-
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
పశ్చిమ బెంగాల్లోని బన్గావ్ నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగుతోంది. టీఎంసీ, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. సీఏఏ అనుకూల ప్రచారంతో బీజేపీ.. వ్యతిరేక ప్రచారంతో టీఎంసీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. మరి.. ఎక్కువ సంఖ్యలో ఉన్న మథువాల మద్దతు ఎవరికి ఉంది..? బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా..? లేక టీఎంసీ మళ్లీ పుంజుకుంటుందా..?బన్గావ్.. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దులోని లోక్సభ స్థానం. ఈ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో మథువాల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ పార్టీల గెలుపోటములను నిర్ణయించేది వాళ్లే. దీంతో బీజేపీ, తృణమూల్ ఈ రెండూ పార్టీలు మథువా సామాజికవర్గానికి చెందిన వారినే బరిలోకి దించాయి. గత ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందిన శంతను కుమార్ బీజేపీ నుంచి మళ్లీ పోటీ చేస్తుండగా.. అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బిశ్వజిత్ దాస్ రంగంలో దిగారు.బన్గావ్ లోక్సభ స్థానం 2009లో ఏర్పడింది. స్వాతంత్య్రం అనంతరం, 1971లో హిందూ శరణార్థులు భారీగా బనగావ్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో ఎక్కువ మంది వలస వచ్చారు. వీరిలో అత్యధికులు మథువాలే. ప్రస్తుతం బన్గావ్ ఓటర్లలో 67 శాతం దాకా వాళ్లే ఉన్నారు. ఇప్పుడు కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం తేవడంతో సహజంగానే వీరంతా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు.ఇక.. బన్గావ్ నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉంది. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరుగురు ఎమ్మెల్యేలే ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ ప్రచారాన్ని బన్గావ్ నుంచి ప్రారంభించిన మోదీ.. మథువా సామాజికవర్గానికి పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆ సామాజికవర్గానికి చెందిన అత్యధిక ఓట్లు బీజేపీకే పడ్డాయి. అలా బన్గావ్లో తొలిసారి బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి శంతను ఏకంగా లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచి కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.అటు.. బన్గావ్ రాజకీయాలను బీనాపాణి దేవి కుటుంబం శాసిస్తోంది. 1947లో బీనాపాణి దేవి, ఆమె భర్త ప్రమథ్ రంజన్ ఠాకూర్ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి దక్షిణ కోల్కతాలోని బల్లిగంజ్లో స్థిరపడ్డారు. ప్రమథ్ ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు. మథువాల హక్కుల కోసం పోరాడారు. వలస వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం కోసం.. స్థానిక ఠాకూర్ నగర్లో ఆయన భూమి కొనుగోలు చేశారు. ఆ స్థలంలో శరణార్థుల కోసం తొలి ప్రైవేట్ కాలనీ నిర్మించారు. ఆ తర్వాత ప్రమథ్ 1962లో కాంగ్రెస్ అభ్యర్థిగా హన్స్ఖాలీ అసెంబ్లీ స్థానం నుంచి గెలవగా.. కుమారుడు కపిల్ కృష్ణ ఠాకూర్ 2014లో ఎంపీ అయ్యారు. ఆయన మరణానంతరం భార్య మమత 2015 ఉప ఎన్నికలో గెలిచారు. చిన్న కుమారుడు మంజుల్ కృష్ణ ఠాకూర్ టీఎంసీ ఎమ్మెల్యేగా చేసి ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆయన కుమారుడే బీజేపీ అభ్యర్థి శంతను.మరోవైపు.. సీఏఏను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మథువా వర్గాన్ని తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపిందని మండిపడుతోంది. మథువాలకు ఇప్పటికే పౌరసత్వం, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు ఉండగా.. మళ్లీ కొత్తగా పౌరసత్వం ఇస్తామని బీజేపీ ఎలా చెబుతోందంటూ టీఎంసీ ప్రశ్నిస్తోంది. అసలు మథువాలు భారతీయ పౌరులు కాకపోతే.. వారు ఓటు ఎలా వేశారు..? ప్రజాప్రతినిధులుగా పార్లమెంట్కు.. బెంగాల్ అసెంబ్లీకి ఎలా ఎన్నికయ్యారు అని నిలదీస్తోంది. మొత్తానికి హోరాహోరీగా ప్రచారం చేస్తున్న రెండు పార్టీల్లో మథువాలు ఎవరికి మద్దతుగా నిలుస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. -
ఎవరీ శ్యామ్ రంగీలా? మోదీపై ఎందుకు పోటీ చేయాలనుకున్నారు
లోక్సభ ఎన్నికల వేళ అందరి చూపు వారణాసి పార్లమెంట్ స్థానం వైపే. ఎందుకంటే ప్రధాని మోదీ ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో స్టాండప్ కమెడియన్ 'శ్యామ్ రంగీలా' ప్రధాని మోదీపై పోటీ చేయాలనీ ప్రయత్నించారు. అయితే అతని నామినేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో తిరస్కరణకు గురైంది. దీంతో మోదీ పోటీ చేస్తున్న వారణాసి బరిలో దిగాలనుకున్న శ్యామ్ రంగీలా ఎవరనేది ప్రశ్నగా మారిపోయింది.. ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ చూసెయ్యండి.రాజస్థాన్కు చెందిన శ్యామ్ రంగీలా.. ప్రధాని మోదీ గొంతును మిమిక్రీ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. ఈ ఎన్నికల్లో ఆయనపైనే పోటీ చేస్తున్నట్టు ప్రకటించి వార్తల్లోకెక్కాడు. ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై బీజేపీ సర్కార్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాడు శ్యామ్ రంగీలా. నామినేషన్ తిరస్కరణకు గురవడంతో.. ప్రధానిపై పోటీ చేసే అవకాశం మిస్ అయ్యాడు. అయితే నామినేషన్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.మే 10, 13వ తేదీల్లో నామినేషన్ వేయడానికి ప్రయత్నించగా.. తన పత్రాలను ఎవరూ తీసుకోలేదంటూ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశాడు శ్యామ్ రంగీలా. చివరి రోజైన మే 14న ఇదే పరిస్థితి అని తెలిపాడు. అనేక ప్రయత్నాల తరువాత నామినేషన్ల గడువు ముగియడానికి రెండు నిమిషాల ముందు.. అధికారులు తన డాక్యుమెంట్లు తీసుకున్నారని చెప్పాడు.మరుసటిరోజు ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించి శ్యామ్ రంగీలా పత్రాలను తిరస్కరించారు. నామినేషన్ సంపూర్ణంగా లేదని, అఫిడవిట్పై ప్రమాణం చేయలేదని పేర్కొన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తన పత్రాలను తిరస్కరించారని శ్యామ్ రంగీలా ఆరోపించారు.లోక్సభ ఎన్నికల చివరి విడతలో భాగంగా జూన్ 1న వారణాసి స్థానానికి పోలింగ్ జరగనుంది. దీనికి మే 14న ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ తరపున యూపీ పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ బరిలోకి దిగారు. వారణాసిలో పోటీకి మొత్తం 55 మంది నామినేషన్లు వేయగా.. 36 పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రధాని మోజార్టీ పెంచేందుకే పోటీలో ఉన్నవారిని తప్పిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.ఆధ్యాత్మిక నగరమైన వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీచేయడం వరుసగా ఇది మూడోసారి. తొలిసారి 2014లో ఇక్కడి నుంచి పోటీచేసిన ప్రధాని.. 56శాతం ఓట్లతో విజయం సాధించారు. 2019లో దాదాపు 5 లక్షల మోజార్టీతో తిరుగులేని విజయం దక్కించుకున్నారు. ఈసారి మెజార్టీ 5లక్షలు దాటి పోతుందని ధీమా వ్యక్తంచేస్తోంది బీజేపీ. ఓ కమెడియన్ పోటీచేసినంత మాత్రాన.. మోదీ ఆధిక్యత తగ్గుతుందని అనుకోవడం విపక్షాల తెలివితక్కువతనమని కొట్టిపారేసింది. -
లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోరు జోరుగా సాగుతున్న తరుణంలో.. బీహార్లో మరో వారసత్వ పోరుకు తెరలేచింది. బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన.. లాలూ ప్రసాద్ యాదవ్.. ఇప్పుడు తన కూతుళ్లను ఎన్నికల బరిలో నిలిపారు. వారే మిసా భారతి.. రోహిణి ఆచార్య. అసలు మిసా అంటే ఏమిటి..? రోహిణికి లాలూ ఆ పేరు ఎందుకు పెట్టారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.బీహార్లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలు మీసా భారతి, రోహిణి ఆచార్య పోటీ చేస్తున్నారు. దీంతో వీరి గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. వీరి పేర్ల వెనుక ఉన్న అర్థం ఏంటి..? అసలు లాలు యాదవ్ ఆ పేరు పెట్టడం వెనుక ఏమైనా స్టోరీ ఉందా అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సర్చ్ చేసేస్తున్నారు.మిసా భారతి1976 దేశంలో ఎమర్జెన్సీ విధించిన నాటి రోజులు. అప్పటి ప్రభుత్వం పలువురు నేతలను జైల్లో పెట్టింది. వారిలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారు. లాలూ ప్రసాద్ జైల్లో ఉన్నప్పుడే ఆయన భార్య రబ్రీదేవి కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే.. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన నేతలను, కార్యకర్తలను జైలులో పెట్టే చట్టాన్ని 'మిసా' అని పిలుస్తారు. దీంతో తానున్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ తన మొదటి కుమార్తెకు లాలూ ప్రసాద్ యాదవ్ 'మిసా భారతి' అని పేరు పెట్టారురోహణి ఆచార్యఇక.. తన రెండో కూతురు రోహణి ఆచార్యకు ఒక వైద్యురాలి పేరు వచ్చేలా పెట్టారు లాలూ ప్రసాద్ యాదవ్. 1979లో లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి మరోసారి తల్లి అయ్యారు. అయితే.. ఆమెకు డెలివరీకి ముందు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో రబ్రీదేవీకి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆపరేషన్ గురించి తెలిసి భయపడిన లాలూ యాదవ్కు డాక్టర్ కమలా ఆచార్య ధైర్యం చెప్పారు. ఆ తరువాత రబ్దీదేవికి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు.ఆపరేషన్ పూర్తయిన తరువాత.. ఆపరేషన్కు అయిన ఖర్చును కూడా లాలూ యాదవ్ నుంచి తీసుకునేందుకు డాక్టర్ కమలా ఆచార్య ఒప్పుకోలేదు. అంతే కాకుండా రెండో కుమార్తె పుట్టిన నక్షత్రం రోహిణి కావడంతో.. డాక్టర్ పేరు, రోహిణి నక్షత్రం వచ్చేలా 'రోహిణి ఆచార్య' అని పేరుపెట్టారు. ప్రస్తుతం ఈ ఇద్దరు లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచారు. మిసా భారతి పాటలీపుత్ర నుంచి పోటీ చేస్తుండగా.. రోహిణి ఆచార్య బీహార్లోని సారణ్ నుంచి బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్పై పోటీ చేస్తున్నారు.2013లో వరకు లాలూ ప్రసాద్ యాదవ్ సారణ్ సేట్కు ప్రాతినిథ్యం వహించారు. ఇప్పుడు అదే స్థానం నుంచి తన చిన్న కూతురు రోహిణి ఆచార్యను బరిలోకి దించారు. ఇక్కడ మే 20న పోలింగ్ జరగనుండగా.. పాటలీపుత్రలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. పాటలిపుత్ర నుంచి పోటీ చేస్తున్న మిసా భారతి ఇప్పటికే రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అయితే.. లాలూ కూతుళ్లు ఇద్దరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఇదే తొలిసారి. -
గులాబీ పార్టీ బలం పెరిగిందా ?..తగ్గిందా ?
-
కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?: ప్రధాని మోదీ
ఢిల్లీ, సాక్షి: దేశం కోసం పని చేసే ఎన్డీయే, దేశంలో అస్థిరత్వం పెంచే ఇండియా కూటమికి మధ్య పోరు జరుగుతోందని.. ఈ పోరులో ఎన్డీయే సర్కార్ హ్యాట్రిక్ కొట్టబోతోందని బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ‘‘ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతు ఇస్తామని మమత(మమతా బెనర్జీ) చెప్పారు. రాయ్బరేలీ ప్రజలు దేశ ప్రధానిని ఎదుర్కొంటారని కొందరు అంటున్నారు. ఇలాంటి కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?. ఓటేసి ఎవరైనా ఓటు వృథా చేసుకుంటారా?. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే.. వాళ్లకు మోదీని తిట్టడమే పనిగా ఇస్తారు. తిట్టడం కోసం మనం ఎరినైనా ఎన్నుకుంటామా?. అలాంటి వాళ్ల వల్ల మీకు పనులు జరుగుతాయా?. మనకు పనులు చేసే వ్యక్తి కావాలి. ఎన్డీయే హ్యాట్రిక్ విజయం తప్పక సాధిస్తుంది. గెలిచాక.. పేదల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. .. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత రామమందిరం కల సాకారమైంది. ఎందరో బలిదానాలు చేసిన తర్వాత మందిర నిర్మాణం జరిగింది. రామ్లల్లాను టెంట్కింద చూసి ఎందరో బాధపడ్డారు. మీ ఓటు వల్లే రామ మందిర నిర్మాణం జరిగింది. బలమైన ప్రబుత్వం ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైంది అని మోదీ అన్నారు. .. ఒకవైపు రామ మందిర నిర్మాణం జరుగుతుంటే వాళ్ల కడుపు మండిపోయింది. ఆలయ ప్రారంభోత్సవాన్ని వాళ్లు బహిష్కరించారు. రాముడితో వాళ్ల శత్రుత్వం ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. రామ మందిరంపై సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్ మార్చాలనుకుంది. కాంగ్రెస్ వస్తే రామ్ లల్లాను మళ్లీ టెంట్ కిందకే మారుస్తారు. వాళ్లు ఎంతటికైనా దిగజారుతారు. వాళ్లకు పరివార్, పవార్.. ఇవే ముఖ్యం’’ అని మోదీ విపక్ష కూటమిపై మండిపడ్డారు. .. బుల్డోజర్ను ఎక్కడికి తీసుకెళ్లాలి.. ఎక్కడకు తీసుకెళ్లొద్దు అనేది యోగి దగ్గర ట్యూషన్ తీసుకోండి. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని అంబేద్కర్ అన్నారు. మత నిర్జవ్స్త్రన్లకు ల్యాబ్గా కర్ణాటకను మార్చాలనుకున్నారు. ఓబీసీల నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్పీ, ఎస్టీ, ఓబీసీల హక్కులు కాలరాస్తే సహిస్తారా?. హిందూ ముస్లిం అంటూ రాజకీయాలు చేస్తున్నారు. తిరిగి నాపై ఆరోపనలు చేస్తున్నారు. ఆ కుట్రలను గమనించి.. తిప్పి కొట్టి బీజేపీని గెలిపించాలి’’అని యూపీ ఓటర్లను ప్రధాని మోదీ కోరారు. -
కాంగ్రెస్ లో టెన్షన్: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై గాంధీ భవన్ లో చర్చ
-
రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
లక్నో: ఈ లోక్సభ ఎన్నికల్లో 400పైగా సీట్లు సాధించి రిజర్వేషన్లు తీసేయాలని బీజేపీ చూస్తోందని ఆప్ అగ్ర నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే హోమంత్రి అమిత్ షా ప్రధాని అవుతారని, యోగి ఆదిత్యనాథ్ను యూపీ సీఎం పదవి నుంచి తొలగిస్తారని పునరుద్ఘాటించారు. ‘అధికారంలోకి వస్తే భారీ కార్యక్రమం ఒకటుంటుందని బీజేపీ చెబుతోంది. రిజర్వేషన్లను తొలగించడమే ఆ కార్యక్రమం. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఎల్లప్పుడూ వ్యతిరేకమే. మళ్లీ ఆ పార్టీకే అధికార పగ్గాలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు ముగింపు పలుకుతుంది’అని ఆయన అన్నారు. గురువారం కేజ్రీవాల్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీలో 75 ఏళ్లు దాటిన ఏ నేతకు కూడా ప్రభుత్వంతోపాటు పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వబోమని, అటువంటి వారు రిటైర్ కావాల్సిందేనంటూ ప్రధాని మోదీ నిబంధన తెచ్చారు. ఈ ప్రకారమే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలు కొందరు రిటైరయ్యారు. మరికొందరిని తొలగించడమో, ఎన్నికల్లో టికెట్ నిరాకరించమో జరిగింది. మోదీ ఈ నిబంధన అమలుకు కృషి చేస్తున్నారు’అని కేజ్రీవాల్ ఆరోపించారు. తనకు అడ్డుగా ఉంటారనుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజె, రమణ్ సింగ్, దేవేంద్ర ఫడ్నవీస్, మనోహర్లాల్ ఖట్టర్ వంటి వారి కథను మోదీ ముగింపునకు తెచ్చారని విమర్శించారు. ‘అమిత్ షాకు ఆదిత్యనాథ్ అడ్డుగా ఉన్నారు. బీజేపీయే మళ్లీ అధికారంలోకి వస్తే రెండు నెలల్లోనే యూపీ సీఎం ఆదిత్యనాథ్ను సైతం పక్కన బెట్టడం ఖాయం’అని కేజ్రీవాల్ అన్నారు. చీపురుకు ఓటేస్తే..జైలుకెళ్లాల్సిన పనుండదు అమృత్సర్: తాను మళ్లీ జైలుకు వెళ్లరాదని భావిస్తే ఆప్కే ఓటేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రజలను కోరారు. గురువారం ఆయన పంజాబ్లోని అమృత్సర్లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ‘నేను జైలుకు వెళ్లాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది. చీపురు గుర్తు బటన్ను మీరు నొక్కితే నేను మళ్లీ జైలుకెళ్లాల్సిన అవసరం ఉండదు. కేజ్రీవాల్కు స్వేచ్ఛా లేక జైలా అనే విషయం ఆలోచించి మీరు బటన్ నొక్కండి. చీపురు గుర్తుపై నొక్కితే దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించినట్లేనని గుర్తుంచుకోండి’అని ఆయన అన్నారు. -
Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
అజంగఢ్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయని, ఉత్తరప్రదేశ్తోపాటు దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఈ చట్టాన్ని మాత్రం మీరు ఎప్పటికీ రద్దు చేయలేరు అని ప్రతిపక్షాలను ఉద్దేశించి తేలి్చచెప్పారు. గురువారం ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్, జాన్పూర్, బదోహీ, ప్రతాప్గఢ్లో లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగించారు. సీఏఏ కింద కాందీశీకులకు భారత పౌరసత్వం కలి్పంచే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, వీరంతా హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులేనని చెప్పారు. మతం ఆధారంగా భారత్ను విడగొట్టడంతో వీరంతా బాధితులుగా మారి మన దేశానికి వచ్చారని, చాలాఏళ్లుగా ఇక్కడే కాందిశీకులుగా బతుకుతున్నారని తెలిపారు. ప్రాణభయంతో వలస వచి్చన బాధితులను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. ఈసారి మూడు డోసుల బుజ్జగింపు విధానాలు ‘‘ఉత్తరప్రదేశ్లో గతంలో భయానక పరిస్థితులు ఉండేవి. పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులకు క్షమాభిక్ష ప్రసాదించి వదిలేసేవారు. ముష్కరులకు రాజకీయ ముసుగేసి కాపాడుతూ ఉండేవారు. దీనివల్ల ఉగ్రవాదం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. అయినా కొందరు విపక్ష నాయకుల ధోరణిలో మార్పు రావడం లేదు. ఉగ్రవాదం పట్ల సానుభూతి చూపుతున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం వచి్చన తర్వాత మార్పు మొదలైంది. కాంగ్రెస్, సమాజ్వాదీ అనేవి రెండు పార్టీలు. నిజానికి అవి ఒకే దుకాణం. అక్కడ బుజ్జగింపు రాజకీయాలు, అబద్ధాలు, కుటుంబస్వామ్యం, అవినీతిని అమ్ముతుంటారు. ఈసారి వారు మూడు డోసుల బుజ్జగింపు విధానాలతో ముందుకొస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను కాజేసి ఓటు బ్యాంక్కు కట్టబెట్టాలని ప్రయతి్నస్తున్నారు. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్లో సగం దోచుకొని ఓటు బ్యాంక్కు అప్పగించాలని కుట్రలు పన్నుతున్నారు. దేశ బడ్జెట్లో ఏకంగా 15 శాతం నిధులను మైనారీ్టలకే కేటాయించాలని భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత రాహుల్, అఖిలేశ్ విదేశాలకు వెళ్లిపోతారు పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అరాచక, అవినీతి పాలనను ఉత్తరప్రదేశ్లోనూ తీసుకురావాలని కాంగ్రెస్, సమాజ్వాదీ పారీ్టలు భావిస్తున్నాయి. హిందువులను హత్య చేయడం, దళితులను, ఆదివాసీలను వేధించడం, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడడమే తృణమూల్ కాంగ్రెస్ పాలన. అలాంటి పాలన మనకు కావాలా? అనేది ఉత్తరప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. జూన్ 4 తర్వాత మళ్లీ మా ప్రభుత్వమే వస్తుంది. ప్రజల సంక్షేమం కోసం రాత్రింబవళ్లూ పని చేస్తానని గ్యారంటీ ఇస్తున్నా. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాం«దీ), సమాజ్వాదీ పార్టీ యువరాజు(అఖిలేశ్ యాదవ్) విదేశాలకు వెళ్లిపోతారు. నోట్లో బంగారు చెంచాతో పుట్టిన బడాబాబులు ఈ దేశాన్ని సమర్థంగా నడపలేరు’’ అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎక్స్–రే యంత్రాలు ‘‘ఈ లోక్సభ ఎన్నికలు మనకొక సువర్ణావకాశం. బలమైన ప్రభుత్వాన్ని నడిపించడంతోపాటు ఇండియా బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పే నాయకుడిని ఎన్నుకోవాలి. అందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలి. ప్రజలు వేసే ఓటు బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బీజేపీ అభ్యర్థులకు వేసే ప్రతి ఓటు నేరుగా నరేంద్ర మోదీ ఖాతాలోకి చేరుతుంది. ఇండియా కూటమి నాయకులు అధికారంలోకి వస్తే మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నారు. ఇందుకోసం రాజ్యాంగాన్ని సైతం మార్చేస్తామంటున్నారు. నేను బతికి ఉన్నంత కాలం అలాంటి ఆటలు సాగనివ్వను. ఎక్స్–రే యంత్రాలతో ప్రజల ఆస్తులను సర్వే చేస్తామని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. అందుకే మనమంతా జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ అజెండాను నేను బయటపెట్టా. దాంతో కాంగ్రెస్ ఎక్స్–రే యంత్రాలు ముక్కలు ముక్కలుగా విరిగిపోతున్నాయి’’. -
Kishori Lal Sharma: ఆమె నాకు పోటీయే కాదు!
కిశోరీ లాల్ శర్మ.. అమేథీలో కాంగ్రెస్ తురుపు ముక్క. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఊహించని ప్రత్యరి్థ. రాజీవ్గాంధీ నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్కు నమ్మిన బంటు ఈ 63 ఏళ్ల కేఎల్ శర్మ. ఇన్నాళ్లు తెరవెనుక చక్రం తిప్పిన శర్మ ఇప్పుడు నేరుగా బరిలోకి దిగి బీజేపీతో అమీతుమీ తేల్చుకోనున్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన బలం. గాం«దీలతో మైత్రి సహా.. పలు అంశాలపై ఆయన పంచుకున్న ముచ్చట్లివి.. ఇన్నాళ్లు తెర వెనుక ఉన్నారు. ఇప్పుడు తెరమీదకు వచ్చారు. ఈ మార్పు ఎలా ఉంది? ఎన్నికలకు సంబంధించి పెద్దగా మార్పు లేదు. నేనెప్పుడూ ఒంటరిగా ఏమీ చేయలేదు. 25–30 ఏళ్లుగా నాతో కలిసి పనిచేస్తున్నవారున్నారు. కాలం మారింది.. కొత్తగా చేయాలి. టీమ్ అదే.. పని తీరే మారింది. ఐదేళ్ల కిందట రాహుల్ ఓడిపోయిన చోట నుంచి పోటీని ఎలా చూస్తున్నారు? గతంలో పొరపాట్లు జరిగాయి. దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ఎలా? అన్న అంతర్మథనం జరిగింది. రెండు విషయాలు బలంగా పనిచేశాయి. బీజేపీ ప్రభుత్వం నుంచి ఎదురైన ఒత్తిడితోపాటు మా వైపు నుంచి కూడా లోపాలు జరిగాయి. ఆ ఎన్నికల్లో దిశా నిర్దేశం చేసే నాథుడు లేరని కార్యకర్తలు వాపోయారు. బీజేపీ గెలిచింది 55,000 ఓట్ల తేడాతోనే. అది పెద్ద నంబర్ కాదు. ఓటమికి కారణమైన వారినే అభ్యరి్థగా నిలబెట్టారని బీజేపీ ఆరోపణ కదా! 2019 ఎన్నికల్లో నేను అమేథీలో లేను. రాయ్బరేలీలో పోలింగ్, ఎన్నికల నిర్వహణ చూస్తున్నాను. ఇప్పుడు నేను, నా ప్రత్యేక బృందం ఇక్కడ పనిచేస్తోంది. తేడా అదే! ‘గాంధీ కుటుంబ చప్రాసి’ వ్యాఖ్యలను ఎలా ఎదుర్కొంటారు? నేనెవరినో అమేథీ, రాయ్బరేలీ ప్రజలందరికీ తెలుసు. 1980లో యువజన కాంగ్రెస్ కార్యకర్తగా నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1983లో రాజీవ్ గాంధీ జీ 20 ప్రోగ్రామ్ను పర్యవేక్షించడానికి కొంతమంది యువ నాయకులను ఎంపిక చేశారు. వారిలో నేను ఒకడిని. ఒకటిన్నర బ్లాకులు చూసుకోవాల్సిన బాధ్యత నాకు అప్పచెప్పారు. ‘అమేథీ మే దిల్ లగ్ గయా’ (అమేథీ మీద మనసు పారేసుకున్నా). ఇక్కడే ఉండిపోయాను. కొందరు నన్ను సోనియాగాం«దీకి పీఏ అంటారు. ఎవరేమనుకున్నా.. నేను ప్రజాప్రతినిధిని. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిని. స్టార్ క్యాంపెయినర్ని. 2013లో ఏఐసీసీ కార్యదర్శిగా, సీపీ జోషితో కలిసి బిహార్కు కో–ఇన్చార్జ్గా ఉన్నాను. బిహార్లో కూటమి ఏర్పాటు చేసినప్పుడు 27 స్థానాల్లో విజయం సాధించాం. ఏం తెలియకుండా మాట్లాడేవారికి నేనేం చెప్పగలను? మీ కుటుంబం? భార్య. ఇద్దరు కూతుళ్లు. ఒకరు ఎంబీఏ చేసి మార్కెటింగ్లో ఉద్యోగం చేస్తున్నారు. రెండో కూతురు వ్యాపారవేత్త. మీ పోటీతో పారీ్టలో అంతర్గత విభేదాలు పెరిగాయని భావిస్తున్నారా? పారీ్టలో అంతర్గత పోరు ఉంది. కానీ నా విషయానికి వస్తే అది లెక్కలోకి రాదు. నేను వాళ్ళ అన్నయ్య లాంటివాడిని. తిట్టగలను, ప్రేమగా మాట్లాడగలను. వాళ్లూ నాతో అలాగే ఉంటారు. పోటీకి గ్రూపులు మంచివే. కానీ పార్టీని దెబ్బతీసే గ్రూపులు ఉండొద్దని చెబుతుంటా. ఎన్నికల్లో పోటీ చేయమని మిమ్మల్ని ఎవరు అడిగారు? అమేథీలోని ఇతర కార్యకర్తలు కోరుకున్నట్లే నేను కూడా రాహుల్జీ పోటీ చేయాలని కోరుకున్నా. కానీ నామినేషన్లకు ముందు ప్రియాంక ‘కిషోరీ జీ మా కుటుంబం కోసం మీరు ఎన్నో ఎన్నికల్లో పోరాడారు. ఈ ఎన్నికల్లో మేం మీకోసం పోరాడాలనుకుంటున్నాం’ అని చెప్పారు. నేను అంగీకరించాను. మీ ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉంది! స్మృతి ఇరానీ ఎంత ప్రచారమైనా చేసుకోనీ. ఆమె అసలు నాకు పోటీయే కాదు. కష్టపడి పని చేయడమే నాకు తెలుసు. ఇక నిర్ణయం ప్రజలది. స్మృతి ఇరానీ చేస్తున్న ఆరోపణల విషయానికొస్తే, ఆమెను కించపరిచేలా నేనెప్పుడూ మాట్లాడలేదు. నాపై నోరు పారేసుకోవడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: నోరుజారె... పరువు పోయె..!
అసలే ఇది ఎన్నికల సీజన్. ప్రచారం దుమ్మురేగుతోంది. మైకు దొరికితే చాలు.. నేతల హామీలకు, విమర్శల ధాటికి అడ్డూఅదుపూ ఉండటం లేదు. ఆ క్రమంలో కొన్నిసార్లు తాము ఏ పారీ్టలో ఉన్నాం, ఎవరి తరఫున ప్రచారం చేస్తున్నామన్న స్పృహ లేకుండా నేతలు నోరు జారుతున్నారు. సొంత పార్టీ అభ్యరి్థనే చిత్తుచిత్తుగా ఓడించండనీ, ప్రత్యర్థి పారీ్టకి ఓటేయాలనీ పిలుపిస్తున్నారు! జరగాల్సిన నష్టం జరిగాక తీరిగ్గా నాలుక్కరుచుకుంటున్నారు. ఇలా టంగ్ స్లిప్పవుతున్న వారిలో కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినవారే గాక కాకలుతీరిన నేతలు కూడా ఉండటం విశేషం. కుడిఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నారు గానీ, రాజకీయాల్లో మాత్రం నోరుజారితే నవ్వులపాలే...!! అధిర్.. అయ్యో రామా! బీజేపీకి ఓటేయడం మేలన్న కాంగ్రెస్ దిగ్గజం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే పశి్చమ బెంగాల్ కాంగ్రెస్ దిగ్గజం అధిర్ రంజన్ చౌదరి ఇటీవల ఎన్నికల ర్యాలీలో మళ్లీ నోరుజారారు. ‘బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు ఓటేసే కంటే బీజేపీకి వేయడం నయం’ అన్నారు! జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి అయిన పారీ్టకి ఓటేయాలని పిలుపివ్వడం పట్ల సొంత నేతలే తీవ్రంగా మండిపడ్డారు. దాంతో తానలా అన్లేదంటూ అ«ధిర్ మాట మార్చారు. కానీ అధికార తృణమూల్ దీన్ని మంచి అస్త్రంగా అందిపుచ్చుకుంది. బెంగాల్లో అ«ధిర్ బీజేపీకి తొత్తుగా పనిచేస్తున్నారంటూ చెలరేగిపోయింది.లాలు కూతుర్ని ఓడించండి! సొంత పార్టీ ఎమ్మెల్సీ పిలుపు బిహార్ రాజకీయ దిగ్గజం లాలు ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సరన్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమెను గెలిపించుకునేందుకు అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా లాలు స్వయంగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా కూతురితో పాటు పాల్గొన్న తొలి సభలోనే హంసపాదు ఎదురైంది! సొంత పార్టీ ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ మాట్లాడుతూ ‘‘ఓటర్లు, పార్టీ కార్యకర్తలందరినీ ఒకటే కోరుతున్నా. రోహిణీ ఆచార్యను భారీ మెజారిటీతో ఓడించండి’ అంటూ పిలుపునిచ్చారు. దాంతో లాలుతో పాటు వేదికపై ఉన్న ఆర్జేడీ నేతలంతా అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న సునీల్ క్షమించాలంటూ వేడుకున్నారు.కంగనా... కన్ఫ్యూజన్! గురి తప్పిన ‘నాన్ వెజ్’ విసుర్లు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బీజేపీలో చేరి హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తుండటం తెలిసిందే. స్టార్ క్యాంపెయినర్ అయిన ఆమె బిహార్ ఎన్నికల ర్యాలీలో ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్కు బదులు పొరపాటున బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను విమర్శించి నవ్వులపాలయ్యారు. ‘‘దారి తప్పిన యువరాజులున్న పారీ్టలకు మన దేశంలో కొదవ లేదు. చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలకునే రాహుల్ గాంధీ కావచ్చు. నవరాత్రుల సందర్భంగా కూడా చేపలు తినే తేజస్వి సూర్య కావచ్చు. అంతా అదే బాపతు’ అంటూ కంగన విరుచుకుపడ్డారు. దాంతో భారీగా ట్రోలింగ్కు గురయ్యారు. తేజస్వీ యాదవ్ కూడా, ‘ఇంతకీ ఎవరీ అమ్మగారు?!’ అంటూ ఎద్దేవా చేశారు. దేశ తొలి ప్రధాని సుభాష్ చంద్ర బోస్ అన్న కంగనా వ్యాఖ్యల పైనా విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. శివపాల్.. శివ శివా! బీజేపీని గెలిపించాలన్న సమాజ్వాదీ నేత అది ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి ఒకప్పుడు గట్టి పట్టున్న ఇటావా లోక్సభ స్థానం. జస్వంత్ నగర్లో ఎన్నికల ప్రచార సభ. జనం భారీగా హాజరయ్యారు. పార్టీ చీఫ్ అఖిలేశ్ బాబాయి, సమాజ్వాదీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్ యాదవ్ మాట్లాడుతున్నారు. వేదికపై ఉన్న అఖిలేశ్, ఇటావా ఎస్పీ అభ్యర్థి జితేంద్ర దోహారే తదితరులు ఆసక్తిగా వింటున్నారు. ఇంతలో శివపాల్ ఉన్నట్టుండి, ‘అందుకే నేను కోరేదొక్కటే! బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించండి!!’ అంటూ పిలుపునిచ్చారు. అంతటితో ఆగలేదు. ‘ప్రజలంతా అఖిలేశ్ చెప్పినట్లు విని, భారతీయ జనతాపారీ్టకి భారీ మెజారిటీతో విజయాన్ని అందించండి’ అన్నారు. దాంతో అఖిలేశ్ బిత్తరపోగా ఇతర ఎస్పీ నేతలంతా గతుక్కుమన్నారు. నోరు జారానని గమనించిన శివపాల్ కాసేపు బీజేపీపై విరుచుకుపడ్డా జనమంతా గోలగోలగా నవ్వుకున్నారు! అందిపుచ్చుకున్న మోదీ...ఈ ఉదంతాన్ని తర్వాత ఇటావాలోనే జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రచారాస్త్రంగా మలచుకున్నారు. ‘చూశారా! స్వయంగా ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ బాబాయ్ కూడా బీజేపీని గెలిపించాలని కోరుతున్నారు’ అంటూ చెలరేగిపోయారు. 2019లో ములాయం కూడా బీజేపీని ఆశీర్వదించారని గుర్తు చేశారు. ‘‘2019 ఎన్నికలకు ముందు పార్లమెంట్ చివరి సెషన్లో ములాయం మాట్లాడుతూ, మీరు మళ్లీ విజయం సాధించబోతున్నారని నన్నుద్దేశించి నిండు సభలో అన్నారు. ఆ ఆశీర్వాదం ఫలించింది. ఇప్పుడు ములాయం మన మధ్య లేకున్నా ఆయన సోదరుడు బీజేపిని గెలిపించాలని కోరుతున్నారు. ఇది యాదృచి్ఛకమని నేననుకోవడం లేదు. శివపాల్ మనసులో ఉన్నదే బయటికొచి్చంది’’ అంటూ చెణుకులు విసిరారు!లోగుట్టు ‘బోరా’కే ఎరుక... స్వపక్ష ఎంపీనే ఓడించాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే!అసోంలోని నగావ్ లోక్సభ స్థానంలో ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే శిబమణి బోరా కూడా ఇలాగే నోరు జారారు. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారామె. జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నట్టుండి, ‘ప్రద్యుత్ను భారీ మెజారిటీతో ఓడించాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నా. ఓడిస్తారో లేదో చెప్పండి. ఈవీఎం బటన్ను నొక్కి నొక్కి ప్రద్యుత్ కచ్చితంగా ఓడేలా చూడండి’’ అంటూ పిలుపునివ్వడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. పొరపాటున అన్నారా, కావాలనే అన్నారా అంటూ దీనిపై తీవ్ర చర్చ కూడా జరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
9 సీట్లలో గెలుపు ఖాయం
సాక్షి , హైదరాబాద్ : ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నియమించిన ఎన్నికల నిర్వహణ కమిటీ తేల్చి చెప్పింది. మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను 13 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ, పోల్ మేనేజ్మెంట్లో విఫలమైనట్లు పేర్కొంది. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ కన్వినర్గా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎంఆర్జీ వినోద్రెడ్డి, పుష్పలీల, రాములు నాయక్ తదితరులు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ.. ఈ మేరకు ఒక మధ్యంతర నివేదికను ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి సమర్పించింది.తాము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా గుర్తించిన అంశాలను గురువారం గాం«దీభవన్లో మున్షీకి వివరించింది. బీఆర్ఎస్ను నిలువరించ గలిగినప్పటికీ, ఆపార్టీ ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడంలో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని తెలిపింది. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి మళ్లి, కొన్నిచోట్ల కాంగ్రెస్ గెలుపు అవకాశాలను దెబ్బకొట్టినట్లు పేర్కొంది. 13 నుంచి 14 సీట్లు లక్ష్యంగా పనిచేసినా.. లోక్సభ ఎన్నికల్లో 13 నుంచి 14 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పార్టీ పనిచేసినప్పటికీ, ఎన్నికల నిర్వహణలో సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లక పోవడం వల్ల నాలుగైదు సీట్లలో వెనుకబడినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వరంగల్, భువనగిరి, జహీరాబాద్లలో ప్రత్యర్థి పారీ్టల కన్నా బలంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.కొన్ని నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్మెంట్లో 2 శాతం నుంచి 8 శాతం వరకు మెరుగ్గా ఉంటే, నాలుగైదు నియోజకవర్గాల్లో 25 శాతం వరకు మెరుగైన స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, చేవెళ్ల, నిజామాబాద్, మెదక్ స్థానాల్లో ఇంకొంత కష్టపడి ఉంటే బాగుండేదని, అయినా ఈ నియోజకవర్గాల్లో కూడా గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా పేర్కొన్నట్లు సమాచారం. మూడుచోట్ల బీజేపీకే అవకాశాలు: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మల్కాజిగిరి, కరీంనగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కాంగ్రెస్ ఎన్నికల నిర్వహణ కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించలేదని, అప్పటికి ఇప్పటికీ పార్టీ పురోగతి ఆశించినంత లేదని పేర్కొంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సరైన ప్రణాళికతో ముందుకు వెళితే బాగుండేదని కమిటీ సూచించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఓట్లు బదిలీ కావడం, ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లడం బీజేపీకి అనుకూలంగా మారినట్లు విశ్లేíÙంచింది. టీజేఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలతో సమన్వయం లేకపోవడం కూడా కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలను దెబ్బకొట్టినట్లు అభిప్రాయపడింది. -
నల్లత్రాచు నుంచి ‘అప్సరస’ వరకు..
సిమ్లా: ఎన్నికలన్నాక పరస్పర విమర్శలు సహజమే. కానీ హిమాచల్ప్రదేశ్ ప్రచారంలో అభ్యర్థులు విమర్శలు దాటి.. వ్యక్తిగత తిట్ల వరకూ వచ్చేశారు. ఈ దండకంలో కాంగ్రెస్ నుంచి బీజేపీ వరకూ అందరూ ఆ తాను ముక్కలే. ఒకరు ‘కాలే నాగ్’ అంటే.. మరొకరు ‘బిగ్డా షెహజాదా’ అంటూ ప్రచార పదజాలంలో కొత్త తిట్లను చేరుస్తున్నారు.ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ప్రదేశ్లోని ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేసిన విషయం తెలిసింది. వారిపై అనర్హత వేటు పడి ఆ ఆరుస్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు.. పార్టీ తిరుగుబాటుదారులను ‘కాలే నాగ్’(నల్లత్రాచు)లు, బికావు (అమ్ముడుపోయినవాళ్లు) అంటూ విమర్శించారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి దేవేందర్ కుమార్ భుట్టో నియోజకవర్గమైన కుట్లేహార్లో సీఎం మాట్లాడుతూ.. ‘భుట్టో కో కూటో’ (భుట్టోను కొట్టండి) అంటూ పిలుపునిచ్చారు. సుఖూ వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయంటూ బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. ఇక ‘మండీ మే భావ్ క్యా చల్ రహా హై’ అంటూ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. నేను రెండాకులు ఎక్కువే చదివానంటూ రనౌత్ చెలరేగిపోయారు. రాహుల్గాం«దీ, విక్రమాదిత్య పేర్లు చెప్పకుండా.. ‘బడా పప్పు’, ‘ఛోటా పప్పు’ అని పదేపదే వాడారు. గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పారీ్ట.. ఈ దేశానికి బ్రిటిష్ వాళ్లు వదిలి వెళ్లిన ‘రోగం’ అంటూ వ్యాఖ్యానించారు. 2014 వరకు చెద పురుగుల్లా దేశాన్ని తినేశారన్నారు. విక్రమాదిత్యను.. ‘బిగ్డా షెహజాదా’ (చెడిపోయిన యువరాజు) అంటూ సంబోధించారు. ఇక కంగనాను ‘ఆమె హుస్న్ కి పరి’ (అప్సరస) అని, ప్రజలు ఆమెను చూడటానికి మాత్రమే వస్తారు.. ఓట్లేయరని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ వ్యాఖ్యానించారు. దీనిపై కంగనా తల్లి ఆశా రనౌత్ స్పందించారు. తన కూతురును ‘అప్సరస’, ‘క్యా చీజ్ హై’ అంటున్నవాళ్లు తమ ఇళ్లలో ఆడపిల్లలున్నారన్న విషయం మరుస్తున్నారని మండిపడ్డారు. -
Lok Sabha Election 2024: చివరి పంచ్ ఎవరిదో!
దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 48 స్థానాలకు గాను నాలుగు విడతల్లో 35 సీట్లకు ఎన్నిక ముగిసింది. మిగతా 13 నియోజకవర్గాలకు ఐదో విడతలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. రెండుగా చీలిన శివసేన, ఎన్సీపీల్లో అసలు పారీ్టగా ప్రజలు దేన్ని గుర్తిస్తున్నదీ ఈ ఎన్నికలతో తేలనుంది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్, సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తదితరులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో తుది దశలో పోలింగ్ జరగనున్న కీలక స్థానాలపై ఫోకస్... నాసిక్ ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం, ఎగుమతి సుంకాల పెంపు తదితరాలపై ఇక్కడి రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది అభ్యర్థులందరికీ పరీక్షగా మారింది. అధికార మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యర్థి హేమంత్ గాడ్సే బరిలో ఉన్నారు. విపక్ష ఎంవీఏ కూటమి నుంచి శివసేన (ఉద్ధవ్) అభ్యర్థి రాజాభావు వాజే పోటీలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 111 ఆశ్రమాలు, ఏడు గురుకులాలతో ప్రజల్లో బాగా పేరున్న శాంతిగిరి మహారాజ్ ఇండిపెండెంట్గా వీరిద్దరికీ పెను సవాలు విసురుతున్నారు. ఉల్లి రైతులను ప్రసన్నం చేసుకునేందుకు గాడ్సే, వాజే శ్రమిస్తున్నారు. సీఎం షిండే ముమ్మరంగా ప్రచారం చేశారు. వంచిత్ బహుజాన్ అగాడీ నుంచి కరణ్ గైకర్ కూడా బరిలో ఉండటంతో చతుర్ముఖ పోరు నెలకొంది.పాల్గఢ్ ఈ ఎస్టీ రిజర్వ్డ్ స్థానం నుంచి మహాయుతి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి హేమంత్ విష్ణు సవర బరిలో ఉన్నారు. శివసేన (ఉద్ధవ్) నుంచి భారతి భరత్ కామ్డి పోటీ చేస్తున్నారు. బీఎస్పీ, వంచిత్ బహుజన్ అగాడీ, స్థానికంగా బలమున్న బహుజన్ వికాస్ అగాడీ కూడా పోటీలో ఉన్నాయి. దాంతో బహుముఖ పోటీ నెలకొంది. నిరుద్యోగం, వైద్య సౌకర్యాల లేమి ఇక్కడి ప్రధాన సమస్యలు. ఈ ప్రాంతానికి చెందిన ఓ మత్స్యకారుడు ఇటీవలే పాక్ జైల్లో మరణించడం, ఇక్కడ ఇద్దరు సాధువులను కొట్టి చంపడం ఎన్నికల అంశాలుగా మారాయి. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, బీజేపీ అగ్ర నేతలు సాధువుల హత్యను పదేపదే ప్రస్తావించారు. రూ.76,000 కోట్లతో ప్రతిపాదించిన వాద్వాన్ పోర్టుపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శివసేన (షిండే)కు చెందిన సిట్టింగ్ ఎంపీ రాజేంద్ర దేద్య గవిట్ బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. భివండి బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లోనూ ఇక్కడ ఆయనే గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. ఎన్సీపీ (ఎస్పీ) నుంచి సురేశ్ మాత్రే (బాల్యా మామ), స్వతంత్ర అభ్యర్థి నీలేశ్ సంబారే పాటిల్కు గట్టి పోటీ ఇస్తున్నారు. నియోజకవర్గంలోని 21 లక్షల ఓటర్లలో 5 లక్షల మంది ముస్లింలే. 4.5 లక్షలు కుంబి, 3 లక్షలు అగ్ర వర్గీయులున్నారు. పాటిల్, మాత్రే ఇద్దరూ అగ్ర కులస్థులు. సంబారే కుంబి వర్గానికి చెందినవారు. మాత్రే గెలుపు కోసం శరద్ పవార్ తన పలుకుబడినంతా ఉపయోగిస్తున్నారు. తమకు బాగా పట్టున్న ఈ స్థానాన్ని ఎన్సీపీకి ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. ఇది మాత్రే విజయావకాశాలపై ప్రభావం చూపేలా ఉంది.ముంబై నార్త్ ఇక్కడ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ను బీజేపీ బరిలోకి దింపింది. రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన ఎంపికకు ముందు గట్టి కసరత్తే చేసింది. గోయల్ కోసం తొలుత దక్షిణ ముంబై స్థానాన్ని పరిశీలించినా చివరికి ముంబై నార్త్ వైపే మొగ్గుచూపించింది. ఇది ఒకప్పుడు కాంగ్రెస్కు గట్టి పట్టున్న స్థానం. 1989లో బీజేపీ నుంచి రాం నాయక్ విజయం సాధించాక పరిస్థితులు మారాయి. 2008లో లోక్సభ స్థానాల పునరి్వభజన తర్వాత ఇక్కడ మరాఠీయేతర మధ్య తరగతి ఓటర్లు పెరిగారు. దాంతో బీజేపీ మరింత బలపడింది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ నిరుపమ్పై బీజేపీ నేత గోపాల్ చిన్నయ్య శెట్టి 4.47 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గారు. 2019 ఎన్నికల్లో ఆయన మెజారిటీని మరింతగా పెంచుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, నటి ఊర్మిళా మతోండ్కర్ను ఓడించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు.కల్యాణ్ అధికార మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యరి్థగా సీఎం కుమారుడు శ్రీకాంత్ షిండే బరిలో ఉండటంతో ఆసక్తి నెలకొంది. 2014, 2019 ఎన్నికల్లోనూ శివసేన టికెట్పై శ్రీకాంత్ ఎన్సీపీని ఓడించారు. విపక్ష అగాడీ కూటమి నుంచి శివసేన (ఉద్ధవ్) అభ్యరి్థగా వైశాలి దారేకర్ రాణే బరిలో నిలిచారు. దాంతో ఇంతకాలంగా శివసేనను ఆదరిస్తున్న ఓటర్లకు పరీక్ష ఎదురైంది. సంప్రదాయ ఓటర్లు ఈ రెండు పారీ్టల మధ్య చీలితే ఎవరు గెలుస్తారన్న ఆసక్తి నెలకొంది. గత రెండుసార్లూ రెండో స్థానంలో నిలిచిన ఎన్సీపీ (ఎస్పీ) మద్దతు ఉద్దవ్ వర్గం అభ్యరి్థకి కలిసొచ్చే అంశం. ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధికి తన కుమారుడు ఎంతో చేశాడని, ఈసారీ గెలిపిస్తే మిగతా పనులన్నీ పూర్తి చేస్తాడని సీఎం షిండే భరోసా ఇస్తున్నారు. థానే ఇక్కడ రెండు శివసేనల మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. ఇతరులు పోటీలో ఉన్నా నామమాత్రమే. 2019 ఎన్నికల్లో శివసేన అభ్యర్థి రాజన్ బాబూరావు విచారే 4.12 లక్షల ఓట్ల మెజారిటీతో ఎన్సీపీ నేత ఆనంద్ పరాంజపేపై ఘన విజయం సాధించారు. ఈ విడత విచారే శివసేన (ఉద్ధవ్) అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యర్థిగా నరేశ్ గణపత్ మాస్కే బరిలో ఉన్నారు. విచారే ముందునుంచీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. మాస్కేకు మద్దతుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సేన, బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. కానీ ఆయన అభ్యరి్థత్వాన్ని బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తుండడం ప్రతికూలంగా మారింది. విచారే, మాస్కే ఇద్దరూ థానే మేయర్లుగా పనిచేసిన వారే. కానీ నగర పరిసర ప్రాంతాలు సరైన అభివృద్ధికి నోచుకోలేదన్న అసంతృప్తి స్థానికుల్లో బాగా ఉంది.ఐదో విడత పోలింగ్ జరిగే స్థానాలుధూలే, దిండోరి, నాసిక్, పాల్ఘర్, భివండి, కల్యాణ్, థానే, ముంబై నార్త్, ముంబై నార్త్–వెస్ట్, ముంబై నార్త్–ఈస్ట్, ముంబై నార్త్–సెంట్రల్, ముంబై సౌత్–సెంట్రల్, ముంబై సౌత్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘CAA మోదీ గ్యారెంటీ.. ఎవరూ చెరపలేరు’
లక్నో: మోదీ వెళ్లిపోతే.. సీఏఏ కూడా వెళ్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, సీఏఏ మోదీ గ్యారెంటీ అనిర, దానిని ఎవరూ తొలగించలేరని బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ఉత్తర ప్రదేశ్ అజాంఘడ్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మోదీ గ్యారెంటీలపై ప్రజలకు నమ్మకం ఉంది. సీఏఏ(CAA) చట్టమే మోదీ గ్యారెంటీకి తాజా ఉదాహరణ. సీఏఏ కింద భారత పౌర సత్వం ఇవ్వడం మొదలైంది. దేశంలో వీరంతా చాలా ఏళ్లుగా శరణార్థులుగా ఉన్నారు. ఉత్తర ప్రదేశ్లోనూ లక్షలమంది శరణార్థులు ఉన్నారు. వాళ్లందరికీ కూడా పౌరసత్వం లభిస్తుంది. మోదీ వెళ్తే సీఏఏ కూడా వెళ్లిపోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, మోదీ గ్యారెంటీని ఎవరూ చెరపలేరు. విపక్ష కూటమి ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తోంది. కానీ, ప్రజలంతా బీజేపీ, ఎన్డీయే కూటమితోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఒక్కటే మాట వినిపిస్తోంది. అదే ఫిర్ ఏక్ బార్.. 400 పార్. మోదీ గ్యారెంటీ కశ్మీర్లోనూ కనిపిస్తోంది. కశ్మీర్లో శాంతికి గ్యారెంటీ ఇచ్చాం. కశ్మీర్లో తీసుకున్న చర్యలతో విపక్షాల నోళ్లు మూతలు పడ్డాయి. మోదీ వెళ్తే ఆర్టికల్ 370 రద్దు కూడా పోతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ, నాల్గొ దశలో జరిగిన పోలింగ్లో శ్రీనగర్ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు అని ప్రధాని మోదీ అన్నారు.దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా ఆజాంఘడ్ గురింంచి చర్చ వచ్చేది. స్లీపర్సెల్స్ గురించి చర్చ జరిగేది. సమాజ్వాదీ పార్టీ ఎప్పుడూ ఆజాంఘడ్ గురించి ఆలోచించలేదు. ఆజాంఘడ్లో కమలం వికసిస్తేనే.. అభివృద్ధి జరుగుతుంది అని ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇండియా కూటమి రిజర్వేషన్లతో రాజకీయం చేస్తోంది. 50 శాతం బడ్జెట్ను మైనారిటీలకు కేటాయించాలనుకుంటోంది. 70 ఏళ్లుగా హిందూ, ముస్లిం అంటూ మతాల పేరిట వాళ్లు విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు దేశమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. రామమందిర ప్రారంభం నాడు ఇండియా కూటమి ఎన్నో విమర్శలు చేసింది. పేదల అభివృద్ధి కోసం పగలు రాత్రి కష్టపడుతున్నా. మీ బాధలన్నింటిని తొలగిస్తున్నాం. వివిధ పథకాలతో పేదలను ఆదుకుంటున్నాం అని మోదీ తెలిపారు. -
‘వర్జిన్ ఓటర్’గా మిగలకండి!
ఓటుపై సందేశం ఇవ్వాలి. అదే సమయంలో తమ ఉత్పత్తికి ప్రచారం కల్పించుకోవాలి. ఇలాంటి అవకాశం వస్తే వినియోగ ఉత్పత్తుల కంపెనీలు అస్సలు వదులుకోవు. మ్యాన్ఫోర్స్ కండోమ్ సంస్థ ఇప్పుడదే చేసింది. సాధారణంగా కండోమ్ కంపెనీ ప్రకటన అంటే కొంచెం ఇబ్బంది కలిగించేలా ఉంటుందనుకుంటాం. కానీ మ్యాన్ఫోర్స్ ప్రకటన అలా అనిపించదు. కొత్త ఓటర్లను కదిలించేలా ఉంటుంది. అందుకోసం కంపెనీ కొత్తగా ఆలోచించింది. మొదటిసారి ఓటర్లను ఉద్దేశించి ‘ఓటింగ్ వర్జిన్’ అన్న పదబంధాన్ని ప్రయోగించింది. ఈ లోక్సభ ఎన్నికల్లో 1.82 కోట్ల మంది ఓటర్లు తొలిసారి ఓటేస్తున్నారు. ఇప్పటిదాకా ఓటేసిన అనుభవం లేదనే అర్థంలో వారినుద్దేశించి‘ఓటింగ్ వర్జిన్’గా పేర్కొంది. ఈ ప్రకటన గట్టిగా పేలడమే గాక వైరల్గా మారింది. నెటిజన్లు దీన్ని షేర్ చేస్తూ తొలిసారి ఓటర్లకు ఓటేయాలంటూ పిలుపునిచ్చారు ‘‘నేనూ తొలిసారి ఓటర్నే. నన్ను విష్ చేయండి. మీరూ ఓటేయండి. ఓటింగ్ వర్జిన్గా మిగలకండి’’ అంటూ ఓ యూజర్ పోస్ట్ పెట్టడం విశేషం. ‘‘మీ ఓటు మీ హక్కు. దాన్ని వివేకంతో ఉపయోగించి ప్రజాస్వామ్య ప్రక్రియలో మీ గళం వినిపించండి’’ అని మరో యూజర్ కోరాడు. -
మోదీపై పోటీ: రామ్కుమార్ ప్రత్యేకత ఏంటంటే..
ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసిలో ఓ వృద్ధుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు. ఆయన పేరు రామ్కుమార్ వైద్య. మధ్యప్రదేశ్లోని దతియా జిల్లా ఇందర్ఘడ్ వాసి. చిన్న కిరాణా దుకాణం నడుపుతుంటాడు. మోదీపై పోటీతో మాత్రమే కాదు.. నామినేషన్ టైంలోనూ ఆయన వార్తల్లోకి ఎక్కారు. వారణాసిలో పోటీ కోసం రూ.25,000 రూపాయి నాణేలు డిపాజిట్ చేసి నామినేషన్ పత్రాలు కొనుగోలు చేయడంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో చురాన్ బుదియా అమ్ముతూ వేలల్లో నాణేలను పోగేసి వాటినే ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. వాటిని చూసి వాళ్లు కంగు తిన్నారు. కిందామీదా పడి నాణేలను లెక్కించారు. మంగళవారం నామినేషన్ వేసేందుకు వైద్య 550 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ వారణాసి వచ్చాడు. ఆయనకు ప్రతిపాదకులుగా వారణాసిలోని కొందరు ఆటోడ్రైవర్లు సంతకాలు చేశారు. ఎన్నికల బరిలో దిగడం ఆయనకు ఇదేమీ కొత్త కాదు. ఇప్పటికే కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే దాకా పలు ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి మాత్రం బరిలో దిగుతున్న పార్లమెంట్ స్థానాన్ని మార్చి అందరి దృష్టినీ ఆకర్షించారు.వారణాసి ప్రజల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తేందుకే తాను అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెబుతున్నారు. ప్రధాని అయినా సరే, మోదీకి గట్టి పోటీ ఇస్తానని ధీమా కూడా వ్యక్తం చేస్తుండటం విశేషం. మిమిక్రీ సంచలనం, ప్రముఖ హాస్య కళాకారుడు శ్యామ్ రంగీలా కూడా వారణాసిలో మోదీపై ఇండిపెండెంట్గా బరిలో దిగడం తెలిసిందే. కానీ ఆయన నామినేషన్ బుధవారం తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్ నుంచి ఎప్పట్లాగే అజయ్ రాయ్ బరిలో ఉన్నారు. వారణాసిలో జూన్ 1న చివరి విడతలో పోలింగ్ జరగనుంది. -
ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఒక సిట్టింగ్ ఎంపీ సహా ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను రద్దు చేయాల్సిందేనని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. వారి నామినేషన్లు పత్రాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆ రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిషన్ని ఆశ్రయించింది.బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోల్కతా-దక్షిణ్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలా రాయ్ ఎంపీగానే కాకుండా కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్గా కూడా ఉన్నారని పేర్కొన్నారు. లాభదాయకమైనదిగా పరిగణించే ఆ పదవికి రాజీనామా చేయకుండానే ఆమె ఈసారి నామినేషన్ దాఖలు చేశారని చటోపాధ్యాయ చెప్పారు.మరో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్హత్ లోక్సభ నుంచి పోటీ చేస్తున్న హాజీ నూరుల్ ఇస్లాం నామినేషన్ను కూడా రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నూరుల్ ఇస్లాం ఇదే నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా 2009 నుంచి 2014 వరకు పనిచేశారు.నామినేషన్ దాఖలు చేసేవారెవరైనా ఇంతకు ముందు ఏదైనా ప్రభుత్వ, శాసనసభ లేదా పార్లమెంటరీ హోదాలో ఉన్నట్లయితే తమ నామినేషన్తో పాటు గత 10 సంవత్సరాలకు ప్రభుత్వం నుంచి నో డ్యూ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుందని, కానీ నూరుల్ ఇస్లాం ఆ నో డ్యూ సర్టిఫికెట్ను సమర్పించలేదని బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ అభ్యంతరం వ్యక్తం చేశారు.బీర్భూమ్ లోక్సభ నియోజకవర్గానికి తమ మొదటి అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి దేబాసిష్ ధర్ నామినేషన్ను ఇదే కారణంతో రద్దు చేశారని ఛటోపాధ్యాయ గుర్తు చేశారు. దీంతో తాము అభ్యర్థిని మార్చవలసి వచ్చిందన్నారు. రాయ్, ఇస్లాం నామినేషన్లలో ఈ లోపాలను ఎత్తిచూపుతూ ఇప్పటికే ఈసీని ఆశ్రయించామని, ఈ విషయంలో సుప్రీంకోర్టు సహా ఎంత వరకూ అయినా వెళ్తామని చటోపాధ్యాయ స్పష్టం చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి ఎటువంటి స్పందన లేదు. -
‘అమేథీలో నా ప్రత్యర్థి ప్రియాంకానే’
లక్నో: లోక్సభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. తనకు చిన్న పిల్లల వలే రాజకీయాలు చేయటం ఇష్టం లేదని తెలిపారు. స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంకా గాంధీపై విమర్శలు చేశారు.‘ఈ ఎన్నికల్లో అమేథీలో నా ప్రత్యర్థి.. ప్రియాంకా గాంధీ వాద్రా. నాపై ఆమె తెర వెనక నుంచి పోరాటం చేస్తున్నారు. కనీసం ఆమె సోదరుడు రాహుల్ గాంధీ నయం. ఆయన ప్రత్యక్షంగా పోటీలో ఉన్నారు. 2014లో రాహుల్ 1.07 లక్షల మెజార్టీతో గెలుపొందారు’ అని ప్రియాంకా గాంధీని ఎద్దేవా చేశారు.ఇక.. కాంగ్రెస్ పార్టీ అమేథీ పార్లమెంట్ స్థానంలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మను బరిలో నిలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా కాంగ్రెస్ కంచుకోట స్థానమైన రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ కేరళలోని వాయ్నాడ్లో సైతం పోటీ చేసిన విషయం తెలిసిందే.ఇక.. అమేథీ, రాయ్ బరేలీ స్థానాలు ప్రియాంకా గాంధీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ రెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆమె కృషి చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలో అన్ని తానై నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దుసూకువెళ్తున్నారు.అమేథీ, రాయ్బరేలీ సెగ్మెంట్లలో ఐదో విడత మే 20న పోలింగ్ జరగనుంది. ఇక.. గతంలో రాయ్బరేలీలో సోనియా గాంధీ చేతీలో ఓడిపోయిన దినేష్ ప్రతాప్ సింగ్ను మళ్లీ బీజేపీ బరిలోకి దించింది. -
అమేథీలో గెలుపెవరిది..?
-
మోదీపై పోటీ.. కమెడియన్ నామినేషన్ తిరస్కరణ
లోక్సభ ఎన్నికల వేళ అందరి చూపు వారణాసి పార్లమెంట్ స్థానం వైపే ఆకర్షిస్తోంది. అక్కడ పోటీ చేస్తేది.. ప్రధాని మోదీ కాబట్టి. అయితే మోదీపై పోటీ చేయడానికి కమెడియన్ శ్యామ్ రంగీలా వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ప్రధాని నరేంద్ర మోదీ వాయిస్ను అనుకరించటం వల్ల ఫేమస్ అయిన శ్యామ్ రంగీలా.. మే 14న వారణాసి స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సెగ్మెంట్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ్ రంగీలా నామినేషన్ వేశారు. ఒక రోజు తర్వాత ఆయన నామినేషన్ను తిర్కరించినట్లు ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పొందుపర్చింది. వారణాసిలో తనను నామినేషన్ వేయనీయకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.‘‘నన్ను ప్రతిపాదించేవారు ఉన్నారు. సంబందిత పత్రాలు కూడా నింపాం. ఆమోదించడానిక ఎవరు ముందుకు రావటం లేదు. రేపు మళ్లీ ప్రయత్నం చేస్తాం’’ అని మే 13న శ్యామ్ రంగీలా అన్నారు. మరుసటి రోజు కూడా అధికారులు సహరించలేదని తెలిపారు. అనంతరం ఎట్టకేలకు నిబంధంనల మేరకు నామినేషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం శ్యామ్ రంగీలా నామినేష్ను తిరస్కరణకు గురైంది. దీనిపై బుధవారం శ్యామ్ రంగీలా స్పదించారు. ‘‘ప్రజాస్వామ్యం హత్యకు గురైంది. ఎన్నికల్లో పోటీ చేయటాన్ని ఎన్నికల సంఘం ఒక ఆటలా భావిస్తోంది. నా నామినేషన్ను తిరస్కరించారు. ప్రజల ముందు ఎన్నికల అధికారుల ఇలా ఎందుకు చేశారో? 24 గంటల్లోనే ప్రజలకు అర్థం అయింది. నేను సమర్పించిన పత్రాల్లో ఎటువంటి సమస్య లేదు. నాకు తెలుసు నేను అన్ని అవసరమైన పత్రాలు సమర్పించాను. నిన్నటి విజయం నేడు ఓడి పోయింది’’ అని శ్యామ్ రంగీలా అన్నారు.ఇక.. రాజస్థాన్లోని హనుమాన్గర్హ్ జిల్లాలోని మనక్తేరి బరనీ గ్రామంలో 1994లో పుట్టిన ఆయన అసలు పేరు శ్యామ్ సుందర్. యానిమేషన్ పట్టభద్రుడైన శ్యామ్ సరదాగా కామెడీ, మిమిక్రీ, స్టాండప్ కామెడీ చేస్తుండేవాడు. 2017లో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ పోటీలో నరేంద్ర మోదీ వాయిస్ను శ్యామ్ మిమిక్రీ చేశాడు. అప్పటి నుంచే ఆయన విశేష గుర్తింపు వచ్చింది. ప్రధాని మోదీ గొంతును మిమిక్రీ చేసిన తర్వాత శ్యామ్కు వేధింపులు మొదలయ్యాయి. శ్యామ్ 2022లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా మోదీని విమర్శలు చేస్తూ సంచలనం రేపారు. వారణాసి పార్లమెంట్ స్థానానికి ఏడో విడతలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. -
PM Narendra Modi: మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులా?
నాసిక్: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 15 శాతం నిధులను మైనారీ్టలకే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులను తాము అనుమతించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. అలాగే విద్య, ఉద్యోగాల్లో మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని స్పష్టంచేశారు. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్లో 15 శాతం నిధులను వారికి ప్రీతిపాత్రమైన ఓటు బ్యాంక్కు కట్టబెట్టడానికి ప్రయతి్నంచిందని చెప్పారు. అప్పట్లో బీజేపీ గట్టిగా ప్రతిఘటించడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న తాను కాంగ్రెస్ ప్రతిపాదనను వ్యతిరేకించానని తెలిపారు.కానీ, మైనారీ్టలకు 15 శాతం నిధుల ఆలోచనను కాంగ్రెస్ ఇప్పటికీ విరమించుకోలేదని, ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయాలని యోచిస్తోందని విమర్శించారు. బుధవారం మహారాష్ట్రలోని పింపాల్గావ్ బస్వంత్, థానే పట్టణాల్లో లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు అనేది చాలా ప్రమాదకరమైన ఆలోచన అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మత ఆధారంగా దేశాన్ని ఇప్పటికే ఒకసారి విభజించిందని, మరో సారి అలాంటి పథకమే రచిస్తోందని ధ్వజమెత్తారు. తాము మతాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలు కేవలం ఎంపీలను ఎన్నుకోవడం కోసం కాదని అన్నారు. దేశం కోసం బలమైన నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం గల ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి జరుగుతున్నాయని ఉద్ఘాటించారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని వివరించారు. గత పదేళ్లలో తన పని తీరును ప్రజలు గమనించారని. వికసిత్ భారత్ కోసం తనను మూడోసారి గెలిపించాలని కోరారు. -
Lok Sabha Election 2024: డ్రమ్స్.. ధూం ధాం
సంప్రదాయ చీరలు. భుజానికి డోలు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కంటే ముందే దర్శనమిస్తారు. అభ్యరి్థది ఏ పార్టీ అయినా సరే, వీరు మాత్రం ఉండాల్సిందే. వారే మహిళా ఢాకీలు. ఈసారి పశి్చమబెంగాల్లో ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్న కళాకారులు వీళ్లు. ఢాకీ చప్పుడు దుర్గ పూజ సమయంలో ప్రజలను మేల్కొలిపే సంబరం. ‘ధునుచి నాచ్’లాగే డ్రమ్స్ వాయించడం దుర్గ పూజలో ముఖ్యమైన అంశం. సాధారణంగా దుర్గ పూజ సమయంలో స్త్రీలు నృత్యకారిణులుగా, పురుషులు ఢాకీలుగా ఉంటారు. కొంతకాలం కింద మహిళలు ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. దుర్గ పూజల్లో డ్రమ్స్ వాయిస్తూ ఢాకీలుగా ఉపాధి పొందుతున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రచారంలో కీలకంగా మారారు. దాదాపుగా అన్ని పారీ్టలూ వీరిని పిలుస్తున్నాయి. వీళ్లు ముఖ్యంగా రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. అయితే అదంత సులువైన వ్యవహారం కాదు. రోజంతా డ్రమ్ భుజానికి తగిలించుకునే ఉండాలి. మరోవైపు తీవ్రమైన వేడి. అయినా ఉపాధి దొరుకుతుండటంతో మహిళలు ఢాకీ ధరించి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఢాకీ వాయిస్తూ రోజుకు రూ.700 నుంచి రూ.800 దాకా సంపాదిస్తున్నారు. దుర్గాపూజ వేళ వీరికి 5 రోజులకు రూ.8 వేల నుంచి రూ.10 వేల దాకా వస్తాయి. ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో అయితే ఆదాయం ఇంకాస్త ఎక్కువ వస్తుంది. గతేడాది హైదరాబాద్లోనూ దసరా ఉత్సవాల్లో మహిళా ఢాకీలు సందడి చేశారు! డిమాండ్ పిరిగింది... ఎన్నికల ప్రచారంలో గతంలో మహిళా ఢాకీలకు ఇంత డిమాండ్ ఉండేది కాదంటున్నారు శివ్పాద్ దాస్. ఆయన మాచ్లాండ్పూర్లో ఢాకీ శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. ‘‘ఈసారి మహిళా ఢాకీలకు పారీ్టల నుంచి బాగా డిమాండ్ ఉంది. సామాన్యులు కూడా మహిళా ఢాకీలనే ఇష్టపడుతున్నారు. పురుషుల సంగీత వాయిద్యాలను మహిళలు తమ భుజాలపై వేసుకుని వాయిస్తుండటంతో చూసేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు’’ అని శివ్పాద్ చెప్పారు. ‘‘భర్తతో పాటు కుటుంబాన్ని ఆదుకోవడానికి ఢాకీలుగా పని చేస్తున్నాం. పిల్లల చదువుల ఖర్చుతో కుటుంబ అవసరాలను తీర్చగలుగుతున్నాం. ఒకేసారి వేల రూపాయలు సంపాదించగలగడం ఆనందాన్నిస్తోంది. ఇప్పుడు ఎన్నికల సీజన్ గనుక తినడానికి, తాగడానికి కూడా సమయం ఉండటం లేదు. రోజూ ఏదో ఒక పార్టీ ప్రచార కార్యక్రమానికి డ్రమ్ భుజాన వేసుకుని వెళ్తూనే ఉన్నాం’’ అని ఆనందంగా చెబుతున్నారు మహిళా ఢాకీలు. 14 ఏళ్ల కిందట మొదలై... ప్రముఖ ఢాకీలలో ఒకరైన గోకుల్ చంద్ర దాస్ పద్నాలుగేళ్ల కిందట తన కుటుంబంలోని మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. కోడలు ఉమా దాస్, కుమార్తె టుకుతో కలిసి మహిళా ఢాకీల బృందాన్ని ప్రారంభించారు. 2011లో దుర్గా పూజ పండల్లో తొలిసారి ప్రదర్శన ఇచ్చినప్పుడు అంతా ఆశ్చర్యపోయి చూశారు. అయితే బెంగాలీ టాలెంట్–హంట్ షోలో మహిళా ఢాకీలు కనిపించిన తరువాత పరిస్థితి మారింది. వారిని దుర్గా పూజలకు పిలవడం మొదలైంది. ఇప్పుడు బెంగాల్లో అనేక మహిళా ఢాకీ శిక్షణా కేంద్రాలున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: మథువాల మద్దతెవరికో!
బన్గావ్. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దులోని లోక్సభ స్థానం. ఈ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో మథువాల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ పారీ్టల గెలుపోటములను నిర్ణయించేది వాళ్లే. దాంతో బీజేపీ, తృణమూల్ రెండూ మథువా సామాజిక వర్గానికి చెందిన వారినే బరిలోకి దించాయి. గత ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందిన శంతను కుమార్ బీజేపీ నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బిశ్వజిత్ దాస్ రంగంలో ఉన్నారు...బన్గావ్ లోక్సభ స్థానం 2009లో ఏర్పడింది. స్వాతంత్య్రానంతరం, 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో హిందూ శరణార్థులు భారీగా బన్గావ్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. వీరిలో అత్యధికులు మథువాలే. బన్గావ్ ఓటర్లలో 67 శాతం దాకా వాళ్లే ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నేపథ్యంలో వీరు సహజంగానే బీజేపీకి మద్దతిస్తున్నారు. బన్గావ్ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ బన్గావ్ నుంచి బెంగాల్ ప్రచారాన్ని ప్రారంభించారు. మథువా సామాజికవర్గానికి పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో వారి ఓట్లు అత్యధికంగా బీజేపీకే పడ్డాయి. అలా ఇక్కడ తొలిసారి బీజేపీ విజయం సాధించింది. శంతను లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా బన్గావ్లో సీఏఏ ప్రధాన ఎన్నికల అంశంగా మారింది. సీఏఏ చట్టాన్ని అమల్లోకి తెస్తూ ఎన్నికల ముందు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. అయితే ఆన్లైన్ దరఖాస్తుల్లో బంగ్లాదేశ్లో ఉన్నప్పటి చిరునామా, నివాస పత్రాల వివరాలను చాలామంది సమర్పించలేదు. ఇది సమస్యలకు దారి తీయడంపై ఇక్కడి మథువాలు అసంతృప్తితో ఉన్నారు. తప్పుదారి పట్టిస్తున్నారు: టీఎంసీ సీఏఏను తృణమూల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది మథువా వర్గాన్ని తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రగా అభివరి్ణస్తోంది. మథువాలు ఇప్పటికే భారతీయులని, వారికి ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు ఉన్నాయని తృణమూల్ అధినేత్రి మమత అంటున్నారు. ‘‘ఈ దేశ పౌరులు కాకుంటే ఇన్నేళ్లు వారు ఓటెలా వేశారు? ప్రజాప్రతినిధులుగా పార్లమెంటుకు, బెంగాల్ అసెంబ్లీకి ఎలా వెళ్లారు?’’ అని ప్రశి్నస్తున్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బన్గావ్లో ఘోర పరాజయం తర్వాత గతేడాది పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ దుమ్ము రేపింది. బోరో కుటుంబానిదే ఆధిపత్యం... బన్గావ్ రాజకీయాలను బోరో మా (బీనాపాణి దేవి) కుటుంబమే శాసిస్తోంది. 1947లో బీనాపాణి దేవి, ఆమె భర్త ప్రమథ్ రంజన్ ఠాకూర్ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి దక్షిణ కోల్కతాలోని బల్లిగంజ్లో స్థిరపడ్డారు. ప్రమథ్ నామశూద్ర (ఎస్సీ) కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు. మథువాల హక్కుల కోసం పోరాడారు. తమలా వలస వచి్చన వారికి ఆశ్రయం కోసం స్థానిక ఠాకూర్నగర్లో భూమి కొనుగోలు చేశారు. ‘ఠాకూర్బరీ ల్యాండ్ అండ్ ఇండస్ట్రీస్’ పేరుతో కొన్న ఆ స్థలంలో శరణార్థుల కోసం తొలి ప్రైవేట్ కాలనీ నిర్మించారు. ప్రమథ్ 1962లో కాంగ్రెస్ అభ్యరి్థగా హన్స్ఖాలీ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. కుమారుడు కపిల్ కృష్ణ ఠాకూర్ 2014లో ఎంపీ అయ్యారు. ఆయన మరణానంతరం భార్య మమత 2015 ఉప ఎన్నికలో గెలిచారు. చిన్న కుమారుడు మంజుల్ కృష్ణ ఠాకూర్ టీఎంసీ ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థి శంతను ఆయన రెండో కుమారుడే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సెన్స్క్స్ డౌట్!
మళ్లీ వచ్చేది మోదీయే... ఈసారి ఎన్డీయే కూటమికి 400 పై చిలుకు సీట్లు పక్కా... బీజేపీకి కనీసం 370 సీట్లు ఖాయం... కమలనాథుల అంచనాలివి! తీరా ఎన్నికలు మొదలై ఒక్కో విడత పోలింగ్ ముగుస్తున్నకొద్దీ ఈ ఉత్సాహం మెల్లమెల్లగా నీరుగారుతోంది. నాలుగు విడతల్లోనూ పోలింగ్ గత ఎన్నికలతో పోలిస్తే తగ్గడంతో అధికార పార్టీలో కాస్త అలజడి మొదలైంది. ఇదే మూడ్ స్టాక్ మార్కెట్లోనూ ప్రతిబింబిస్తోంది. ఓటింగ్ తగ్గడంతో బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్ను అందుకుంటుందో లేదోనన్న అనుమానాలు తలెత్తడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం దెబ్బతింది. రోజుకో కొత్త రికార్డులతో రంకెలేసిన బుల్ ఒక్కసారిగా రివర్స్ గేర్ వేసింది. ఎన్నికల ‘వేడి’కి తికమకపడుతోంది. నిన్నమొన్నటిదాకా పెట్టుబడుల వరద పారించిన విదేశీ ఇన్వెస్టర్లు పొలోమంటూ అమ్మకాలకు తెగబడుతున్నారు. అయి తే ఫలితాలపై అనిశ్చితి వల్లే సెంటిమెంట్పై ప్రభావం పడుతోందని, బీజేపీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇన్వెస్టర్లు తరలివస్తారని నిపుణులు పేర్కొంటున్నారు... స్టాక్ మార్కెట్లో ఈసారి ఎన్నికల ముందస్తు ర్యాలీతో రికార్డుల మోత మోగింది. మోదీ 3.0పై నమ్మకానికి తోడు ఎన్డీయే సీట్ల సంఖ్య కూడా పెరుగుతుందన్న అంచనాలు దీనికి కారణం. అయితే, ఎన్నికల ‘వేడి’ జోరందుకుని, పోలింగ్ మొదలయ్యాక ఇన్వెస్టర్లలో నెమ్మదిగా నమ్మకం సడలుతూ వస్తోంది. ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన నాలుగు విడతల్లోనూ గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గడం దీనికి ఆజ్యం పోసింది. మండుటెండలు, పట్టణ ఓటర్ల నిరాసక్తత వంటి కారణాలు ఎన్నున్నా ... ఓటింగ్ పడిపోవడంతో ఫలితాల్లో బీజేపీ బంపర్ విక్టరీపై అనుమానాలు ఇన్వెస్టర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇటీవలే సెన్సెక్స్ (75,111 పాయింట్లు), నిఫ్టీ (22,795 పాయింట్లు) కొత్త ఆల్టైం గరిష్టాలను తాకిన తర్వాత భారీగానే క్షీణించాయి. గడచిన నెల రోజుల్లో సూచీలు దాదాపు 3 శాతం పైగానే పడటం దీనికి అద్దం పడుతోంది. గత ఎన్నికల్లో తొలి విడతల్లో పోలింగ్ తగ్గినా, క్రమంగా పుంజుకుంది. దాంతో మొత్తమ్మీద రికార్డు స్థాయిలో 67.4 శాతం ఓటింగ్ జరిగింది. బీజేపీ సొంత బలం కూడా 282 నుంచి 303 లోక్సభ స్థానాలకు ఎగబాకింది. ఈసారి మాత్రం తొలి విడత నుంచే ఓటింగ్ క్రమంగా తగ్గముఖం పడుతూ వస్తోంది. మిగతా 3 విడతల్లోనూ ఇలాగే మందకొడిగా జరిగితే మొత్తం ఓటింగ్ గతం కంటే 2 నుంచి 3 శాతం తగ్గేలా కని్పస్తోంది.విదేశీ ఇన్వెస్టర్లు పీఛే ముడ్... ఓటింగ్ శాతం తగ్గుతుండటం, ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడంతో విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ)లో కూడా ఆందోళన మొదలైంది. మన ఈక్విటీ మార్కెట్లలో గత నెలన్నరలో రూ.30 వేల కోట్లకు పైగా విలువైన షేర్లను అమ్మేయడం దీనికి నిదర్శనం. మార్కెట్లు భారీగా పడటానికి ఎఫ్పీఐల విక్రయాలే కీలకంగా నిలుస్తున్నాయి. 2023లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ఏకంగా రూ.1.77 లక్షల కోట్లను దేశీ మార్కెట్లో కుమ్మరించి రికార్డులు బద్దలుకొట్టారు. అంతేకాదు, ఇందులో దాదాపు మూడో వంతు (రూ.58 వేల కోట్లు) ఒక్క డిసెంబర్లోనే ఇన్వెస్ట్ చేయడం విశేషం. దీనికి తోడు దేశీ ఇన్వెస్టర్లు, ఫండ్స్ జోరుతో బుల్ రంకెలేసింది. గతేడాది సెన్సెక్స్, నిఫ్టీ 20 శాతం రాబడులు అందించాయి. కార్పొరేట్ కంపెనీల లాభాలు పుంజుకోవడం, ప్రభుత్వ పెట్టుబడుల జోరు, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం, వృద్ధి రేటు పుంజుకోవడం, సుస్థిర ప్రభుత్వం, స్థిరమైన పాలసీలు తదితర కారణాలతో విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే, 2014లో ఎన్నికలు జరిగిన ఏప్రిల్–మే నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.23,607 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. 2019 ఇదే కాలంలో రూ.29,113 కోట్లు దేశీ మార్కెట్లో కుమ్మరించారు. దీంతో 2019లో నాలుగో దశ పోలింగ్ ముగిసే నాటికి నెల రోజుల్లో సెన్సెక్స్ 3.7 శాతం, నిఫ్టీ 2.2 శాతం చొప్పున ఎగబాకాయి. ఈసారి మాత్రం ట్రెండ్ దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఒకపక్క విదేశీ ఇన్వెస్టర్లు తిరోగమన బాట పట్టగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం మార్కెట్కు ప్రతికూలంగా మారింది.విదేశీ మార్కెట్లు రయ్ రయ్ ఉక్రెయిన్–రష్యా యుద్ధం, మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితుల ప్రభావం కంటే, ఎన్నికల ప్రభావమే మన మార్కెట్లో ప్రధానంగా కనిపిస్తోంది. విదేశీ మార్కెట్లు గత నెల రోజుల్లో భారీగా పెరిగినప్పటికీ.. మన సూచీలు ఆ స్థాయిలో పెరగకపోగా, 3 శాతం మేర పడిపోవడం దీనికి నిదర్శనం. గత నెల రోజుల వ్యవధిలో హాంకాంగ్ హాంగ్సెంగ్ ఇండెక్స్ ఏకంగా 15.2 శాతం జంప్ చేసింది. బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ సూచీ 6 శాతం, యూఎస్ డోజోన్స్ 4.7 శాతం, జర్మనీ డాక్స్ సూచీ 4.1 శాతం, చైనా షాంఘై ఇండెక్స్ 3 శాతం చొప్పున ఎగబాకాయి. ‘‘ఎన్నికల ఫలితాలపై అనుమానంతోనే విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. ఓటింగ్ శాతం భారీగా తగ్గితే, బీజేపీ అంచనాలు తారుమారు కావచ్చు. ఆ పార్టీ సాధించే సీట్లు గణనీయంగా తగ్గే అవకాశముంది. మిగతా విడతల ఓటింగ్పై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు. తదనుగుణంగానే మార్కెట్ల గమనం ఉంటుంది’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. ఎందుకీ ఆందోళన...బీజేపీకి గనుక సొంతంగా మెజారిటీ రాకపోతే ఎన్డీఏ పక్షాలపై పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల ప్రాంతీయ పార్టీల డిమాండ్లకు తలొగ్గడం, బుజ్జగింపులు తదితరాలతో విధాన నిర్ణయాలపై ప్రభావం పడుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేగాక కీలక బిల్లుల ఆమోదం విషయంలో ఇప్పుడున్న స్వేచ్ఛ లేకపోవడం కూడా అటు ఆర్థిక వ్యవస్థకు, ఇటు మార్కెట్లకు ప్రతికూలాంశం. చివరి మూడు విడతల్లో భారీగా ఓటర్లు పోటెత్తితే తప్ప ప్రస్తుత ఓటింగ్ శాతం ప్రకారం చూస్తే బీజేపీకి సొంతంగా 370, ఎన్డీఏ కూటమికి 400 పై చిలుకు సీట్ల లక్ష్యం నెరవేరే అవకాశాలు లేనట్టే. అంతేగాక గతంలో మాదిరిగానైనా రాకుండా బీజేపీ ఏ 260 సీట్ల దగ్గరో ఆగిపోతే మళ్లీ సంకీర్ణ లుకలుకలు తలెత్తే ఆస్కారం లేకపోలేదు. ఇవన్నీ మార్కెట్లకు రుచించని విషయాలే. విదేశీ ఇన్వెస్టర్లలో ఇలాంటి భయాలే నెలకొన్నాయిప్పుడు! అందుకే ప్రస్తుతానికి కొన్ని పొజిషన్లను తగ్గించుకుని, ఫలితాల తర్వాత పరిస్థితులను బట్టి మళ్లీ ఇన్వెస్ట్ చేయొచ్చనే భావన వారిలో కనబడుతోందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. సూచీల తాజా పతనంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం స్పందించారంటే, ఇన్వెస్టర్లలో ఆందోళన అధికార పక్షాన్ని కూడా బాగానే కలవరపెడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ‘గతంలో కూడా మార్కెట్లు గట్టిగా పడిన సందర్భాలున్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ కదలికలను నేరుగా ఎన్నికలకు ముడిపెట్టకూడదు. తాజా ఒడిదుడుకులకు ‘కొన్ని వదంతులు’ ఆజ్యం పోసి ఉండొచ్చు. నా అభిప్రాయం ప్రకారం జూన్ 4కు ముందే షేర్లు కొనుక్కోండి. ఫలితాల తర్వాత మార్కెట్ దూసుకెళ్తుంది’ అని అమిత్ షా తాజాగా వ్యాఖ్యానించారు.2004లో 20% క్రాష్ఎన్నికల ముందస్తు పరిస్థితులతో సంబంధం లేకుండా గత నాలుగు ఎన్నికల్లోనూ ఫలితాల తర్వాత సెస్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలనే అందించాయి. అయితే 2004 ఎన్నికల్లో వాజ్పేయి సర్కారు అనూహ్య ఓటమి చవిచూడటం, హంగ్ కారణంగా ఫలితాల తర్వాత 20 శాతం మార్కెట్ క్రాష్ అయింది! కానీ మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీఏ ప్రభుత్వం కొలువుదీరాక మార్కెట్ విశ్వాసం పుంజుకుంది. మిగతా ఏడాది కాలంలో రాబడులు దండిగానే వచ్చాయి. 2009 ఫలితాల తర్వాత మే 18 నుంచి డిసెంబర్ వరకు 31 వరకు సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 40 శాతం దూసుకెళ్లడం విశేషం. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు జోరుకు తోడు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వరద, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అమెరికాలో సహాయక ప్యాకేజీలు కూడా దోహదం చేశాయి. 2019 ఎన్నికల తర్వాత మాత్రం మార్కెట్లు ఏమంత పెద్దగా పెరగలేదు. ప్రపంచ మార్కెట్లలో అనిశి్చతి, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం, బలహీన వృద్ధి రేటు వంటి ప్రభావాలతో 4 నుంచి 5 శాతం మాత్రమే రాబడులొచ్చాయి. అధికార పక్షం గెలుపు అంచనాలు తప్పొచ్చనే ఆందోళనల వల్లే దేశీ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు వస్తున్నాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీకి సీట్లు భారీగా తగ్గినా, సొంతంగా మెజారిటీ రాకపోయినా, ఫలితాల రోజున మార్కెట్ నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉండొచ్చు. ఫలితా లొచ్చేదాకా∙ఇదే అలజడి ఉంటుంది– మాధవీ అరోరా, ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ ముఖ్య ఆర్థికవేత్త– సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రిజర్వేషన్లు రద్దు చేసే శక్తి ఎవరికీ లేదని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు. అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు ఉంటాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమపై దుష్ప్రచారం చేసినా, ప్రజలు బీజేపీని విశ్వసించారని పేర్కొన్నారు. మజ్లిస్ వ్యవహరించిన తీరు కూడా బీజేపీకి అనుకూలంగా మారిందన్నారు.తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అవతరించనుందని అన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఇచ్చిన ఏ హామీనీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయట్లేదని విమర్శించారు. పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామన్నారు.. ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మినహా ఏ గ్యారంటీ అమలు కావడం లేదని దుయ్యబట్టారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించట్లేదని ధ్వజమెత్తారు.డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పారు, ఇప్పటికైనా సీఎ రేవంత్ రెడ్డి అబద్ధాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉందన్నారు. అడుగడుగునా హామీలపై కాంగ్రెస్ను నిలదీస్తామని చెప్పారు. రేవంత్ పాలన మొదలుపెట్టకుండానే పరీక్ష అంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే రేవంత్ ఏం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వచ్చిందన్నారు.చదవండి: ఆడ రాక పాత గజ్జెలు.. సీఎం రేవంత్పై హరీశ్రావు సెటైరికల్ ట్వీట్ Live: Press Meet, 6 Ashoka Road, New Delhi. https://t.co/lynyvwj2XR— G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) May 15, 2024
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తీన్మార్ మల్లన్నను అనర్హుడిగా ప్రకటించాలి
51 జంటలకు సామూహిక వివాహాలు
తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
వానొస్తే మునకే!
రైలొచ్చినా రోడ్డుమార్గమే..
కురుస్తున్న పెద్దాస్పత్రి భవనం
రెండో రోజూ కొనసాగిన తనిఖీలు
పోక్సో కేసులో 20ఏళ్ల జైలుశిక్ష
● తాతయ్యగుంట గంగమ్మకు తోటివేషాలతో మొక్కులు ● అమ్మవారికి సేవకు పోటెత్తిన భక్తులు
ఐకేఎస్తో వేదిక్ వర్సిటీ ఒప్పందం
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement