ప్రధానంగా పోటీలో ఉన్నది సీఎస్కే- ఆర్సీబీ మాత్రమే అని చెప్పవచ్చు.ఈ రెండు జట్లలోనూ చెన్నై(14 పాయింట్లు, రన్రేటు 0.528) ఆర్సీబీ(12 పాయింట్లు 0.387) కంటే ఓ మెట్టు పైనే ఉంది. అయినప్పటికీ ఆర్సీబీ సీఎస్కేను దాటి ప్లే ఆఫ్స్ చేరాలంటే..? సాధ్యమయ్యే రెండు సమీకరణలు ఇలా!అలా చెన్నైపై గెలిచినా సాధ్యం కాదు1. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసి 200 పరుగులకు తక్కువ కాకుండా స్కోరు చేయాలి. అంతేకాదు 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాలి. అంతకంటే ఒక్క పరుగు తక్కువ తేడాతో చెన్నైని ఓడించినా ఫలితం ఉండదు. నెట్ రన్రేటు ఆధారంగా చెన్నై ప్లే ఆఫ్స్ చేరితే.. ఆర్సీబీ మాత్రం ఇంటిబాట పడుతుంది.2. ఒకవేళ ఆర్సీబీ గనుక సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చి.. చెన్నై విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని.. 11 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ పూర్తి చేయాలి. చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్ -
Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
‘‘క్రీడాకారులుగా మన కెరీర్కు కచ్చితంగా ఆఖరి తేదీ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి నేను నా ఆటలో లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవడంపైనే ఎల్లప్పుడూ దృష్టి సారిస్తాను.కెరీర్ ముగిసి పోయిన తర్వాత.. ‘ఓహ్.. ఆరోజు నేను అలా చేస్తే బాగుండు.. ఇలా చేస్తే ఇంకా మెరుగ్గా ఉండేది’ అని పశ్చాత్తాపపడాలని అనుకోవడం లేదు. కెరీర్కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ఎల్లకాలం గతం గురించే ఆలోచిస్తూ కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ప్రతీ పని ఇప్పుడే పూర్తి చేసుకుంటాను.పశ్చాత్తాపపడేందుకు ఏదీ మిగలనివ్వను. కచ్చితంగా నేను ఇది సాధిస్తాననే అనుకుంటున్నా’’ అంటూ టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు.మీ కంటికి కూడా కనిపించనుఆర్సీబీ రాయల్ గాలా డిన్నర్ నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత తాను చేయాలనుకుంటున్న పనుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు మీ కంటికి కూడా కనిపించను(నవ్వుతూ).అందుకే ఇక్కడ ఉన్నంతసేపు నా శాయశక్తులా, అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు తపిస్తున్నా. ఆ తపనే నన్ను ఇప్పుడు ముందుకు నడిపిస్తోంది’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా 2008లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కోహ్లి జట్టులో కీలక సభ్యుడిగా మారాడు.రికార్డుల రారాజుగా పేరొంది కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లి.. 2008 నుంచి ఇప్పటిదాకా ఐపీఎల్లో ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.అత్యధిక పరుగుల వీరుడుపదహారేళ్ల సుదీర్ఘ కెరీర్లో ఒక్కసారి కూడా గాయాల బెడదతో కోహ్లి జట్టుకు దూరం కాలేదంటే ఫిట్నెస్ మీద అతడికి ఉన్న శ్రద్ధ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక 35 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్.. ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నాడు.ఇప్పటి వరకు ఈ సీజన్లో 13 మ్యాచ్లలో ఆడి 661 పరుగులు సాధించిన విరాట్ కోహ్లి.. అత్యధిక పరుగుల వీరుడి(ఆరెంజ్ క్యాప్ హోల్డర్)గా కొనసాగుతున్నాడు. లీగ్ దశలో ఆర్సీబీ తమ ఆఖరి మ్యాచ్లో మే 18న చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే ఆర్సీబీ ఇంటిబాట పడుతుంది. కాగా బెంగళూరు జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ సాధించలేదన్న సంగతి తెలిసిందే.చదవండి: IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్ View this post on Instagram A post shared by Royal Challengers Bengaluru (@royalchallengers.bengaluru) -
IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ ముగింపునకు వచ్చినా టాప్-4 బెర్తులపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. మిగిలిన రెండు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నడుస్తోంది.ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఈ రేసులో ముందుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.చెన్నై ఇప్పటికి 13 మ్యాచ్లు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లు(నెట్ రన్రేటు 0.528) సాధించగా.. పన్నెండు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లతో ఉన్న సన్రైజర్స్ నెట్ రన్రేటు (0.406) పరంగా కాస్త వెనుకబడి ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.అతిపెద్ద సానుకూలాంశంఅయితే, రైజర్స్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉండటం.. అది కూడా సొంతగడ్డపై జరుగనుండటం అతిపెద్ద సానుకూలాంశం. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లలో ఏదో ఒకటి గెలిచినా 16 పాయింట్లతో కనీసం నాలుగో స్థానం ఖరారు చేసుకుంటుంది.మరోవైపు.. ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లే ఉన్నాయి. మిగిలింది ఇంకొక్క మ్యాచ్. అది కూడా సీఎస్కే(మే 18)తో! ఈ మ్యాచ్లో చెన్నైని కచ్చితంగా ఓడిస్తేనే ఆర్సీబీకి అవకాశం ఉంటుంది. లేదంటే ఇంటికి వెళ్లడమే తరువాయి!చెన్నై పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. ఓడితే ఇంటికే లేదంటే సన్రైజర్స్ మ్యాచ్ల ఫలితం తేలేవరకు వేచి చూడాలి. ఈ సమీకరణల నేపథ్యంలో ఎలా చూసినా సన్రైజర్స్ సీఎస్కే, ఆర్సీబీ కంటే ఓ మెట్టు పైనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.రెండు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి?అయితే, టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకుంటూ.. చెన్నై సూపర్ కింగ్స్తో పాటు ఆర్సీబీ టాప్-4లో అడుగుపెడుతుందని జోస్యం చెప్పాడు.‘‘తదుపరి రెండు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఐపీఎల్లో ఏదైనా జరగొచ్చు కదా! ఒకవేళ హైదరాబాద్ రెండు మ్యాచ్లూ ఓడి.. ఆర్సీబీ చెన్నై మీద గెలిస్తే.. అప్పుడు రెండు జట్ల ఖాతాలో 14 పాయింట్లే ఉంటాయి.రన్రేటు పరంగా సన్రైజర్స్ కంటే ఈ రెండు జట్లు మెరుగ్గానే ఉంటాయి. అందుకే నా టాప్ 4.. కేకేఆర్, రాజస్తాన్, చెన్నై, బెంగళూరు’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.భగ్గుమంటున్న ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కాగా భజ్జీ వ్యాఖ్యలపై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భగ్గుమంటున్నారు. విధ్వంసకర బ్యాటింగ్తో సొంతగడ్డపై చెలరేగే ప్యాట్ కమిన్స్ బృందాన్ని తక్కువ అంచనా వేయడమే గాకుండా.. అపశకునపు మాటలు మాట్లాడటం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు. ఇక సన్రైజర్స్ గురువారం నాటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్ను అంటారా?.. గంభీర్ ఫైర్ Ready to put on a show this evening 🧡💙#PlayWithFire #SRHvGT pic.twitter.com/o07Or5fu12— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024 -
సిక్సర్ల మోత.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి
ఐపీఎల్-2024 తుది అంకానికి చేరుకుంటోంది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా కోల్కతా నైట్ రైడర్స్ నిలవగా.. ఢిల్లీ క్యాపిటల్స్- లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ఫలితంతో రాజస్తాన్ రాయల్స్ కూడా టాప్-4కు అర్హత సాధించింది.సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నోను ఓడించడంతో రాజస్తాన్ ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తాజా ఎడిషన్లో 64వ మ్యాచ్ అయిన ఢిల్లీ- లక్నో పోరు తర్వాత సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది.ఈసారి ఏకంగాక్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన సీజన్గా 2024 నిలిచింది. ఈ ఎడిషన్లో ఇప్పటి వరకు మొత్తంగా 1125 సిక్సర్లు నమోదయ్యాయి. ఇక మంగళవారం నాటి మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ 4, షాయీ హోప్ రెండు, ట్రిస్టన్ స్టబ్స్ 4 సిక్సర్లు బాదగా.. లక్నో ఆటగాళ్లలో నికోలసన్ పూరన్ 4, అర్షద్ ఖాన్ 5, యుద్వీర్ సింగ్ చరక్ ఒక సిక్సర్ కొట్టారు.కాగా ఐపీఎల్-2024 ఆరంభం నుంచే సిక్సర్ల మోత మోగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరుగా మారిన సన్రైజర్స్ హైదరాబాద్తో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా సిక్స్ల వర్షం కురిపించింది. తద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక సిక్స్లు నమోదు చేసిన తొలి రెండు జట్లుగా సన్రైజర్స్, ఆర్సీబీ నిలవగా.. అనూహ్య రీతిలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో స్థానం ఆక్రమించింది.ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు👉1125 సిక్సర్లు - 2024👉1124 సిక్సర్లు - 2023👉1062 సిక్సర్లు - 2022👉872 సిక్సర్లు- 2018👉784 సిక్సర్లు- 20192024లో ఇప్పటి వరకు అత్యధిక సిక్స్లు నమోదు చేసిన జట్లు👉సన్రైజర్స్ హైదరాబాద్- 12 మ్యాచ్లలో 146 సిక్స్లు👉ఆర్సీబీ- 13 మ్యాచ్లలో 141 సిక్స్లు👉ఢిల్లీ క్యాపిటల్స్- 14 మ్యాచ్లలో 135 సిక్స్లు👉కోల్కతా నైట్ రైడర్స్- 12 మ్యాచ్లలో 125 సిక్స్లు👉ముంబై ఇండియన్స్- 13 మ్యాచ్లలో 122 సిక్స్లు👉పంజాబ్ కింగ్స్- 12 మ్యాచ్లలో 102 సిక్స్లు👉రాజస్తాన్ రాయల్స్- 12 మ్యాచ్లలో 100 సిక్స్లు. Fearless striking from Arshad Khan 🔥He's not given up yet in this chase 💪Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvLSG pic.twitter.com/JxfdwBnG0t— IndianPremierLeague (@IPL) May 14, 2024 -
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. 2008 నుంచి ఇప్పటి దాకా.. ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. అయినప్పటికీ ఆ జట్టుకు ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్సీబీకి ఉన్నంత విశ్వసనీయమైన ఫ్యాన్ బేస్ మరే జట్టుకు లేదంటారు.నాయకుడి స్థానం నుంచి వైదొలిగిఇంతటి క్రేజ్కు కారణం టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అన్న విషయం తెలిసిందే. ఇక్కడే తన ఫ్రాంఛైజీ క్రికెట్ మొదలుపెట్టిన ఈ రన్మెషీన్.. ఇప్పటికీ ఆ జట్టుతోనే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనూ కెప్టెన్గానూ బాధ్యతలు చేపట్టిన కోహ్లి పనిఒత్తిడిని తగ్గించుకుని.. కేవలం బ్యాటింగ్పై ఫోకస్ చేసే క్రమంలో నాయకుడి స్థానం నుంచి 2021 తర్వాత తప్పుకొన్నాడు.గత రెండు సీజన్లుగా సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్గా కొనసాగుతుండగా.. కోహ్లి ఓపెనింగ్ బ్యాటర్గా సేవలు అందిస్తున్నాడు. అయితే, అతడి సారథ్యంలో గతేడాది ఆరో స్థానంతో ముగించిన ఆర్సీబీ.. ఐపీఎల్-2024 ఆరంభంలో వరుస ఓటములు చవిచూసింది.వరుసగా ఐదు విజయాలు సాధించితర్వాత తిరిగి పుంజుకుని వరుసగా ఐదు విజయాలు సాధించి.. ప్రస్తుతానికి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. అయితే, కేజీఎఫ్గా ప్రసిద్ధి పొందిన ఆర్సీబీ బ్యాటింగ్ త్రయం కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్లలో కేవలం కోహ్లి ఒక్కడే రాణిస్తున్నాడు.ఇప్పటి వరకు ఈ ఎడిషన్లో ఆడిన 13 మ్యాచ్లలో కలిపి 661 పరుగులు చేసిన కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. అయితే, జట్టును ప్లే ఆఫ్స్ చేర్చడం మాత్రం కష్టంగా మారింది.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే సీజన్లో విరాట్ కోహ్లిని మళ్లీ కెప్టెన్గా ప్రకటించాలని ఆర్సీబీ మేనేజ్మెంట్కు సూచించాడు.ఆర్సీబీకి కోహ్లి కూడా అలాగేఈ మేరకు.. "ఈసారి వాళ్లు(ఆర్సీబీ గనుక ) ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించకపోతే.. భారత క్రికెటర్ను కెప్టెన్గా తీసుకురావాలి. అయినా ఎవరో ఎందుకు? మళ్లీ కోహ్లినే కెప్టెన్ను చేస్తే సరిపోతుంది కదా! చెన్నై జట్టు మీద ధోని ప్రభావం ఎంత ఉంటుందో.. ఆర్సీబీకి కోహ్లి కూడా అలాగే!బలమైన నాయకుడు. జట్టును ఎలా ముందుకు నడిపించాలో అతడికి తెలుసు. ప్రస్తుతం వాళ్లు దూకుడుగానే ఆడుతున్నారు. కోహ్లి సారథిగా వస్తే మరింత బాగుంటుంది. విరాట్ కోహ్లి తిరిగి ఆర్సీబీ పగ్గాలు చేపడితే చూడాలని ఉంది" అని భజ్జీ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.చదవండి: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు: ధోని ఫ్యాన్స్పై సంచలన వ్యాఖ్యలు -
Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
-
RCB- Virushka: అనుష్క శర్మ సెలబ్రేషన్స్.. కోహ్లి రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024 ఆరంభంలో వరుస ఓటములతో చతికిల పడ్డ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అనూహ్య రీతిలో తిరిగి పుంజుకుంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో వరుసగా ఐదో గెలుపు నమోదు చేసి.. ప్లే ఆఫ్స్ రేసులో ఇంకా తాము ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది.ఇక ఈ మ్యాచ్లో47 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకవచ్చింది. కాగా తప్పక గెలవాల్సిన మ్యాచ్లో విజయం సాధించడంతో ఆర్సీబీ సంబరాలు అంబరాన్నంటాయి.చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు విధించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. ఢిల్లీ 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆర్సీబీ ఆటగాళ్లతో ఆర్సీబీ అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోయారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఇక ఇందులో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ హైలైట్గా నిలిచారు. ఆర్సీబీ గెలుపు ఖరారు కాగానే.. ఆమె పట్టరాని ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యారు.వావ్.. థాంక్ గాడ్!‘వావ్’ అంటూ దేవుడికి కృతజ్ఞతలు చెప్పినట్లుగా చేతులు జోడించి ఆర్సీబీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వైరల్గా మారాయి. ఇందుకు కోహ్లి కూడా తనదైన శైలిలో మజిల్స్ చూపిస్తూ బదులిచ్చాడు. కాగా ఓ యాడ్ సందర్భంగా అనుష్కను కలిసిన కోహ్లి ఆమెతో ప్రేమలో పడ్డాడు. 2017లో ఇటలీలో ఆమెను పెళ్లాడాడు.ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. అకాయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జన్మించాడు. లండన్లో తన ప్రసవం తర్వాత ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చిన అనుష్క.. ఇలా భర్తను చీర్ చేస్తూ ఆర్సీబీకి మద్దతుగా స్టేడియానికి వస్తున్నారు. ఇక ఢిల్లీతో మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాటర్ కోహ్లి 13 బంతుల్లో 27 పరుగులు చేశాడు.ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: ఢిల్లీ.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 187/9 (20)👉ఢిల్లీ స్కోరు: 140 (19.1)👉ఫలితం: 47 పరుగుల తేడాతో ఢిల్లీపై ఆర్సీబీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కామెరాన్ గ్రీన్(24 బంతుల్లో 32 నాటౌట్.. ఒక వికెట్ (1/19)). Wrapped up in style ⚡️High fives 🙌 all around as #RCB make it FIVE 🖐️ in a row 🔥A comfortable 4️⃣7️⃣-run win at home 🥳Scorecard ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/qhCm0AwUIE— IndianPremierLeague (@IPL) May 12, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Virat Kohli: నన్నే ఏడిపిస్తావా?.. ప్రతీకారం తీర్చుకున్న కోహ్లి!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో 47 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.ఇదిలా ఉంటే.. ఆర్సీబీ- ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి, ఢిల్లీ సీనియర్ పేసర్ ఇషాంత్ల ‘బ్రొమాన్స్’ హైలైట్గా నిలిచింది.కాగా చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. ఇక ఓపెనర్ విరాట్ కోహ్లి 13 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేశాడు.అయితే, ఆర్సీబీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ బౌలింగ్లో మొదటి బంతికి ఫోర్ బాదిన కోహ్లి.. ఇషాంత్ను టీజ్ చేశాడు. తదుపరి బంతికి స్లిప్లో ఫీల్డర్ను పెట్టు అంటూ ఆటపట్టించాడు. అంతేకాదు.. మరుసటి బాల్ను సిక్సర్గా మలిచాడు.దీంతో ఉడుక్కున్నా కామ్గా కనిపించిన ఇషాంత్.. నాలుగో బంతికి కోహ్లిని ఊరించగా.. అతడు బంతిని గాల్లోకి లేపాడు. అభిషేక్ పోరెల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోహ్లి ఇచ్చిన క్యాచ్ పట్టడంతో అతడు పెవిలియన్ చేరక తప్పలేదు.ఈ క్రమంలో తానే గెలిచానన్నట్లుగా ఇషాంత్ కోహ్లిని నవ్వుతూ కోహ్లి దగ్గరు వచ్చి.. ‘‘వెళ్లు వెళ్లు ’’ అన్నట్లుగా సైగ చేశాడు. ఇందుకు బదులుగా కోహ్లి కూడా నవ్వుతూ సరేలే అన్నట్లు మైదానాన్ని వీడాడు.వీళ్లిద్దరి ఫ్రెండ్లీ బ్యాంటర్కు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ‘‘పశ్చిమ ఢిల్లీ అబ్బాయిలు ఇదిగో ఇలా ఉంటారు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది.అయితే, పదకొండో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఇషాంత్ శర్మ నాలుగు బంతులు ఎదుర్కొని సున్నా పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లి ఇషాంత్ శర్మ దగ్గరికి వెళ్లి ‘సర్లే పదా ఇంకా’ అంటూ టీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా కోహ్లి- ఇషాంత్ దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ప్రాతినిథ్య వహించారు. ఇక టీమిండియాలో కోహ్లి కెప్టెన్సీలో ఇషాంత్ ఆడిన విషయం తెలిసిందే.Kohli man I love him 🤣❤pic.twitter.com/65HxtsIwta— POTT⁷⁶⁵ (@KlolZone) May 12, 2024Wrapped up in style ⚡️High fives 🙌 all around as #RCB make it FIVE 🖐️ in a row 🔥A comfortable 4️⃣7️⃣-run win at home 🥳Scorecard ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/qhCm0AwUIE— IndianPremierLeague (@IPL) May 12, 2024 -
ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం.. వరుసగా ఐదో గెలుపు
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసి గెలుపు జెండా ఎగురవేసింది. 47 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. అయితే, మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆర్సీబీ బౌలర్లు ఆరంభంలోనే చుక్కలు చూపించారు.యశ్ దయాల్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఫెర్గూసన్ రెండు, స్వప్నిల్, సిరాజ్, గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో ఢిల్లీని 140 పరుగులకే ఆలౌట్ చేసిన ఆర్సీబీ విజయం సాధించింది.ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: ఢిల్లీ.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 187/9 (20)👉ఢిల్లీ స్కోరు: 140 (19.1)👉ఫలితం: 47 పరుగుల తేడాతో ఢిల్లీపై ఆర్సీబీ గెలుపురాణించిన విల్ జాక్స్, పాటిదార్.. ఆర్సీబీ స్కోరు ఎంతంటే! ఐపీఎల్- 2024 ప్లే ఆఫ్స్ రేసులో భాగంగా మరో రసవత్తర సమరం జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడుతోంది.సొంతమైదానంలో టాస్ ఓడిన ఆర్సీబీ.. ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లి(13 బంతుల్లో 27) ధాటిగా ఆరంభించగా.. మరో ఓపెనర్, కెప్టెన్ డుప్లెసిస్(6) మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.ఈ క్రమంలో విల్ జాక్స్(29 బంతుల్లో 41), రజత్ పాటిదార్ (32 బంతుల్లో 52) మెరుపు ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నారు. వీరికి తోడు ఐదో నంబర్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్(24 బంతుల్లో 32 పరుగులు నాటౌట్) కూడా రాణించాడు.అయితే, లోయర్ ఆర్డర్ మహిపాల్ లామ్రోర్(13) ఒక్కడు డబుల్ డిజిట్ స్కోరు చేయగా.. దినేశ్ కార్తిక్, స్వప్నిల్ సింగ్ డకౌట్ అయ్యారు. కరణ్ శర్మ ఆరు పరుగులు చేసి రనౌట్ కాగా.. మహ్మద్ సిరాజ్ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 187 పరుగులు స్కోరు చేసింది.ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రసిఖ్ దార్ సలాం రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. -
RCB Vs PBKS: సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం నాటి మ్యాచ్లో ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో పంజాబ్ అభిమానులతో పాటు ఆ జట్టు మేనేజ్మెంట్కు సైతం భంగపాటు తప్పలేదు. అయితే, జట్టు పరాభవం నేపథ్యంలోనూ పంజాబ్ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.కోహ్లి వికెట్ పడగానే కాగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ను ఆర్సీబీ 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఈ విజయంలో విరాట్ కోహ్లిదే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 7 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 92 పరుగులు చేశాడు.Going..Going..GONE!Virat Kohli clobbers that delivery into the stands in grand fashion! 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/Y5eVp7Q6fN— IndianPremierLeague (@IPL) May 9, 2024అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో రిలీ రొసోవ్కు క్యాచ్ ఇవ్వడంతో ఈ ఆర్సీబీ ఓపెనర్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా చప్పట్లు కొడుతూ కోహ్లి వికెట్ను సెలబ్రేట్ చేసుకుంది. అయితే, ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు.The Punjab Kings bounce back with crucial breakthroughs, especially the big one of Virat Kohli 👏👏#RCB 238/5 with 5 deliveries leftWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/9mu2bMjrWV— IndianPremierLeague (@IPL) May 9, 2024లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లంతా విఫలం కావడంతో ఆ జట్టుకు పరాజయమే ఎదురైంది. ఈ నేపథ్యంలో నిరాశకు లోనైనా ప్రీతి జింటా హుందాగా వ్యవహరించింది.సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న సమయంలో.. మ్యాచ్ను తాము లాగేసుకున్నందుకు ప్రీతి జింటాకు సారీ చెప్పాడు. ఇందుకు బదులుగా కోహ్లితో కరచాలనం చేస్తూ... ‘‘మరేం పర్లేదు’’ అన్నట్లుగా నవ్వులు చిందించిందామె.ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకాను ప్రీతి జింటాతో పోలుస్తూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. సంజీవ్ గోయెంకాకు చురకలుమ్యాచ్ ఓడటమే కాదు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినా ప్రీతి ఆ బాధ బయటకు తెలియకుండా నవ్వుతూ కవర్ చేసిందని.. ఆమెను చూసి గోయెంకా చాలా నేర్చుకోవాలని చురకలు అంటిస్తున్నారు. కాగా సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓటమి నేపథ్యంలో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్కు బహిరంగంగానే చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్Preity Zinta with Virat Kohli at the post match presentation ceremony. ❤️ pic.twitter.com/z1G2L1IIr8— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2024Virat Kohli said Sorry to Preity Zinta when he met with her in post match award presentation & Preity Zinta smiles.- King Kohli winning the hearts of everyone, He's a pure soul. ❤️🐐 pic.twitter.com/2h2JFnZsyz— Tanuj Singh (@ImTanujSingh) May 10, 2024 -
ఆర్సీబీ ఘన విజయం: కోహ్లి కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్-2024 ఆరంభంలో కాస్త తడబడ్డా తిరిగి పుంజుకుని పరుగుల వరద పారిస్తున్నాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లి. అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ తన దగ్గరే పెట్టుకున్నాడు.తాజాగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో దుమ్ములేపిన ఈ ఆర్సీబీ ఓపెనర్ జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో వింటేజ్ కోహ్లిని గుర్తుచేస్తూ 92 పరుగులు సాధించాడు. సెంచరీ చేజారినా అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకోగలిగాడు.Going..Going..GONE!Virat Kohli clobbers that delivery into the stands in grand fashion! 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/Y5eVp7Q6fN— IndianPremierLeague (@IPL) May 9, 2024కోహ్లి స్ట్రైక్రేటుపై విమర్శలుఈ మ్యాచ్తో కలిపి ఈ సీజన్లో 12 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి ఓ శతకం సాయంతో 634 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ రన్మెషీన్ స్ట్రైక్రేటు 153.51గా నమోదైంది.కాగా గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లి స్ట్రైక్రేటుపై విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. స్వార్థపూరిత ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు మేలు కంటే చేటే ఎక్కువ చేస్తున్నాడంటూ కొంతమంది మాజీ క్రికెటర్లు విమర్శించారు.ఇందుకు కోహ్లి గట్టిగానే బదులివ్వగా.. సునిల్ గావస్కర్ వంటి వాళ్లు చూసిందే మాట్లాడుతున్నాం అంటూ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ అనంతరం కోహ్లి కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘నాకు క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. లోపాలు సరిచేసుకుని ముందుకు ఎలా వెళ్లాలో నాకు తెలుసు. రోజురోజుకు ఆటను మెరుగుపరచుకోవడమే నా పని.స్పిన్నర్ల బౌలింగ్లో స్లాగ్స్వీప్ షాట్లు ఆడాను. నిజానికి నేను అలాంటివి గతంలో ప్రాక్టీస్ కూడా చేయలేదు. కానీ కొన్నిసార్లు రిస్క్ తీసుకోకతప్పదని నాకు తెలుసు.స్ట్రైక్రేటు పెంచుకునే క్రమంలోనాకోసం, జట్టు ప్రయోజనాల కోసం స్ట్రైక్రేటు పెంచుకునే క్రమంలో ఇలాంటివి చేయాల్సిందే’’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఇక వరుస ఓటముల తర్వాత ఆర్సీబీ వరుస విజయాల పట్ల స్పందిస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే.. మేము మొదటి అర్థ భాగంలో స్థాయికి తగ్గట్లు రాణించలేదు.అందుకే పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నపుడు ఆత్మ గౌరవం కోసం ఆడాలని నిర్ణయించుకున్నాం. మా అభిమానులను గర్వపడేలా చేయాలనుకున్నాం. ఇప్పుడు ఏడో స్థానానికి చేరుకోగలిగాం. మేము ఇదే పని కాస్త ముందు చేసి ఉంటే ఎంతో బాగుండేది’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ నుంచి ఇప్పటికే ముంబై ఇండియన్స్ నిష్క్రమించగా.. ఆర్సీబీ చేతిలో గురువారం 60 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్ కూడా ఆశలు కూడా గల్లంతయ్యాయి.చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్ The Punjab Kings bounce back with crucial breakthroughs, especially the big one of Virat Kohli 👏👏#RCB 238/5 with 5 deliveries leftWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/9mu2bMjrWV— IndianPremierLeague (@IPL) May 9, 2024 -
RCB Vs PBKS Photos: చెలరేగిన కోహ్లి, పటిదార్ 60 పరుగులతో బెంగళూరు ఘనవిజయం (ఫొటోలు)
-
అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
పదకొండు ఇన్నింగ్స్.. 542 రన్స్.. సగటు 67.75.. స్ట్రైక్ రేటు 148.08.. అత్యధిక స్కోరు 113 నాటౌట్. ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇప్పటి దాకా నమోదు చేసిన గణాంకాలు. ఇక పదకొండింట జట్టు గెలిచిన మ్యాచ్లు నాలుగు.వరల్డ్కప్ జట్టులోనూ అతడి స్థానాన్ని ప్రశ్నిస్తూఈ సీజన్ ఆరంభం నుంచి కోహ్లి మెరుగ్గానే ఆడుతున్నా.. జట్టు వరుస పరాజయాల పాలవడంతో అతడి స్ట్రైక్రేటు చర్చనీయాంశంగా మారింది. మిగతా ఆటగాళ్లు ఎంతగా విఫలమవుతున్నా పట్టించుకోని కొందరు కామెంటేటర్లు అదే పనిగా కోహ్లి ఆట తీరును విమర్శించడం.. వరల్డ్కప్ జట్టులోనూ అతడి స్థానాన్ని ప్రశ్నించడం వంటివి చేశారు.మరికొందరు మాజీ క్రికెటర్లు మాత్రం జట్టు ప్రయోజనాలు, పరిస్థితులకు అనుగుణంగా ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఆడుతున్నాడంటూ కోహ్లిని సమర్థించారు. ఈ నేపథ్యంలో కోహ్లి స్పందిస్తూ.. ‘‘బయట ఎక్కడో కూర్చుని మాట్లాడేవాళ్ల కామెంట్లను పట్టించుకోను. జట్టు కోసం ఏం చేయాలో నాకు తెలుసు’’ అంటూ విమర్శకులకు కౌంటర్ వేశాడు.మీ అంత కాకపోయినా.. మేమూ కాస్త క్రికెట్ ఆడాముఈ క్రమంలో టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సునిల్ గావస్కర్ కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ‘‘అవునా.. చాలా మంది మేము బయట వాగుడు పట్టించుకోం అని గంభీరాలు పలుకుతూ ఉంటారు.మరెందుకని ఇలాంటి రిప్లైలు ఇస్తూ ఉంటారు. మీ అంత కాకపోయినా.. మేమూ కాస్త క్రికెట్ ఆడాము. మాకేమీ అజెండాలు ఉండవు. మేము ఏం చూస్తున్నామో దాని గురించే మాట్లాడతాం.మాకు ఒకరంటే ఇష్టం.. మరొకరంటే కోపం ఉండదు. ఏం జరుగుతుందో దాని గురించే మాట్లాడతాం’’ అని గావస్కర్ అన్నాడు. ఈ నేపథ్యంలో గావస్కర్పై కోహ్లి ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. గతంలో.. కోహ్లిని విమర్శించే క్రమంలో అతడి భార్య అనుష్క శర్మను ఉద్దేశించి గావస్కర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఏకిపారేస్తున్నారు.ప్రతిసారీ కోహ్లి గురించే మాట్లాడటం ద్వారా ఎల్లపుడూ వార్తల్లో ఉండేందుకు చేసే ప్రయత్నమే ఇదంటూ మండిపడుతున్నారు. గతంలో గావస్కర్ 176 బంతుల్లో 36 పరుగులు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. జట్టు ప్రయోజనాల కోసం మీరు ఏం చేసినా చెల్లుబాటే గానీ.. కోహ్లి చేస్తే మాత్రం తప్పా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.విమర్శలు సరికాదుఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజెండరీ పేసర్ వసీం అక్రం స్పందిస్తూ.. కోహ్లి ఒక్కడే జట్టును గెలిపించలేడని.. అనవసరంగా అతడిని తక్కువ చేసి మాట్లాడవద్దని కామెంటేటర్లకు హితవు పలికాడు. ఆర్సీబీలో మిగతా బ్యాటర్లు కూడా రాణిస్తేనే కోహ్లిపై ఒత్తిడి తగ్గి స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలడని అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సీజన్లో వరుస పరాజయాలతో చతికిల పడ్డ ఆర్సీబీ.. హ్యాట్రిక్ విజయాలతో గాడిలో పడింది.చదవండి: ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్ -
కోహ్లి స్ట్రైక్రేటుపై గంభీర్ వ్యాఖ్యలు.. వైరల్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో తనకు ఎలాంటి విభేదాలు లేవని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. మీడియా అత్యుత్సాహం వల్లే తమ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందిందని పేర్కొన్నాడు.అదే విధంగా ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఓపెనర్గా బరిలోకి దిగుతున్న కోహ్లి స్ట్రైక్రేటు గురించి కూడా గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా కోహ్లి- అప్పటి లక్నో మెంటార్ గంభీర్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వీరిద్దరి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, తాజా సీజన్లో కేకేఆర్ మెంటార్గా అవతారమెత్తిన గంభీర్.. ఇటీవలి మ్యాచ్ సందర్భంగా కోహ్లిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు.గొడవ పడితే చూడాలనిఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఓ షోలో విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ‘‘మేము ఇద్దరం గొడవ పడితే చూడాలని అనుకునే వాళ్లే ఎక్కువగా ఉంటారు. వాళ్లను ఈ వీడియోలు నిరాశపరిచి ఉంటాయి’’ అని చమత్కరించాడు.ఈ విషయంపై తాజాగా స్పందించిన గౌతం గంభీర్ కోహ్లి వ్యాఖ్యలతో ఏకీభవించాడు. టీఆర్పీ రేటింగ్ల కోసమే మీడియా ఇలాంటివి ఎక్కువగా ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను, విరాట్ కోహ్లి ఎలాంటి వాళ్లమో, తమ మధ్య అనుబంధం ఎలా ఉంటుందో వారికి తెలియదన్న గౌతీ.. వీలైతే పాజిటివిటీని పెంచే అంశాలను చూపించాలన్నాడు.ఎవరికి వారే ప్రత్యేకంతాను, కోహ్లి పరిణతి చెందిన వ్యక్తులం కాబట్టి ఇలాంటి వాటి గురించి ఎక్కువగా పట్టించుకోమని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక కోహ్లి స్ట్రైక్రేటు గురించి జరుగుతున్న చర్చలపై స్పందిస్తూ.. ‘‘ప్రతి ఒక్క ఆటగాడు భిన్నంగా ఉంటాడు.మాక్స్వెల్ ఆడినట్లు కోహ్లి ఆడకపోవచ్చు. కోహ్లి తీరుగా మాక్స్వెల్ షాట్లు బాదలేకపోవచ్చు. పదకొండు మంది సభ్యులున్న జట్టులో ఎవరికి వారే ప్రత్యేకం. బ్యాటింగ్ ఆర్డర్లో 1- 8 వరకు విధ్వంసకర బ్యాటర్లు అందుబాటులో ఉంటే స్కోరు 300 కావొచ్చు లేదంటే 30 పరుగులకే ఆలౌట్ కావచ్చు.జట్టును గెలిపించినపుడు స్ట్రైక్రేటు 100 ఉన్నా బాగానే అనిపిస్తుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం 180 స్ట్రైక్రేటు కూడా మన కంటికి కనిపించదు. మ్యాచ్ జరిగే వేదిక, పిచ్ పరిస్థితి, ప్రత్యర్థి జట్టు.. ఇలా భిన్న అంశాలపై స్ట్రైక్రేటు ఆధారపడి ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు’’ అంటూ విరాట్ కోహ్లికి గంభీర్ మద్దుతుగా నిలిచాడు. కాగా ఈ సీజన్లో కోహ్లి ఆడిన 9 మ్యాచ్లలో కలిపి 145.76 స్ట్రైక్రేటుతో 430 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. -
SRH Vs RCB: తెలుగులో మాట్లాడిన కమిన్స్.. ఆర్సీబీకి వార్నింగ్!
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో సత్తా చాటుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం తలపడనుంది. ఇందుకోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది.ఈ సీజన్లో ఇప్పటికే ఆర్సీబీని తమ సొంతగడ్డపైనే ఓడించిన సన్రైజర్స్ ఉప్పల్లోనూ ఆ సీన్ను రిపీట్ చేయాలని భావిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(287) సాధించిన రైజర్స్... హైదరాబాద్లో తమ రికార్డును బ్రేక్ చేయాలని పట్టుదలగా ఉంది.ప్యాట్ కమిన్స్ బృందం జోరు చూస్తుంటే ఇదేమీ అసాధ్యం కాకపోవచ్చనే అనిపిస్తోంది. మరోవైపు.. ఆర్సీబీ సైతం ఘోర పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్న తరుణంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ ఖాయమంటూ ఈ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.The crossover we all love to see 🤩 pic.twitter.com/nLlDlUcH7E— SunRisers Hyderabad (@SunRisers) April 24, 2024ఇదిలా ఉంటే.. ఈ కీలక పోరుకు ముందే సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ను తన మాటలతో ఖుషీ చేశాడు. ‘‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.కమిన్స్ అంటే క్లాస్ అనుకుంటివా? మాస్.. ఊరమాస్.. ఎస్ఆర్హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ’’ అంటూ తెలుగులో డైలాగ్స్ చెప్పి దుమ్ములేపాడు. తగ్గేదేలే అంటూ ఆర్సీబీకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు స్పందించిన ఆరెంజ్ ఆర్మీ.. ‘‘కెప్టెన్ ఓ రేంజు.. మామ మనోడే.. సూపర్ కమిన్స్’’ అంటూ కామెంట్లతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకతో సన్రైజర్స్ తలరాత మారిపోయింది. గత మూడేళ్లుగా వైఫల్యాలతో చతికిల పడ్డ రైజర్స్ను తన కెప్టెన్సీతో ఈ సీజన్లో హాట్ ఫేవరెట్గా మార్చాడు ఈ పేస్ బౌలర్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లకు తోడు బౌలర్లు కూడా రాణిస్తుండటంతో తన కెప్టెన్సీ వ్యూహాలకు మరింత పదును పెట్టి వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఇక ఈ ఎడిషన్లో సన్రైజర్స్ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో ఐదు గెలిచి పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ఆర్సీబీ ఎనిమిదింట ఏడు ఓడి అట్టడుగున ఉంది.చదవండి: IPL 2024: అన్ని జట్లు ఓడాయి.. ఒక్క సన్రైజర్స్ మాత్రమే..!ఓవైపు కెప్టెన్గా #OrangeORangeu అనిపిస్తున్నాడు 💪అది సరిపోదు అన్నట్టు.. ఈ Mass డైలాగ్స్ 💥@patcummins30 మామ.. నువ్వు సూపర్ అంతే! 🤩చూడండి#TATAIPLHyderabad v Bengaluru | రేపు 6 PM నుంచిమీ #StarSportsTelugu లో#IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu pic.twitter.com/wv5IzPZhFe— StarSportsTelugu (@StarSportsTel) April 24, 2024 -
చిన్న పిల్లాడిలా కోహ్లి సంబరాలు.. వాళ్లకు థాంక్స్!
ఐపీఎల్-2024లో ఎట్టకేలకు రాయల్ చాలెంజర్స్ పరాజయాలకు బ్రేక్ పడింది. సన్రైజర్స్ హైదరాబాద్తో గురువారం నాటి మ్యాచ్లో గెలిచిన ఆర్సీబీ.. ఈ సీజన్లో రెండో గెలుపు నమోదు చేసింది. దీంతో ఆర్సీబీ శిబిరంలో నవ్వులు పూశాయి.ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అయితే.. చిన్నపిల్లాడిలా సంతోషంతో గంతులేశాడు. రైజర్స్ వికెట్ పడిన ప్రతిసారీ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్న కోహ్లి.. జట్టు విజయం ఖరారు కాగానే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందుకు స్పందనగా.. ‘‘చాలా రోజుల తర్వాత కోహ్లి మనస్ఫూర్తిగా నవ్వడం చూస్తున్నాం’’ అంటూ కింగ్ కోహ్లి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.కాగా ఐపీఎల్-2024లో సన్రైజర్స్తో మ్యాచ్లో ఆర్సీబీ 35 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఉప్పల్లో జరిగిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి అర్ధ శతకం(43 బంతుల్లో 51) సాధించాడు. రజత్ పాటిదార్ (20 బంతుల్లో 50) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. కామెరాన్ గ్రీన్(37 నాటౌట్) సైతం రాణించాడు.దీంతో 206 పరుగులు స్కోరు చేసిన ఆర్సీబీ.. లక్ష్య ఛేదనకు దిగిన సన్రైజర్స్ను 171 పరుగులకే కట్టడి చేసింది. తద్వారా రైజర్స్ విజయపరంపరకు బ్రేక్ వేసి.. సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో తమకు ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది.ఇక ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది రెండో విజయం. సీజన్లో తమ రెండో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై గెలుపొందిన ఆర్సీబీ.. మళ్లీ ఇప్పుడిలా హైదరాబాద్ గడ్డపై గెలుపును రుచిచూసింది. దీంతో ఆటగాళ్లలో ఒక్కసారిగా ఉత్సాహం నిండింది.ఇక రైజర్స్ సొంతమైదానంలో జరిగిన ఈ మ్యాచ్కు ఆరెంజ్ ఆర్మీతో పాటు ఆర్సీబీ 12th మ్యాన్ ఆర్మీ కూడా భారీగానే తరలి వచ్చింది. జట్టు జెర్సీలు ధరించి ఫాఫ్ డుప్లెసిస్ బృందాన్ని చీర్ చేశారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో తమకు మద్దతుగా నిలిచిన ఉప్పల్ ప్రేక్షకులకు కోహ్లి చేతులు జోడిస్తూ ధన్యవాదాలు తెలపడం విశేషం. కాగా ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్లలో రెండు గెలిచిన ఆర్సీబీ 4 పాయింట్లతో ప్రస్తుతం పదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు.. సన్రైజర్స్ ఎనిమిదింట ఐదు గెలిచి మూడో స్థానంలో ఉంది.చదవండి: SRH Vs RCB: అరెరే.. ఏమైంది మీకు! కావ్య రియాక్షన్ వైరల్ Yesterday RCB Fans Be Like......#RCBvsSRH #SRHvsRCB #ViratKohli𓃵pic.twitter.com/VfXTDJNJP0— Analytic Board (@AnalyticB0ard) April 26, 2024 -
కోహ్లి.. ఇలాగేనా ఆడేది?: టీమిండియా దిగ్గజం విమర్శలు
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ పెదవి విరిచాడు. స్థాయికి తగ్గట్లు రాణించడంలో కోహ్లి విఫలమవుతున్నాడని విమర్శించాడు.ఐపీఎల్-2024లో భాగంగా సన్రైజర్స్- ఆర్సీబీ మధ్య బుధవారం నాటి మ్యాచ్లో కోహ్లి అర్ధ శతకం బాదిన విషయం తెలిసిందే. ఉప్పల్ వేదికగా కోహ్లి 43 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 51 పరుగులు చేశాడు.ఈ క్రమంలో కోహ్లి స్ట్రైక్ రేటు 118.6గా నమోదైంది. ఇక రైజర్స్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లో కోహ్లితో పాటు రజత్ పాటిదార్(20 బంతుల్లో 50) హాఫ్ సెంచరీ చేయగా.. కామెరాన్ గ్రీన్(20 బంతుల్లో 37 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.ఈ నేపథ్యంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇందులో కీలక పాత్ర మాత్రం 250 స్ట్రైక్రేటుతో అర్ధ శతకం సాధించిన పాటిదార్దే.ఇక లక్ష్య ఛేదనలో 171 పరుగులకే సన్రైజర్స్ పరిమితం కావడంతో ఆర్సీబీ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ కోహ్లి స్ట్రైక్రేటు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘ఆరంభంలో బాగానే ఆడినా మధ్యలో కాస్త వెనుకబడినట్లు కనిపించింది. నంబర్స్ గురించి స్పష్టంగా ప్రస్తావించలేకపోతున్నాను గానీ.. 31- 32 స్కోరు వరకు అతడు బౌండరీ బాదలేకపోయాడు.ఇన్నింగ్స్ తొలి బంతి నుంచి క్రీజులో ఉండి.. 14- 15 ఓవర్ వరకు బ్యాటింగ్ కొనసాగించాలనుకుంటే ఈ స్ట్రైక్రేటు మాత్రం సరిపోదు. ఫ్రాంఛైజీ కోహ్లి వంటి టాప్ క్లాస్ ప్లేయర్నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ ఆశించదు’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్ట్పోర్స్ షోలో వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లి ఇంకాస్త మెరుగ్గా ఆడితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.కాగా సన్రైజర్స్తో మ్యాచ్లో పరుగుల విధ్వంసం సృష్టించి ఆర్సీబీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన రజత్ పాటిదార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది రెండో గెలుపు. ఈ విజయంతో ఆర్సీబీ ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరినప్పటికీ పట్టికలో మాత్రం అట్టడుగున పదో స్థానంలోనే కొనసాగుతోంది.Lofted with perfection and style! 😎@RCBTweets move to 61/1 after 6 oversWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #SRHvRCB | @imVkohli pic.twitter.com/WdVkWT99yz— IndianPremierLeague (@IPL) April 25, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SRH: మాకున్న బలం అదే.. తగ్గేదేలే: కమిన్స్
ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. సొంతగడ్డపై తమకు ఎదురైన పరాభవానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రైజర్స్పై ప్రతీకారం తీర్చుకుంది. ఉప్పల్ మైదానంలో ప్యాట్ కమిన్స్ బృందాన్ని 35 పరుగుల తేడాతో ఓడించి ఈ సీజన్ లెక్క సరిచేసింది.రాణించిన కోహ్లి, పాటిదార్, గ్రీన్ ఇరుజట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లి (51), రజత్ పాటిదార్(20 బంతుల్లో 50) అర్ధ శతకాలు సాధించగా.. కామెరాన్ గ్రీన్(20 బంతుల్లో 37*) దూకుడుగా ఆడాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన ఆర్సీబీ 206 పరుగులు స్కోరు చేసింది. ఇప్పటికే ఈ సీజన్లో మూడుసార్లు 250 పైచిలుకు పరుగులు సాధించిన రైజర్స్ ఈ లక్ష్యాన్ని తేలికగ్గానే ఛేదిస్తుందని ఆరెంజ్ ఆర్మీ భావించింది.దూకుడుగా ఆరంభించి.. భారీ మూల్యమే చెల్లించికానీ ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు 171 పరుగులకే రైజర్స్ కథ ముగిసిపోయింది. విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్(1) ఆదిలోనే అవుట్ కావడం.. అభిషేక్ శర్మ(13 బంతుల్లో 31) మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడం ప్రభావం చూపింది.అయినప్పటికీ దూకుడును కొనసాగించిన రైజర్స్ బ్యాటర్లు ఐడెన్ మార్క్రమ్(7), నితీశ్ రెడ్డి(13), హెన్రిచ్ క్లాసెన్(7)లను ఆర్సీబీ బౌలర్లు త్వరత్వరగా పెవిలియన్కు పంపారు. కాసేపు పోరాడినాఈ క్రమంలో ఆరో స్థానంలో వచ్చిన షాబాజ్ అహ్మద్ (37 బంతుల్లో 40 నాటౌట్) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(15 బంతుల్లో 31) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మిగతా వాళ్ల నుంచి సహకారం అందకపోవడంతో రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి ఓటమిని అంగీకరించింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్ రెండేసి వికెట్లు తీయగా.. విల్ జాక్స్, యశ్ దయాళ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఓటమిపై స్పందిస్తూ.. తమ బ్యాటర్లు దూకుడుగా ఆడటాన్ని సమర్థించాడు. ‘‘ఈరోజు మాకు సరైన ముగింపు లభించలేదు. తొలుత పరుగులు కట్టడి చేయలేకపోయాం.ప్రతి మ్యాచ్ గెలవలేంఆ తర్వాత లక్ష్య ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోయాం. నిజానికి మేము ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేది. ఏదేమైనా మా వాళ్లు చాలా బాగా ఆడారు. టీ20 క్రికెట్లో ప్రతీ మ్యాచ్ గెలవడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ ఓటమినే తలచుకుంటూ కూర్చోము.మాకున్న బలం అదేరిస్క్ ఉన్నా సరే దూకుడుగా బ్యాటింగ్ చేయడమే మాకున్న బలం. అయితే, ప్రతి మ్యాచ్లోనూ ఇది వర్కౌట్ అవ్వాలని లేదు. ఒకటీ రెండు మ్యాచ్లలో ప్రతికూల ఫలితాలు రావచ్చు. ఈ మ్యాచ్లో మేము మెరుగైన స్కోరే చేశాం. ఇక ముందు కూడా మా వాళ్లు ఇంతే దూకుడుగా బ్యాటింగ్ చేయడమే మంచిదని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. చదవండి: #Kavya Maran: అరెరే.. ఏమైందిరా మీకు! కావ్య రియాక్షన్ వైరల్ 📍 Hyderabad VIBE Virat Kohli ☺️ ❤️#TATAIPL | #SRHvRCB | @RCBTweets | @imVkohli pic.twitter.com/llKITaKky3— IndianPremierLeague (@IPL) April 26, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రూ. 17.5 కోట్లు ఇస్తే సరిపోతుందా?.. పాపం అతడు!
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి.. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఫాఫ్ డుప్లెసిస్ బృందంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, గతంలో ఆర్సీబీకి ఆడిన ఆరోన్ ఫించ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో ఆర్సీబీ వైఫల్యాలకు కారణాలు ఇవేనంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘వేలం సమయంలోనే వారు తప్పటడుగు వేసినట్లు కనిపించింది. బ్యాటర్ల కోసం కోట్లకు కోట్లు ఖర్చుపెట్టారు గానీ బౌలింగ్ విభాగంపై పెద్దగా దృష్టి సారించలేదు.ముఖ్యంగా ఈ జట్టులో ఒక్క వరల్డ్క్లాస్ స్పిన్నర్ కూడా లేడు. ఈ విషయంలో కేకేఆర్ పూర్తిగా విజయవంతమైంది. వాళ్లకు సునిల్ నరైన్ రూపంలో ప్రపంచస్థాయి స్పిన్ బౌలర్ దొరికాడు. ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పేయగలడు.ఆర్సీబీకి మాత్రం ఇలాంటి స్పిన్నర్ లేడు. మరో విషయం ఏమిటంటే.. వాళ్లు పెద్ద మొత్తం వెచ్చించి ఎంతో మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు. వారిలో కామెరాన్ గ్రీన్ కూడా ఒకడు.అతడికి చెల్లించే జీతం భారీ మొత్తంలో ఉంటుంది. అలాంటపుడు సేవలను ఉపయోగించుకోవడంలోనూ తెలివిగా వ్యవహరించాలి కదా! నిజానికి మిడిలార్డర్లో కంటే టాపార్డర్లోనే గ్రీన్ మెరుగ్గా రాణించగలడు.కానీ అతడిని మిడిలార్డర్లోనే పంపిస్తున్నారు. తనకు సౌకర్యంగా లేని స్థానంలో వెళ్లి బ్యాటింగ్ చేయమని చెప్తే ఏ ఆటగాడైనా ఏం చేయగలడు. కచ్చితంగా ఇబ్బంది పడతాడు కదా’’ అని ఆరోన్ ఫించ్ ఆర్సీబీ నిరాశజనక ప్రదర్శనకు ఈ రెండూ కారణం కావొచ్చని స్టార్ స్పోర్ట్స్ షోలో చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా స్టార్ కామెరాన్ గ్రీన్ కోసం ఆర్సీబీ రూ. 17.50 కోట్లు వెచ్చించి ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది. అయితే, టాపార్డర్లో పవర్ఫుల్ స్ట్రైకర్ అయిన గ్రీన్ను మిడిలార్డర్లో ఆడిస్తోంది. విరాట్ కోహ్లితో కలిసి ఫాఫ్ డుప్లెసిస్ ఓపెనింగ్ చేస్తుండగా.. గత మ్యాచ్లో విల్జాక్స్ వన్డౌన్లో రాగా..పేస్ఆల్రౌండర్ గ్రీన్ ఐదో స్థానంలో బరిలోకి దిగాడు.చదవండి: MS Dhoni Angry Video: ‘నన్నెందుకు చూపిస్తున్నావు?’.. ధోని సీరియస్.. వీడియో వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నువ్వు చాలా మంచోడివి ప్యాట్: కోహ్లి కామెంట్స్ వైరల్
ఐపీఎల్-2024లో ఏప్రిల్ 15న చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ సాధించిన స్కోరు 287/3. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 41 బంతుల్లోనే 102 పరుగులతో చెలరేగగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 34, వన్డౌన్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 31 బంతుల్లో 67 పరుగులు రాబట్టారు.ఇక నాలుగో స్థానంలో వచ్చిన వచ్చిన ఐడెన్ మార్క్రమ్ 17 బంతుల్లో 32, ఐదో నంబర్లో బ్యాటింగ్ చేసిన అబ్దుల్ సమద్ 10 బంతుల్లోనే 37 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. వీరి అద్భుత ఇన్నింగ్స్ ఫలితమే 287. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఆఖరి వరకు పట్టుదలగా పోరాడింది. కానీ 262 పరుగులకే పరిమితమై ఓటమిని ఆహ్వానించింది. చిన్నస్వామి స్టేడియాన్ని పరుగుల వరదతో ముంచెత్తిన సన్రైజర్స్ 25 పరుగుల తేడాతో గెలుపొంది సత్తా చాటింది.ఇప్పుడు మళ్లీ ఏప్రిల్ 25న ఇరు జట్లు మరోసారి ముఖాముఖి తలపడనున్నాయి. ఏడింట ఐదు విజయాలతో మూడో స్థానంలో ఉన్న సన్రైజర్స్.. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు(ఎనిమిదికి ఒక్కటే విజయం) నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఆర్సీబీకి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగు పరచుకునేందుకు సన్రైజర్స్ మరో విజయానికి గురిపెట్టగా.. ఆర్సీబీ పరువు కోసం పాకులాడుతోంది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్- ఆర్సీబీ మధ్య గురువారం నాటి పోరు రసవత్తరంగా మారనుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు జట్లు ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ పూర్తి చేసుకోగా.. రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్- ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మధ్య ఈ సందర్భంగా ఆసక్తికర సంభాషణ జరిగింది.కోహ్లి దగ్గరికి వచ్చిన కమిన్స్.. ‘‘వికెట్ ఫ్లాట్గా కనిపించేలా చేస్తానని కోచ్ చెప్తున్నాడు. నేనైతే ఆ విషయం విన్నాను మరి’’ అని టీజ్ చేశాడు. ఇందుకు స్పందనగా.. ‘‘నువ్వు చాలా మంచివాడివి ప్యాట్’’ అని కోహ్లి బదులిచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ఆర్సీబీ షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా గత మ్యాచ్లో కోహ్లి 20 బంతుల్లో 42 పరుగులు చేయగా.. పేస్ బౌలర్ కమిన్స్ 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. -
RCB: ఇంకా రేసులోనే ఆర్సీబీ! అలా అయితే ప్లే ఆఫ్స్లో!
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శనతో అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, మహ్మద్ సిరాజ్ వంటి టాప్ స్టార్లు జట్టులో ఉన్నా వరుస వైఫల్యాలతో చతికిలపడింది.ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి రెండు పాయింట్లతో పట్టికలో అట్టడుగున పదో స్థానంలో ఉంది. ఒక రకంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆర్సీబీ దాదాపుగా నిష్క్రమించినట్లే! అయితే, తిరిగి పుంజుకుంటే మాత్రం పోటీలో నిలిచే అవకాశం ఉంటుంది. అందుకు సాధ్యమయ్యే కొన్ని సమీకరణలు గమనిద్దాం!మరోమాట లేదు.. గెలవాల్సిందేమరోమాట లేకుండా ఆర్సీబీ ఇప్పటి నుంచి ఆడే అన్ని మ్యాచ్లలో తప్పనిసరిగా గెలవాలి. నెట్ రన్రేటు -1.046 మరీ దారుణంగా ఉంది కాబట్టి కచ్చితంగా భారీ విజయాలు సాధించాలి.అదే జరిగితే.. ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లు చేరి మొత్తం 14 అవుతాయి. అదే విధంగా.. నెట్ రన్రేటు కూడా మెరుగుపరచుకుంటే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. కాగా ఆర్సీబీకి తదుపరి సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్(రెండుసార్లు), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇవన్నీ భారీ తేడాతో గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆర్సీబీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.టాప్లో ఉన్న ఆ మూడు జట్లు..పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ తమకు మిగిలిన ఆరు మ్యాచ్లలో ఎన్ని గెలిస్తే(తమపై మినహా) ఆర్సీబీకి అంత మంచిది. లక్నో, చెన్నై, ఢిల్లీ, గుజరాత్, ముంబై, పంజాబ్ కింగ్స్ ఈ జట్లు భారీ తేడాతో విజయం సాధించడం ఆర్సీబీకి ముఖ్యం.ఇంకెలా అంటే..►తొమ్మిదో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ తమకు మిగిలిన ఆరు మ్యాచ్లలో నాలుగు కంటే ఎక్కువ విజయాలు సాధించకూడదు.►ఢిల్లీ క్యాపిటల్స్ మిగిలిన ఐదింటిలో రెండు కంటే.. ముంబై ఇండియన్స్ ఆరింటిలో మూడు కంటే ఎక్కువ గెలవకూడదు.►చెన్నై మిగిలిన ఆరు మ్యాచ్లలో రెండు కంటే.. గుజరాత్ ఐదింటిలో ఒకటి కంటే ఎక్కువ గెలవద్దు.►లక్నో మిగిలిన ఆరు మ్యాచ్లలో ఒకటి కంటే ఎక్కువ గెలవకూడదు.►కేకేఆర్, సన్రైజర్స్ మిగిలిని ఏడు మ్యాచ్లలో ఒకటి కంటే ఎక్కువ విజయాలు సాధిస్తే చాలు!►ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరేందుకు కొన్ని సమీకరణలు మాత్రమే ఇవి. ఇంతా జరిగినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుతుందా అంటే? ఏమో గుర్రం ఎగరావచ్చు! లేదంటే గురువారం నాటి సన్రైజర్స్తో మ్యాచ్లో ఓడి పూర్తిగా నిష్క్రమించనూవచ్చు!!చదవండి: నువ్వు చాలా మంచోడివి ప్యాట్: కోహ్లి కామెంట్స్ వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: అరెరె.. మీరెందుకిలా అంటున్నార్సార్?!
గుజరాత్ టైటాన్స్.. చెన్నై సూపర్ కింగ్స్.. లక్నో సూపర్ జెయింట్స్.. ముంబై ఇండియన్స్.. ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ చేరిన జట్లు.. వీటిలో గుజరాత్- చెన్నై మధ్య టైటిల్ పోరు జరుగగా సూపర్ కింగ్స్ చాంపియన్గా అవతరించింది. ఇక పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ హైదరాబాద్ అట్టడుగున నిలవగా.. ఢిల్లీ క్యాపిటల్స్(9), పంజాబ్ కింగ్స్(8), కోల్కతా నైట్ రైడర్స్(7) కింద నుంచి నాలుగు స్థానాల్లో నిలిచాయి. రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ మెరుగైన ప్రదర్శనతో వరుసగా ఐదు, ఆరో స్థానంలో నిలిచాయి. 2023 పూర్తైన తర్వాత పాయింట్ల పట్టిక స్వరూపం ఇది. ఇక ఇప్పుడు ఐపీఎల్-2024లో సగానికి పైగా మ్యాచ్లు అయిపోయాయి. గతేడాది పట్టికతో తాజా సీజన్ను టేబుల్ను పోలిస్తే టాప్-5 జట్లలో పూర్తి వ్యత్యాసం కనిపిస్తోంది. రాజస్తాన్ రాయల్స్ ఎనిమిదింట ఏడు విజయాలతో నంబర్ వన్లో ఉండగా.. గతేడాది నామమాత్రపు ప్రదర్శనకు పరిమితమైన కోల్కతా, చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న సన్రైజర్స్ ముందుకు దూసుకువచ్చాయి. కేకేఆర్, ఎస్ఆర్హెచ్ ఆడిన ఏడింట ఐదు విజయాలతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఏడింట నాలుగు విజయాలతో టాప్-4లో కొనసాగుతోంది. లక్నో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. అయితే, ఆర్సీబీ, ముంబై మాత్రం చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాయి. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఎనిమిదింట కేవలం మూడుసార్లు గెలవగా..ఫాఫ్ డుప్లెసిస్ బృందం ఆర్సీబీ ఎనిమిదింట ఒక్కటి మాత్రమే గెలిచి ప్లే ఆఫ్స్ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. అయితే..ఈసారి ధనాధన్ బ్యాటింగ్తో దుమ్ములేపుతున్న జట్టు ఏదైనా ఉందంటే.. సన్రైజర్స్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించడంతో పాటు మూడుసార్లు 250కి పైగా స్కోర్లు సాధించి సత్తా చాటింది. కేకేఆర్, ఆర్సీబీ సైతం ఈ మార్కును టచ్ చేశాయి. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు.. ప్రతిసారి హిట్టింగ్ చేస్తే ఐపీఎల్ బోర్ కొట్టడం ఖాయమంటూ వ్యాఖ్యానించడం కొంతమంది అభిమానులకు మింగుడుపడటం లేదు. ముంబై, ఆర్సీబీ, సీఎస్కే వంటి జట్లు పరుగుల వరద పారిస్తే మురిసిపోయే మాజీ క్రికెటర్లు ఈసారి వేరే జట్లు హిట్టింగ్ ఆడితే చూసి ఓర్వలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి టేబుల్ తలకిందులయ్యేట్లుగా కనిపిస్తునందువల్లే బోర్ కొడుతుందంటూ ఇన్ఫ్ల్యూయెన్స్ చేసేలా కామెంట్లు చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈసారి ఇప్పటికైతే ప్లే ఆఫ్స్ రేసులో రాజస్తాన్, కేకేఆర్, ఎస్ఆర్హెచ్, చెన్నై ముందు వరుసలో ఉండగా.. లక్నో, గుజరాత్ సైతం పోటీనిచ్చే అవకాశం ఉంది. సగానికి పైగా మ్యాచ్లు పూర్తయ్యేసరికి ఈ జట్లు టాప్-6లో ఉండగా.. ముంబై, ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో స్థానంలో నిలిచాయి. -
ఇంకెవరు.. నీ భార్యనే: కోహ్లి ఆన్సర్తో షాకైన డీకే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి ఆటతోనే కాదు తన చురుకుదనంతో అభిమానులను ఫిదా చేస్తూ ఉంటాడు. క్రీజులో దిగగానే భారీ షాట్లతో విరుచుకుపడగల ఈ రన్ మెషీన్.. మైదానంలో తన చేష్టలతోనూ వినోదం పంచుతూ ఉంటాడు. అదే విధంగా.. సహచర ఆటగాళ్లతోనూ సరదాగా ఉంటూ తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదభరింతగా మారుస్తాడు. తాజాగా ఆర్సీబీ షేర్ చేసిన ఓ వీడియో ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. తోటి ప్లేయర్ దినేశ్ కార్తిక్ అడిగిన ప్రశ్నలకు కోహ్లి ఊహించని సమాధానమివ్వడమే గాకుండా.. మళ్లీ అతడిని మాట్లాడకుండా చేశాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఐపీఎల్-2024లో మ్యాచ్ల నుంచి విరామం దొరికిన సమయంలో ఆర్సీబీ తమ ఆటగాళ్లతో పలు ఆసక్తికర వీడియోలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో.. ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ హోస్ట్గా వ్యవహరిస్తూ ఉండగా... కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, పేసర్ మహ్మద్ సిరాజ్ తదితరులతో కలిసి కోహ్లి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్లో పాల్గొన్నాడు. ఇంకెవరు నీ భార్యనే! ఇందులో భాగంగా.. డీకే ముందుగా.. ‘‘క్రికెటర్ కాకుండా నా ఫేవరెట్ ప్లేయర్ ఎవరో చెప్పగలరా?’’ అని అడగ్గా.. కోహ్లి వెంటనే తడుముకోకుండా .. ‘‘నీ భార్య’’ అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో క్షణంపాటు ఆశ్చర్యంలో మునిగిన డీకే.. ‘‘అవును.. సరైన సమాధానం.. కానీ నిజానికి నా మనసులో వేరే పేరు అనుకున్నా’’ అన్నాడు. డీకే అలా అనగానే అక్కడ నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో కోహ్లి ఫ్యాన్స్ను ఆకర్షిస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.. మోసం చేసిన మొదటి భార్య? కాగా దినేశ్ కార్తిక్ భార్య పేరు దీపికా పళ్లికల్. ఆమె స్వ్కాష్ ప్లేయర్. భారత్ తరఫున అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించారు. అయితే, దీపికా కంటే ముందు డీకే నికితా వంజరాను పెళ్లాడాడు. కానీ ఆమె డీకేతో వివాహ బంధంలో ఉండగానే భర్త స్నేహితుడు, టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ విజయ్తో సాన్నిహిత్యం పెంచుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో డీకే ఆమెకు విడాకులివ్వగా.. మురళీ విజయ్ను పెళ్లాడింది. తర్వాత డీకే దీపికాను పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో కోహ్లి బ్యాటర్గా రాణిస్తున్నా ఆర్సీబీ చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం ఒక్కటి గెలిచి పట్టికలో పదో స్థానంలో ఉంది. అయితే, కోహ్లి మాత్రం 361 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతానికి తన వద్ద పెట్టుకున్నాడు. మరోవైపు.. దినేశ్ కార్తిక్ సైతం జట్టు కష్టాల్లో ఉన్నపుడు బ్యాట్ ఝులిపిస్తూనే ఉన్నాడు. అయినా ఫలితం మాత్రం ఉండటం లేదు. Virat Kohli - the legend. 🤣👌 pic.twitter.com/1TMIPxEQT2 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
RCB: అక్కడే మొదలు.. అక్కడే ముగిస్తా: కేఎల్ రాహుల్
‘‘ఆ రోజు విరాట్ అక్కడే ఉన్నాడు. కోచ్ రే జెన్సింగ్స్.. ఇంకా మిగతా సహాయక సిబ్బంది కూడా ఉన్నారు. అప్పుడు విరాట్ వచ్చి.. ‘నీకు ఈ కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టడం ఇష్టమేనా? ఆర్సీబీకి ఆడతావా? అని అడిగాడు. అందుకు బదులుగా.. ‘ఏంటీ జోక్ చేస్తున్నావా?.. నా చిరకాల కల అది’ అని అన్నాన్నేను. అప్పుడు విరాట్.. ‘అవును.. జోక్ చేశానులే.. అయినా.. ఇది నీకు ఆప్షన్ కాదు.. ముందు ఈ కాంట్రాక్టు మీద సంతకం పెట్టు’ అన్నాడు. నేను అలాగే చేశాను. అప్పుడు వెంటనే విరాట్ స్పందిస్తూ.. ‘ఇక నుంచి నీ ప్రయాణం క్రేజీగా ఉండబోతోంది. వచ్చే రెండు నెలలు నీకు ఫుల్ మజా’ అంటూ నన్ను ఆటపట్టించాడు’’ అని టీమిండియా స్టార్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన నాటి జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు. కాగా కర్ణాటకకు చెందిన కన్ననూర్ లోకేశ్ రాహుల్ 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అరంగేట్రం చేశాడు. ఆ ఏడాది దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టి ఐపీఎల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. కేకేఆర్తో మ్యాచ్తో ఎంట్రీ సొంతమైదానం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో ఆర్సీబీ తరఫున అరంగేట్రం చేశాడు. ఇక ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్(కెప్టెన్)కు ఆడిన రాహుల్.. 2022లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. తమ తొలి సీజన్లోనే లక్నోను ప్లే ఆఫ్స్ చేర్చి సత్తా చాటాడు. ఇక ఐపీఎల్-2024లోనూ ప్రస్తుతం లక్నో పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆడిన ఆరు మ్యాచ్లలో మూడు గెలిచి ఐదో స్థానంలో ఉంది. శుక్రవారం నాటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో లక్నో వేదికగా సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఇదిలా ఉంటే.. లక్నోకు సారథిగా ఉన్నా కేఎల్ రాహుల్ మనసులో ఆర్సీబీకి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. తన సొంత రాష్ట్రానికి చెందిన ఫ్రాంఛైజీ కావడంతో పాటు.. తనకు లైఫ్ కూడా ఇచ్చిన ఆర్సీబీ అంటే అతడికి గౌరవం. ఈ విషయాన్ని తాజాగా రవిచంద్రన్ అశ్విన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు రాహుల్. అక్కడే మొదలు.. అక్కడే ముగిస్తా ‘‘ఆ రెండు నెలలు ఆర్సీబీలో నేను చాలా నేర్చుకున్నాను. మంచి అనుభవం గడించాను. అంతా త్వరత్వరగా జరిగిపోయింది. బెంగళూరుకు ఆడటం నాకెల్లప్పుడూ ఇష్టమే. నా కెరీర్ మొదలైందే అక్కడ! అక్కడే కెరీర్ ముగిస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నా. ఏదేమైనా భిన్న జట్లతో.. భిన్న ప్లేయర్లతో కలిపే ఐపీఎల్ ఓ అద్భుతమైన టోర్నీ’’ అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. చదవండి: హార్దిక్ను పట్టించుకోని ఆకాశ్.. రోహిత్ మాట విని అలా! వైరల్ వీడియో var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాములమ్మ ఆలోచనలు ఏంటి? కాంగ్రెస్లో కొనసాగుతారా.. లేక?
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తాం: ఐజీ వినీత్ బ్రిజ్లాల్
‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
Summer special థండయ్ కుల్ఫీ రెసిపీ
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
తప్పక చదవండి
- ‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- Pavithra Chari నా కల నెరవేరింది, ఆయనతో పనిచేయడం నా అదృష్టం
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement