-
అలాంటి పాటలంటే నాకు ఇష్టం లేదు.. కానీ: సుకుమార్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప-2: ది రూల్ మరో వంద రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్పకు సీక్వెల్గా వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. రిలీజైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది.అయితే వీరిద్దరి కాంబోలో 20 ఏళ్ల క్రితం వచ్చిన ఆర్య సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. కేవలం రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ 20 ఏళ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అసలు తన సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టడం తనకిష్టం లేదని అన్నారు. ఐటమ్ సాంగ్స్ తనకు నచ్చవని సరదాగా కామెంట్స్ చేశారు.సుకుమార్ మాట్లాడుతూ.. 'ఐటమ్ సాంగ్ నాకిష్టం లేదు. అ అంటే అమలాపురం లిరిక్ నాకు నచ్చింది. అది రాసేటప్పుడు టైం లేదు. వేటూరి దగ్గరకు పంపించాను. 'అల్లుగారి పిల్లగాడా' అంటే ఏంటి? అతను నా హీరో ఆర్య.. అల్లుగారి అబ్బాయి కాదు' అని చెప్పా. ఆర్య వచ్చి హీరోయిన్ను వెతుక్కోవాలి కానీ.. అరవింద్ గారి అబ్బాయి అంటే ఈజీగా హీరోయిన్ను పటగొట్టేస్తాడు . ఆర్యకు బైక్ కూడా లేదు.. చాలా పూర్. కేవలం సైకిల్ మాత్రమే ఉంది అంటూ నవ్వారు. నాకిష్టం లేకపోయినా నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటం సాంగ్ వచ్చేసింది. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది. ఐటమ్ సాంగ్ ఉంటే సినిమాను ఇంత దూరం తీసుకెళ్తుందా?.. ఇంత వైబ్ వస్తుందా? అనే మూడ్లోకి వచ్చేశాను. కానీ దిల్ రాజు ఏమో ఒక్క ఐటెం సాంగ్ కూడా లేకుండా కళాత్మకంగా సినిమాలు చేస్తున్నారు' అని అన్నారు. -
భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
టాలీవుడ్లో పెళ్లి సందడి చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యి తనదైన చలాకీ నటనతో సినీ పరిశ్రమ దృష్టిని తన వైపునకు తిప్పుకున్న నటి శ్రీలీల. అలాగే ఆ చిత్రం సక్సెస్ అయినా ఆ వెంటనే మరో అవకాశం రాకపోవడంతో ఈ అమ్మడి పరిస్థితి అంతేనా అనే కామెంట్స్ కూడా దొర్లాయి.అయితే రవితేజ సరసన నటించిన ఢమాకా చిత్రం హిట్ అవడం, ముఖ్యంగా అందులోని పాటల్లో శ్రీలీల తన డా¯న్స్తో కుర్రకారును ఫిదా చేసింది. దీంతో ఆమె పేరు మారు మ్రోగింది. ఆ తరువాత మహేష్ బాబు సరసన నటించే అవకాశం రావడంతో మరింత క్రేజ్ వచ్చింది. దీంతో ఇతర భాషల దర్శక నిర్మాతల దృష్టి శ్రీలీలపై పడింది. అలా కోలీవుడ్లో భారీ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ముందుగా దళపతి విజయ్తో స్పెషల్ సాంగ్లో నటించే అవకాశం వచ్చింది.విజయ్ ప్రస్తుతం గోట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీ ఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నటి మీనాక్షి శేషాద్రి, స్నేహ, లైలా, మైక్ మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్ జీ మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటుడు విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒకటి విలన్ పాత్ర అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రష్యాలో జరుగుతోంది. కాగా ఇందులో ఒక స్పెషల్ సాంగ్ చోటు చేసుకుంటుందట. ఆ పాటలో నటి త్రిష నటించనున్నారనే ప్రచారం జరిగింది.ఆ తరువాత కాల్ షీట్స్ సమస్య కారణంగా ఆమె నటించలేని పరిస్థితి అని, దీంతో టాలీవుడ్ యువ స్టార్ కథానాయకి శ్రీలీలను ఆ అవకాశం వరించిందని సమాచారం. అయితే ఆ అవకాశాన్ని శ్రీలీల తిరస్కరించినట్లు తెలిసింది. కారణం కోలీవుడ్లో సింగిల్ సాంగ్తో ఎంట్రీ అయితే అది కెరీర్ ఎదుగుదలకు బాధింపు ఏర్పడుతుందని భావించడమేనట. ఇది ఆమె బ్రిలియంట్ డెసిషన్ అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఇప్పుడు శ్రీలీల త్వరలో మరో స్టార్ హీరో అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో కథానాయికగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్. -
స్టార్ హీరో సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్?
దర్శకుడు వెంకట్ ప్రభు చిత్రం అంటే చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ముఖ్యంగా నటీనటులు ఎక్కువగా ఉంటారు. సాంకేతిక విలువలకు ప్రాముఖ్యత ఉంటుంది. గోట్ చిత్రంలోనూ ఇవి కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. నటుడు విజయ్ నటిస్తున్న చివరి చిత్రానికి ముందు చిత్రం గోట్. దీని తరువాత తన 69వ చిత్రం చేసి విజయ్ నటనకు స్వస్తి పలకనున్నారనే టాక్ చాలా కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే.వెంకట్ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్జీ, మైక్ మోహన్ తదితరు లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గోట్ చిత్రాన్ని సెప్టెంబర్ 5వ తేదీన వినాయక చతుర్థి సందర్భంగా విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం.కాగా ఇందులో నటి త్రిష ప్రత్యేక పాత్రలో మెరవనున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడా స్పెషల్ అప్పీరియన్స్ను ఇవ్వడానికి టాలీవుడ్ క్రేజీ నటి శ్రీలీలతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో ఈమెకు ప్రత్యేకంగా ఒక పాట కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. ఇదే గనుక నిజం అయితే శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ చిత్రం గోట్నే అవుతుంది. కాగా ఈ అమ్మడు మరో టాప్స్టార్ అజిత్తో జత కట్టడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శ్రీలీల కోలీవుడ్పై దండెత్తబోతున్నారన్నమాట. చూద్దాం ఇక్కడ ఈమె ప్యూచర్ ఎలా ఉండబోతోందో. -
Speed220: ఆకట్టుకుంటున్న గీతామాధురి మాస్ సాంగ్
హేమంత్, గణేష్ ,ప్రీతి సుందర్, జాహ్నవి శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం స్పీడ్ 220. విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి కొండమూరి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హర్ష బెజగం దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ సాంగ్ని విడుదల చేశారు. ‘బెజవాడలో బాలాకుమారి, మిర్యాలగూడలో మీనా కుమారి..’ అంటూ సాగే ఈ మాస్ పాటకి సంతోష్ కుమార్ బి లిరిక్స్ అందించగా.. ప్రముఖ గాయని గీతామాధురి అద్భుతంగా ఆలపించింది. యంగ్ టాలెంటెడ్ డాన్సర్ స్నేహ గుప్తా తనదైన స్టెప్పులతో అదరగొట్టింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా చిత్రాన్ని తెరకెకికస్తున్నామని దర్శకుడు హర్ష తెలిపారు. ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్తో చిత్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. -
పుష్ప సాంగ్ క్రేజ్.. వారి స్టెప్పులకు సమంత ఫిదా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఫుష్ప. ఈ సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్గా పుష్ప-2 కూడా రాబోతోంది. అయితే పుష్పలో సమంత ఐటమ్ సాంగ్కు స్టెప్పులేయని వారు ఉండరు. ఈ సినిమా వచ్చి రెండేళ్లు పూర్తయినా ఆ సాంగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ చిత్రంలోని 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' అనే సాంగ్ ఆడియన్స్ను ఓ ఊపు ఊపేసింది. అయితే తాజాగా ముగ్గురు చిన్నారులు ఈ పాటకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సుకుమార్ భార్య తబిత తన ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన సమంత చిన్నారుల డ్యాన్స్కు ఫిదా అయిపోయింది. అంతే కాకుండా తగ్గేదేలే అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో చూశాక నేను ఇంకాస్తా బెటర్గా చేయాల్సిందని ఫన్నీ ఎమోజీతో పాటు లవ్ సింబల్ జత చేసింది. ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. సమంత ఇండియన్ వర్షన్ సిటాడెల్ వెబ్ సిరీస్లో కనిపించనుంది. ఈ సిరీస్లో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. -
బార్లో ‘ప్రేమదేశపు యువరాణి’ ఐటెం సాంగ్!
యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. సాయి సునీల్ నిమ్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏజీఈ క్రియేషన్స్, ఎస్2హెచ్2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘మసకతడి’ అనే ప్రత్యేక గీతాన్ని హైదరాబాద్ మణికొండలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో యామిన్ మాట్లాడుతూ ‘ఓపెన్ బార్లో ప్రేక్షకుల సమక్షంలో పాటను విడుదల చేయడం, వారినుంచి చక్కని స్పందన రావడం చక్కని అనుభూతి కలిగించింది. సెలబ్రిటీల సమక్షంలో ఇలాంటి వేడుక చేయడం రొటీన్ మేమిలా వినూత్నంగా ప్లాన్ చేశాం. దర్శకుడి ఐడియాకు ధన్యవాదాలు’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఎమోషనల్గా సాగే లవ్స్టోరీ ఇది. బార్లో పాట విడుదల చేయడం తప్పని అనుకున్నా ఇలా... కొత్తగా పబ్లిసిటీ చేస్తేనే చిన్న సినిమాలు జనాల్లోకి వెళతాయి. అంతా కొత్తవాళ్లం ఓ మంచి ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం’అని అన్నారు. -
పుష్ప-2లో ఐటం సాంగ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా!
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐకాన్ స్టార్ మూవీ 'పుష్ప-2: ది రూల్'. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పుష్ప పార్ట్-2 బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు బద్దలు కొట్టగా.. ఈ చిత్రం అంతకుమించి ఉంటుందని తెలుస్తోంది. పుష్పలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ 'ఊ అంటా మావ.. ఉఊ అంటావా మావ' క్రేజ్ మామూలుగా లేదు. ఆ పాటకు డ్యాన్స్ చేయకుండా ఉండలేని వారు ఉండరంటే అతియోశక్తి కాదేమో. అంతలా సినీ ప్రేక్షకులను ఊపేసింది. (ఇది చదవండి: భార్య కోసం ఏకంగా ఆస్పత్రినే బుక్ చేసిన స్టార్ హీరో! ) అయితే పుష్ప-2లోనూ అదిరిపోయే ఐటమ్ సాంగ్ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఐటమ్ సాంగ్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కనిపించనుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ మీడియా కథనం ప్రకారం ఈ మూడు నిమిషాల ఐటమ్ సాంగ్ కోసం ఆమె ఏకంగా రూ.6 నుంచి రూ.7 కోట్లు వసూలు తీసుకుంటున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఊర్వశి కూడా అంతకంటే ఎక్కువే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. కాగా.. పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17, 2021న థియేటర్లలో విడుదలై ప్రభంజనం సృష్టించింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు.బాలీవుడ్ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో కనిపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈచిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు. గతంలో బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప-2 ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన పుష్ప-2 గ్లింప్స్ వీడియోతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. (ఇది చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల) -
పోయే ఏనుగు పోయే: ఈడొచ్చి పైటేసిన చిన్నదాన్ని సాంగ్ రిలీజ్..
బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'పోయే ఏనుగు పోయే'. కె.శరవణన్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నాడు. ధమాకా, బలగం చిత్రాలతో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరక్టర్గా పేరు తెచ్చుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రంలోని 'ఈడొచ్చి పైటేసిన చిన్నదాన్ని' అనే లిరికల్ వీడియో సాంగ్ను సిల్లీ మాంక్స్ ఆడియో ద్వారా ఆదివారం విడుదల చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రం ప్రస్తుతం సెన్సార్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత కె.శరవణన్ మాట్లాడుతూ... 'భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించిన మా చిత్రంలోని ఐటెమ్ లిరికల్ వీడియో ఈ రోజు లాంచ్ చేశాము. శ్రీ సిరాగ్ ఈ పాటను రచించారు. మా సినిమా కథ విషయానికొస్తే... నిధిని దక్కించుకోవడానికి కొంత మంది ఒక ఏనుగు పిల్లని బలి ఇవ్వాలనుకుంటారు... దాన్ని ఒక కుర్రాడు ఎలా ఆపాడు? తన తల్లి దగ్గరకు ఎలా చేర్చాడు అన్నది కథాంశం. ఇందులో బాహుబలి ప్రభాకర్, ధన్ రాజ్, రఘు బాబు, తమిళ నటుడు మనోబాల కీలక పాత్రల్లో నటించారు. అలాగే అద్భుతమైన గ్రాఫిక్స్తో విజువల్ వండర్గా సినిమాను తీర్చిదిద్దాము. అతి త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదలై ఆదరణ పొందుతుందన్న నమ్మకం ఉంది' అని తెలిపారు. చదవండి: 30 ఏళ్లుగా హీరోలతో దెబ్బలు తిన్నా..: సింహాద్రి నటుడు -
ఊ అంటావా మావా.. లాంటి పాటలు నేను చేయను: కృతీ శెట్టి
పాన్ ఇండియా సినిమాగా రిలీజైన పుష్పలోని 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా..' పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే! దక్షిణాది నుంచి ఉత్తరాది దాకా అందరూ ఈ పాట మత్తులో ఊగిపోయారు, తనివితీరా స్టెప్పులేశారు. మొదట ఈ పాట చేయడానికి సమంత ఒప్పుకోకపోయినప్పటికీ అల్లు అర్జున్ నచ్చజెప్పి ఆమెతో ఓకే చెప్పించాడు. బన్నీ ఊహించినట్లుగానే ఈ పాటతో సామ్కు నేషనల్ లెవల్లో మరింత గుర్తింపు వచ్చింది. అయితే ఇలాంటి పాటలు తాను అస్సలు చేయనని అంటోంది యంగ్ హీరోయిన్ కృతీ శెట్టి. నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం కస్టడీ. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతీకి ఓ ప్రశ్న ఎదురైంది. ఊ అంటావా మావ వంటి ప్రత్యేక గీతాల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా? అని విలేకరి సూటిగా ప్రశ్నించాడు. దీనికి కృతీ చేయనని కుండ బద్ధలు కొట్టేసింది. ఆమె మాట్లాడుతూ.. 'ప్రస్తుతానికైతే అలాంటి ఐటం సాంగ్స్లో నటించాలనుకోవడం లేదు. ఎందుకంటే నాకు ఆ పాటలపై ఎలాంటి అవగాహన లేదు. దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు కూడా! నా సినీ ప్రయాణంలో నేను తెలుసుకున్న విషయమేమిటంటే.. సౌకర్యంగా అనిపించనప్పుడు చేయకపోవడమే మంచిది. శ్యామ్ సింగరాయ్ సినిమాలోని కొన్ని రొమాంటిక్ సీన్స్లో కూడా మనస్ఫూర్తిగా నటించలేకపోయాను. మనసుకు నచ్చనప్పుడు అలాంటివి చేయకుండా ఉండటమే బెటర్ అని అప్పుడే తెలుసుకున్నా. మున్ముందు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు సాగుతా. ఊ అంటావా పాట విషయానికి వస్తే.. సమంత ఒక ఫైర్.. ఆమె చాలా బాగా డ్యాన్స్ చేశారు' అని చెప్పుకొచ్చింది బేబమ్మ. చదవండి: షూటింగ్లో వీజే సన్నీకి గాయాలు, ఆస్పత్రికి తరలింపు! -
ఇది నా జీవితం.. నిర్ణయం కూడా నేనే తీసుకుంటా: నటి సిమ్రాన్
ఒకప్పుడు తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా వెలిగిపోయిన నటి సిమ్రాన్. తమిళంలో కమలహాసన్ నుంచి అజిత్, విజయ్ అంటూ స్టార్ హీరోలందరితోనూ జతకట్టింది. తెలుగులోనూ అగ్ర కథానాయకిగా రాణించింది. కాగా ఆమె కథానాయకిగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే కొన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటించి అలరించింది. తెలుగులో చిరంజీవి కథానాయకుడు నటించిన అన్నయ్య చిత్రంలో సౌందర్య కథానాయకిగా నటించగా సిమ్రాన్ ఓ సాంగ్లో నటించింది. ఆ పాట సూపర్ హిట్ అయ్యింది. అదేవిధంగా తమిళంలో విజయ్ హీరోగా నటించిన యూత్ చిత్రంలోనూ ఐటమ్ సాంగ్లో నర్తించింది. అప్పట్లో ఆమె ఆ పాటలో నటించడంపై పలు విమర్శలు వచ్చాయి. కాగా ఇన్నేళ్ల తర్వాత ఇటీవల తన అభిమానంతో ఇన్ స్ట్రాగామ్ లో ముచ్చటించినప్పుడు యూత్ చిత్రంలో ఐటమ్ సాంగ్లో నటించడంపై స్పందించింది. ఆమె పేర్కొంటూ ఇది తన జీవితమని, నిర్ణయం కూడా తానే తీసుకోవాలన్నారు. అప్పట్లో విజయ్ హీరోగా నటించిన యూత్ చిత్రంలో సింగిల్ సాంగ్ నటించవద్దని చాలామంది చెప్పారు అంది. అయితే అలాంటి వారి మాటలను లెక్కచేయకుండా తాను ఆ పాటలో నటించానని వెల్లడించింది. ఆ పాట సూపర్ హిట్ అయ్యిందని పేర్కొంది. కొందరు చెప్పినట్లుగా చిత్రంలో నటించకపోతే ఓ మంచి హిట్ చిత్రాన్ని కోల్పోయేదాన్ని అభిప్రాయపడింది. -
ఐటం సాంగ్కు రీల్స్ చేయండి, లక్ష పట్టండి.. ఎప్పటివరకు పాల్గొనవచ్చంటే?
ఈశ్వర్, నయన సర్వర్ జంటగా నటించిన చిత్రం "సూర్యాపేట్ జంక్షన్ ". అభిమన్య సింగ్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా పూజ ఐటమ్ సాంగ్లో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్, మ్యాచింగ్ మ్యాచింగ్ లిరికల్ సాంగ్ విడుదలవగా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో కాలేజ్ సాంగ్ను, ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకున్న "సూర్యా పెట్ జంక్షన్" మూవీనీ ఈ నెలాఖరులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రయూనిట్ మరిన్ని విశేషాలు వెల్లడిస్తూ.. 'ప్రమోషన్లో బాగంగా మ్యాచింగ్ మ్యాచింగ్ ఐటమ్ సాంగ్కు సోషల్ మీడియాలో ప్రకటించిన రీల్స్ పోటీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కాంటెస్ట్ విజేతలను త్వరలోనే ప్రకటించి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకరికి లక్ష రూపాయలు, మిగతా పది మందికి 10 వేల రూపాయల చొప్పున, అలాగే మరో పది మందికి 5 వేల రూపాయల చొప్పున అందివ్వనున్నాం. ఏప్రిల్ 25 వరకు ఈ పోటీలో పాల్గొనవచ్చు' అని ఈ చిత్ర యూనిట్ తెలిపింది. -
పుష్ప-2 ఆఫర్ తిరస్కరించిన సమంత.. క్లారిటీ ఇదే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో సమంత ఐటం సాంగ్ మరింత హైలెట్గా నిలిచింది. 'ఊ అంటావా మావ ఉఊ అంటావా మావా' అంటూ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. అయితే పుష్ప సినిమా సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. కాగా.. పుష్ప-2లోనూ సమంతతో ఓ ఐటం సాంగ్ ప్లాన్ చేశారని సమాచారం. దీనికోసం ఇటీవల సమంతను చిత్రబృందం సంప్రదించగా ఆమె ఆఫర్ తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. పుష్ప-2లో స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ సమంతను సంప్రదించలేదని ఆమె సన్నిహితులు తెలిపారు. కాగా.. సమంత ప్రస్తుతం సిటాడెల్, ఖుషి, శాకుంతలం చిత్రాల్లో కనిపించనున్నారు. ఇటీవలే సిటాడెల్ షెడ్యూల్ను సమంత ముంబైలో పూర్తి చేసుకుంద. గుణశేఖర్ దర్శకత్వంలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కిన శాకుంతలం ఏప్రిల్ 14, 2023న విడుదల కానుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఖుషీ చిత్రంలో నటించనున్నారు. -
SSMB 28: స్పెషల్ సాంగ్లో రష్మిక.. పారితోషికం అన్ని కోట్లా?
స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్ చేస్తే.. ఆ కిక్కే వేరేలా ఉంటుంది. సినిమాకు హైప్ తీసుకురావడానికి ఐటం సాంగ్ బాగా ఉపయోగపడుతుంది. అందుకే మన దర్శకనిర్మాతలు స్పెషల్ సాంగ్పై స్పెషల్ కేర్ తీసుకుంటారు. పెద్ద మొత్తంలో పారితోషికం చెల్లించి స్టార్ హీరోయిన్లను ఒప్పిస్తారు. ఇప్పటికే జనతా గ్యారేజ్ లో కాజల్, పుష్పలో సమంత, గనిలో తమన్నా,ఆచార్యలో రెజీనా స్పెషల్ సాంగ్స్ తో మెరుపులు మెరిపించారు. ఇప్పుడు నేషన్ క్రష్ రష్మిక వంతు వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్బాబు ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయనుందట. దీని కోసం రష్మిక భారీగా డిమాండ్ చేస్తోందట. స్పెషల్ సాంగ్లో స్టెప్పులేయాలంటే రూ.4 కోట్ల పారితోషికంగా ఇవ్వాలని రష్మిక అడిగిందట. రష్మిక రెమ్యునరేషన్ టాపిక్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రష్మిక హిందీలో రెండు సినిమాలతో పాటు తెలుగులో అల్లు అర్జున్ తో కలిసి 'పుష్ప' సీక్వెల్ 'పుష్ప 2'లోనూ, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న 'వారసుడు' మూవీలోనూ నటిస్తోంది. -
ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఏంటంటే..?
-
పుష్ప 2 లో తమన్నా ..!
-
గుడి ఆవరణలో ఐటెం సాంగ్.. కేసు నమోదు!
భోపాల్: గుడి ఆవరణలో ఐటెం సాంగ్కు డ్యాన్స్ చేసినందుకు ఓ యువతి చిక్కుల్లో పడింది. ఇన్స్టాగ్రామ్ రీల్ రూపంలో ఆ వీడియో వైరల్ కావడంతో దుమారం చెలరేగింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆ యువతిపై పోలీస్ కేసు నమోదు చేయాలని స్వయానా హోం మంత్రి ఆదేశించారు. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఓ దేవాలయం ఆవరణలో అభ్యంతకరంగా నృత్యం చేస్తూ.. సోషల్మీడియాలో వైరల్ చేసినందుకుగాను యువతిపై పోలీసు కేసు నమోదు చేయనున్నట్లు హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈరోజు తెలిపారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన నేహా మిశ్రాకు ఇన్స్టాగ్రామ్లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అక్టోబర్ 1వ తేదీన ఆలయం ప్రాంగణంలో దబాంగ్ చిత్రంలోని మున్నీ బద్నాం హుయి సాంగ్పై డ్యాన్స్ చేసి.. ఇన్స్టాలో అప్లోడ్ చేసింది. అయితే గుడి ఆవరణలోని మెట్ల మీద.. చినిగిన జీన్స్తో ఆమె చేసిన డ్యాన్సులపై బజరంగ్ దళ్ ఈ వీడియోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తన వీడియోపై విమర్శలు రావడంతో ఆమె క్షమాపణలు చెప్పింది. మతపరమైన మనోభావాలు దెబ్బ తీసినందుకు ఆ వీడియోను డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. View this post on Instagram A post shared by 💞𝄟★🦋⃟≛⃝mussu🦋★𝄟💞 (@muskanm125) ఆమె క్షమాపణలపై హోం మంత్రి సానుకూలంగా స్పందించలేదు. ఆమె వస్త్రధారణ, అలా వీడియో తీయడం అభ్యంతకరకంగా ఉన్నాయి. గతంలో ఇలాంటి జరిగినప్పుడు చర్యలు తీసుకున్నాం. అయినా ఆమె పట్టించుకోకుండా వీడియో తీసింది. అందుకే ఆమెపై కేసు నమోదు చేయబోతున్నాం అని మిశ్రా మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఛతర్పూర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్కు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించినట్లు హోం మంత్రి మిశ్రా తెలిపారు. छतरपुर में माता बम्बरबैनी मंदिर परिसर में आपत्तिजनक फिल्मांकन के खिलाफ एफआईआर दर्ज करने के निर्देश पुलिस अधीक्षक को दिए गए हैं। pic.twitter.com/X7euV9Z1qv — Dr Narottam Mishra (@drnarottammisra) October 4, 2022 -
పూజా హెగ్డె ఐటమ్ సాంగ్ షురూ.. ఇక మరింత ఫన్
Pooja Hegde F3 Movie Item Song Starts: ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. సుమారు స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడుతూ మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్గా మారింది ఈ బ్యూటీ. ఇటీవల 'అరబిక్ కుతు' సాంగ్లో విజయ్తో కలిసి అదరగొట్టింది. ఆ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా 'రంగస్థలం' సినిమాలో 'జిగేల్ రాణి'గా జిగేలుమనిపించింది. ఇదిలా ఉంటే తాజాగా వెంకటేష్, వరుణ్ తేజ్ల మల్టీస్టారర్ 'ఎఫ్ 3' సినిమాలో పూజా స్పెషల్ సాంగ్ చేయనుంది. ఈ పాట చిత్రీకరణను శుక్రవారం (ఏప్రిల్ 15) న ప్రారంభించారు. అన్నపూర్ణ స్టూడియోలో సుమారు 7 ఎకరాల్లో వేసిన అద్భుతమైన సెట్లో ఈ పార్టీ నెంబర్ను షూట్ చేయనున్నారు. శుక్రవారం నుంచి ఈ పాట చిత్రీకరణ మొదలైంది. ఈ సాంగ్లో పూజా హెగ్డేతోపాటు సినిమాలోని హీరోహీరోయిన్లు కూడా ఆడిపాడనున్నారట. ఒకే స్క్రీన్పై బుట్టబొమ్మ, వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీరన్ పిర్జాదా, సోనాల్ చౌహన్ కనిపించడం నిజంగా ఫన్గానే ఉండనుంది. ఈ పాటను రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శిరీష్ నిర్మిస్తున్నారు. 'ఎఫ్ 3' చిత్రం నవ్వులు పూయించడానికి మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: ఆ స్టార్ హీరోను 'ఆంటీ' అంటానంటున్న పూజా హెగ్డే Lets get this party started💃 The Ravishing beauty @hegdepooja joins #F3Movie to add spice to our SPECIAL PARTY SONG🎶#F3OnMay27@VenkyMama @IAmVarunTej@AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @ThisIsDSP @SVC_official @adityamusic @f3_movie pic.twitter.com/SNZRyJFbD1 — Sri Venkateswara Creations (@SVC_official) April 15, 2022 -
‘ఐటెం సాంగ్’ ఆరోపణలు.. మహిళా జడ్జికి భారీ ఊరట
హైకోర్టు న్యాయమూర్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఐటెం సాంగ్కు చిందులేయాని బలవంతం చేశారని ఆరోపించిన దిగువ స్థాయి కోర్టు న్యాయమూర్తికి ఊరట లభించింది. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటన ‘న్యాయవ్యవస్థలో ఐటెం సాంగ్ మరక’గా దేశవ్యాప్తంగా ప్రచారం అయ్యింది. అయితే ఈ ఉదంతంలో 2014లో రాజీనామా చేసిన ఆమెను.. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఈరోజు మధ్యప్రదేశ్ హైకోర్టుకు తెలిపింది. 2014లో సదరు మహిళా న్యాయమూర్తి బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందని, ఆ కారణంతో ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గురువారం ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. రాజీనామాను స్వచ్చంద విరమణ కింద పరిగణించకూడదంటూ కోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టుకు సూచించింది. అంతేకాదు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమోదించిన ఆమె రాజీనామాను కొట్టేస్తున్నట్లు జస్టిస్ గవాయ్ తెలిపారు. ఏం జరిగిందంటే.. జూలై 2014లో, అదనపు జిల్లా న్యాయమూర్తి అయిన ఆమె.. హైకోర్టు జడ్జి నుంచి తనకు జరిగిన వేధింపుల ఎదురవుతున్నాయని ఆరోపణలకు దిగింది. ఈ వేధింపులపై రాష్ట్రపతి, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖలు రాసింది. ఆ తర్వాత ఆమె గ్వాలియర్లోని అదనపు జిల్లా న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసేసింది. ఓ ఐటెం సాంగ్లో తనను డ్యాన్స్ చేయాలని హైకోర్టు జడ్జి తనను కోరినట్లు లేఖలో ఆరోపించిందామె. అంతేకాదు సుదూర ప్రదేశానికి తనను బదిలీ చేయడాన్ని న్యాయమూర్తి ప్రభావితం చేశారని ఆమె ఆరోపించింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో సదరు జడ్జికి సుప్రీం నోటీసులు కూడా జారీ అయ్యాయి. అంతేకాదు లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కోసం రాజ్యసభ తరపున ఒక ప్యానెల్ నియమించారు. ఈ ప్యానెల్ గత ఏడాది డిసెంబర్లో నివేదిక ఇస్తూ.. సదరు హైకోర్టు న్యాయమూర్తికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఫిర్యాది మహిళను వేధించడానికి న్యాయమూర్తి తన పదవిని దుర్వినియోగం చేశారనే అభియోగంలో ఎటువంటి ఆధారం లేదని ప్యానెల్ తెలిపింది. ఈ పరిణామాల తర్వాత.. ఆరోపణలు చేసిన మహిళ.. తనను తిరిగి విధుల్లోకి చేర్చుకోవడాన్ని పరిశీలించాలని ఆమె న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే హైకోర్టులో ఆమెకు చుక్క ఎదురు కాగా.. ఇప్పుడు సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. -
'ఊ అంటావా' బీట్కు 'బీటీఎస్' బ్యాండ్.. 'శ్రీవల్లి' పాటకు ప్రధాని స్టెప్పులు
BTS Band Dance To Samantha Song PM Modi Steps To Srivalli Song: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్ సమంత కలిసి అదరగొట్టిన సాంగ్ 'ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ అంటే ఒకరకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఆ స్పెషల్లో సమంత వంటి అగ్రకథానాయిక స్టెప్పులు వేయనుందని తెలిసినప్పటినుంచి బజ్ విపరీతంగా పెరిగింది. ఆ పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగానే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్, సమంత, అల్లు అర్జున్ స్టెప్పులు పాటను ఓ రేంజ్లో తీసుకెళ్లాయి. ఈ పాట యూట్యూబ్లో మిలియన్లలో వ్యూస్ సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. ఈ పాటకు వస్తున్న క్రేజ్ చూసి ఇదివరకే పలువురు కవర్ సాంగ్స్, రీల్స్ చేసి ఆకట్టుకున్నారు. నెటిజన్లు ఈ పాటపై ఎడిటింగ్ వీడియోలు క్రియేట్ చేసి అబ్బురపరుస్తున్నారు. తాజాగా ప్రముఖ కొరియన్ పాప్ సింగింగ్ బ్యాండ్ బీటీఎస్ చేసిన 'బాయ్ విత్ లవ్' వీడియోకు 'ఊ అంటావా మావ' పాటను జత చేసి ఓ నెటిజన్ ప్రత్యేక వీడియోను రూపొందించాడు. 'పుష్ప బీట్ను బీటీఎస్ ఫాలో కాలేదు. బీటే బీటీఎస్ను ఫాలో అయ్యింది. బీటీఎస్లో టీ అంటే టాలీవుడ్' అని రాసుకొచ్చాడు. ఈ వీడియోలో బీటీఎస్ టీమ్ అయిన ఆర్ఎం, జిన్, సుగా, జిమిన్, వి, జంగ్కూక్, జె. హోప్ వేసిన స్టెప్పులు తెలుగు పాట బీట్కు సరిగ్గా సరిపోయేలా ఉండటంతో ఈ క్రియేటెడ్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by qualiteaposts (@qualiteaposts) అలాగే పుష్పలోని మరొక సూపర్ డూపర్ హిట్ సాంగ్ శ్రీవల్లి. ఈ పాటకు ప్రధాని నరేంద్ర మోదీ స్టెప్పులేసినట్లుగా ఓ యానిమేటెడ్ వీడియోను మరొ నేటిజన్ క్రియేట్ చేశాడు. అలా క్రియేట్ చేసిన ఆ వీడియోను నెట్టింట్లో వదిలేయగా.. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. My favourite WhatsApp forward! The creators in our country don’t sleep 😂 Looking great Modiji! @narendramodi @alluarjun #Pushpa pic.twitter.com/QBkxX51b3a — Akshat Saraf (@AkshatSaraf) January 21, 2022 -
ఊ అంటావా మావా.. పాటకు ప్రగతి స్టెప్పులు
-
ఊ అంటావా మావ అంటూ జిమ్లో ప్రగతి స్టెప్పులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప: ద రైజ్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 17న థియేటర్లలో విడుదదలైంది. సినిమా రిలీజై నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. సినిమానే కాదు ఇందులోని పాటలు కూడా బ్లాక్బస్టర్ హిట్ అయ్యాయి. 'చూపే బంగారమాయెనా శ్రీవల్లీ..', 'సామీ నా సామీ..', 'ఏ బిడ్డా ఇది నా అడ్డా', 'దాక్కో దాక్కో మేక..', 'ఊ అంటావా మావా..ఉఊ అంటావా మావా..' పాటలు ఇప్పటికీ మార్మోగుతున్నాయి. సౌత్ నుంచి నార్త్ దాకా ఎక్కడ చూసినా ఇవే పాటలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు, టీమిండియా క్రికెటర్లు కూడా ఈ పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే నిత్యం జిమ్లో వర్కవుట్స్ చేస్తూ దానికి సంబంధించిన వీడియోలు షేర్ చేసే సీనియర్ నటి ప్రగతి తాజాగా 'ఊ అంటావా మావా..' సాంగ్కు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసింది. అది కూడా జిమ్లోనే స్టెప్పులేయడం విశేషం. ఈ వీడియోను ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా అది కాస్తా హల్చల్ అవుతోంది. -
సమంత స్పెషల్ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసిందిగా.. చూసేందుకు 'ఊ' అనడమే
Samantha Item Song Oo Antava Song Full Video Out: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత డ్యాన్స్ చేసిన 'ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ' సాంగ్కు ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ఈ ప్రత్యేక సాంగ్లో సమంత నటిస్తోందన్ని విషయం తెలిసినపపటి నుంచి ఈ పాటపై హైప్ విపరీతంగా పెరిగిపోయింది. యూట్యూబ్లో సాంగ్ రిలీజైన తర్వాత అదే రేంజ్లో దూసుకుపోయింది. చంద్రబోస్ రాసిన ఈ పాట విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్లో ట్రెండ్గా మారింది. సుమారు 90 మిలియన్ వ్యూస్ని సొంతం చేసుకున్న ఈ సాంగ్ 'టాప్ 100 మ్యూజిక్ వీడియోస్ గ్లోబల్' జాబితాలో అగ్రస్థానంలో నిలిచి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్లో అల్లు అర్జున్, సమంత స్టెప్పులు, వారి హావభావాలు ప్రేక్షకులు, అభిమానులను కట్టిపడేసేలా ఉన్నాయి. సమంత హీరోయిన్గా రాణిస్తునే స్పెషల్ సాంగ్లో నటించి తానేంటో నిరూపించుకుంది. ఈ సాంగ్లో చిందేసినందుకు సామ్ ఏకంగా రూ. 1.5 కోట్లు తీసుకుందని సమాచారం. అయితే ఈ సాంగ్ ఫుల్ వీడియో ఎప్పుడెప్పుడూ వస్తుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు శుక్రవారం (జనవరి 7) 'ఊ అంటావా' పూర్తి పాటను విడుదల చేసి ఆశ్చర్యపరిచారు మేకర్స్. అలాగే 'పుష్ప: ది రైజ్' సినిమా కూడా శుక్రవారం నుంచే ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఇదీ చదవండి: చిన్నారి నోట సమంత పాట.. సామ్, డీఎస్పీ రియాక్షన్ -
సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సమంత
-
పుష్పతో ప్యాన్ ఇండియాను షేక్ చేసిన సామ్
-
చిన్నారి నోట 'ఊ అంటావా' పాట..
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
Summer special థండయ్ కుల్పీ రెసిపీ
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
లండన్ కు చేరుకున్న సీఎం జగన్
వవన్ కల్యాణ్ అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్
తప్పక చదవండి
- ‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement