-
Delhi Chief Minister Arvind Kejriwal: భారత్లో ‘రష్యా’ పరిస్థితులు
అమృత్సర్: మోదీ సర్కార్ హయాంలో దేశపరిస్థితులు రష్యాను తలపిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. శుక్రవారం అమృత్సర్లో ఆప్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలతో సమావేశం సందర్భంగా కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘‘ భారత్లో కొనసాగుతున్న ఈ నియంతృత్వ పాలనకు ఇంక ఎంతమాత్రం ఆమోదించేదిలేదు. గత 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతావనిలో ఇలా పనిగట్టుకుని విపక్షనేతలను జైల్లో పడేయడం ఎన్నడూ చూడలేదు. రష్యాలో అయితే కీలక విపక్షనేతలందర్నీ జైలుకు పంపేసి, కొందర్ని చంపేసి పుతిన్ దేశాధ్యక్ష ఎన్నికలు జరిపి 87 శాతం ఓట్లు గుప్పిట బిగించారు. ఎన్నికల్లో విపక్షాలు లేకపోవడంతో ఓట్లు పొందడానికి నువ్వు ఒక్కడివే మిగులుతావు’’ అని మోదీనుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘‘ వాళ్లు(బీజేపీ) నన్ను, ఢిల్లీ మాజీ డెప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జైల్లో పడేశారు. కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేశారు. తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే మంత్రులను జైలుకు పంపారు. విపక్ష నేతలను చెరసాలలో వేశాక ఒకే పార్టీ, ఒక్కడే అగ్రనేత సాధ్యం. అప్పుడు ప్రజాస్వామ్యం అసాధ్యం. ఇది జరక్కుండా మనం ఆపాలి’’ అని అన్నారు. ‘ నేను జైలు గదిలో ఉన్నపుడు గదిలో రెండు సీసీటీవీ కెమెరాలతో 13 మంది అధికారులు అనుక్షణం గమనించేవారు. ఒక ఫుటేజీ నేరుగా ప్రధాని మోదీకి వెళ్లేది. అక్కడ రెండు టీవీల్లో గమనించేవారు. నన్ను ఎలాగైనా అణచేస్తామని విశ్వప్రయత్నం చేశారు. అరెస్ట్తో అంతా అయిపో తుందని, పార్టీ ముక్కలు చెక్కలై ప్రభుత్వం కూలు తుందని ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. ఆప్ ఒక కుటుంబం. కుటుంబానికి ఏదైనా కష్టమొస్తే కుటుంబసభ్యులంతా ఏకమై పోరాడతారు. నా అరెస్ట్ తర్వాత ప్రతి ఒక్క కార్యకర్త కేజ్రీవాల్గా మారి పోరాడారు’’ అని అన్నారు.నన్ను నిరుత్సాహపరచకండి‘‘ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి జైలులో ఎవరినైనా కలవడానికి వస్తే గదిలో మాట్లాడే ఏర్పాటుచేయాలని జైలు నియమావళిలో ఉంది. పంజాబ్ సీఎం భగవంత్మాన్ వచ్చినపుడు ఒక గదిలో జైలు సూపరింటెండెంట్ భేటీ ఏర్పాట్లుచేయలేదు. పంజాబ్లో మొత్తం 13 లోక్సభ స్తానాలను గెల్చుకునేలా ఆప్ నేతలు కష్టపడాలి. జూన్ రెండో తేదీన జైలుకెళ్తా. జూన్ 4 నాటి ఫలితాలను అక్కడి టీవీలో చూస్తా. టీవీలో ‘పంజాబ్లో అన్ని సీట్లు ఆప్ గెలిచింది’ అనే వార్త కోసం ఎదురుచూస్తుంటా. నన్ను నిరుత్సాహ పరచకండి’’ అని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. -
Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
లోక్సభ ఎన్నికల ఆరో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థులందర్లో బీజేపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త నవీన్ జిందాల్ అత్యధిక ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ చైర్మన్ అయిన నవీన్ హరియాణాలోని కురుక్షేత్ర నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. తనకు రూ.1,241 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్లో వెల్లడించారు. మొత్తం 866 మంది అభ్యర్థుల్లో 39 శాతం మంది కోటీశ్వరులే. వీరికి సగటున రూ.6.21 కోట్ల ఆస్తి ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ ప్రకటించింది. ఆశ్చర్యకరంగా కురుక్షేత్రలో జిందాల్పై ఆప్ కూడా సంపన్న నేతనే పోటీకి దించింది. ఆ పార్టీ అభ్యర్థి సుశీల్కుమార్ గుప్తా రూ.169 కోట్ల ఆస్తులతో టాప్–3లో ఉన్నారు. ఒడిశాలో కటక్ బీజేడీ అభ్యర్థి సంతృప్త్ మిశ్రా రూ.482 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తనవద్ద కేవలం రెండు రూపాయలే ఉన్నట్టు రోహ్తక్ లోక్సభ స్థానంలో స్వతంత్రుడిగా పోటీ చేస్తున్న రణ«దీర్ సింగ్ పేర్కొన్నారు! 180 మందిపై క్రిమినల్ కేసులు ఆరో విడతలో 180 మంది (21 శాతం) అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఏడీఆర్ వెల్లడించింది. వీరిలో 141 మందిపై సీరియస్ కేసులున్నాయి. 12 మంది తమను దోషులుగా కోర్టు ప్రకటించినట్టు పేర్కొనగా, పలువురు హత్య కేసుల్లోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు. 21 మందిపై హత్యాయత్నం కేసులున్నాయి. 24 మంది మహిళలకు సంబంధించిన కేసుల్లో నిందితులు. ముగ్గురిపై అత్యాచారం కేసులున్నాయి. ఆప్ తరఫున పోటీలో ఉన్న ఐదుగురు, ఆర్జేడీ అభ్యర్థులు నలుగురూ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఎస్పీ అభ్యర్థుల్లో 75 శాతం, బీజేపీ అభ్యర్థుల్లో 55 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఆర్జేడీకి చెందిన నలుగురూ, ఆప్నకు చెందిన నలుగురు (80 శాతం), ఎస్పీ నుంచి 12 మంది (75 శాతం) బీజేడీ నుంచి 18 మంది (35 శాతం)పై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Odisha Assembly Elections 2024: బీజేపీకి సవాల్
ఒడిశాలో రెండో విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో 21 లోక్సభ స్థానాలుండగా నాలుగింటికి 13న పోలింగ్ ముగిసింది. ఈ నెల 20న రెండో విడతలో ఐదు లోక్సభ స్థానాలు, వాటి పరిధిలోని 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఐదు లోక్సభ స్థానాల్లో మూడు బీజేపీ సిట్టింగ్ సీట్లే కావడం విశేషం. ఆ పారీ్టకి గట్టి మద్దతున్న ఈ స్థానాల్లో అధికార బీజేడీ నుంచి సవాలు ఎదురవుతోంది... బోలంగీర్ రాష్ట్రమంతటా ఆసక్తి నెలకొన్న స్థానమిది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, రాజ వంశీకురాలు సంగీతా సింగ్దేవ్ బరిలో ఉన్నారు. బీజేడీ గత అభ్యర్థి కల్కేశ్ నారాయణ్ సింగ్దేవ్ స్థానంలో సురేంద్ర సింగ్ భోయ్ని పోటీకి దింపింది. కాంగ్రెస్ నుంచి మనోజ్ మిశ్రా పోటీలో ఉన్నారు. ఇక్కడ సంగీత నాలుగుసార్లు గెలిచారు. ఆమె భర్త కనకవర్ధన్ సింగ్దేవ్ పాటా్నగఢ్–బోలంగీర్ మహరాజు రాజ్రాజ్ సింగ్దేవ్ కుమారుడు. ఒడిశా బీజేపీ చీఫ్గా, రాష్ట్ర మంత్రిగా కూడా చేశారు. కరువు బాధిత జిల్లా అయిన బోలంగీర్ నుంచి ఏటా 30 వేల మందికి పైగా ఉపాధి కోసం వలస పోతున్నారు. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో నాలుగు బీజేడీ చేతిలో ఉన్నాయి. కాంగ్రెస్ రెండు చోట్ల, బీజేపీ ఒక్క స్థానంలో గెలిచాయి.సుందర్గఢ్ ఒడిశాలో కీలక లోక్సభ స్థానాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ బీజేపీదే హవా. గత రెండు ఎన్నికల్లో గెలిచిన బీజేపీ సిట్టింగ్ ఎంపీ జుయల్ ఓరం మళ్లీ బరిలో ఉన్నారు. 1998 నుంచి ఇక్కడ ఆయన ఐదుసార్లు గెలవడం విశేషం. 2009 ఎన్నికల్లో మాత్రం ఓరంపై కాంగ్రెస్ నేత హేమానంద బిశ్వాస్ విజయం సాధించారు. అధికార బీజేడీ ఇక్కడ ఖాతాయే తెరవలేదు! రాష్ట్రంలో ఆ పార్టీ ఇప్పటిదాకా నెగ్గని ఏకైక స్థానమిది. గత మూడుసార్లుగా అభ్యర్థులను మారుస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఈసారి భారత హాకీ జట్టు మాజీ కెపె్టన్ దిలీప్ టిర్కీని బీజేడీ మరోసారి బరిలో దింపింది. 2014లో ఆయన 18 వేల ఓట్ల తేడాతో ఓడారు. ఈ గిరిజన ప్రాబల్య నియోజకవర్గంలో బీజేపీని ఓడించడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ స్థాయి హాకీ స్టేడియం ఏర్పాటు, టిర్కీ ఆదరణ కలిసొచ్చి ఈసారి గట్టెక్కుతామని బీజేడీ భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ దెహూరీ పోటీ చేస్తున్నారు. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో మూడు బీజేపీ చేతిలో ఉన్నాయి. రెండింట బీజేడీ, కాంగ్రెస్, సీపీఎం చెరో చోట గెలిచాయి.కందమాల్ ఈ స్థానం బీజేడీ కంచుకోట. కందమాల్, బౌద్ జిల్లాలు మొత్తం దీని పరిధిలోకే వస్తాయి. బీజేడీ నుంచి సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ విద్యావేత్త అచ్యుతానంద సామంత బరిలో ఉన్నారు. బీజేపీ ప్రతిసారీ కొత్త అభ్యరి్థని నిలుపుతున్నా నిరాశే ఎదురవుతోంది. ఈసారి సుకాంత కుమార్ పాణిగ్రాహికి టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి అమీర్చంద్ నాయక్ పోటీలో ఉన్నా పోటీ బీజేపీ, బీజేడీ మధ్యే ఉంది. సామంతకు విద్యా, దాతృత్వ కార్యక్రమాలు గట్టి దన్ను. కాగా తాగు, సాగునీటి సమస్య, రోడ్ల దుస్థితి తదితర అంశాలను పాణిగ్రాహి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆయనకు మద్దతుగా ప్రధాని మోదీ ఇప్పటికే ప్రచారం చేశారు.బార్గఢ్ 2008 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన ఈ స్థానంలో విజయం పారీ్టల చేతులు మారుతూ వస్తోంది. 2009లో కాంగ్రెస్ నేత సంయజ్ భోయ్ గెలవగా, 2014లో బీజేడీకి చెందిన డాక్టర్ ప్రవాస్ కుమార్ సింగ్ విజయం సాధించారు. 2019లో బీజేపీని విజయం వరించింది. బీజేడీ సీనియర్ నేత ప్రసన్న ఆచార్యను బీజేపీ నేత సురేశ్ పూజారి ఓడించారు. ఈసారి ఆయనకు బదులు ప్రదీప్ పురోహిత్కు బీజేపీ టికెటిచి్చంది. పూజారిని అసెంబ్లీ ఎన్నికల్లో మోహరించింది. బీజేడీ కూడా పరిణీత మిశ్రాకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి సంజయ్ భోయ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేడీ ప్రభుత్వ వైఫల్యాలపై బలంగా గళం వినిపించే ప్రదీప్కు స్థానికంగా మంచి పేరుంది. మోదీ సర్కారు సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఓటర్లకు దగ్గరవుతున్నారు.అస్కా బీజేడీకి కంచుకోట. సీఎం నవీన్ పటా్నయక్కు ప్రతిష్టాత్మక లోక్సభ స్థానం. ఆయన పోటీ చేస్తున్న హింజిలి అసెంబ్లీ స్థానం దీని పరిధిలోనే ఉంది. తండ్రి బిజూ పటా్నయక్ మరణానంతరం 1997 లోక్సభ ఉప ఎన్నికల్లో అస్కా నుంచే నవీన్ లోక్సభకు ఎన్నికయ్యారు. 1998, 1999 ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించారు. వాజ్పేయి ప్రభుత్వంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా చేశారు. ఇక్కడ ఏ అభ్యర్థినీ రెండోసారి నవీన్ కొనసాగించకపోవడం గమనార్హం. బీజేడీ నుంచి 2019లో ప్రమీలా బిసోయ్ గెలిచారు. ఈసారి ఆమెను కాదని 33 ఏళ్ల రంజితా సాహుకు బీజేడీ టికెట్ దక్కింది. ఆమె వలస కారి్మకుల కోసం ‘కొడాల యూత్ ఫోరం’ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. సామాన్యుల్లో ఆమెకున్న గుర్తింపు చూసే సీఎం టికెటిచ్చారు. బీజేపీ నుంచి మరోసారి అనితా శుభదర్శిని పోటీ చేస్తున్నారు. ఆమె తండ్రి రామకృష్ణ పటా్నయక్ మాజీ మంత్రి. బిజూ, నవీన్ పట్నాయక్లకు అత్యంత సన్నిహితుడు. గంజాం జిల్లాలో ఆయనకు మంచి పేరుంది.ముగ్గురిలో ఒకరిపై కేసు ఒడిశాలో రెండో విడతలో పోలింగ్ జరిగే ఐదు లోక్సభ స్థానాల్లో 40 మంది పోటీలో ఉన్నారు. వీరిలో 13 మంది కోటీశ్వరులే. సంగీతా కుమారి రూ.67.3 కోట్లతో జాబితాలో టాప్లో ఉన్నారు. 12 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులున్నట్టు పేర్కొన్నారు. వీరిలో 8 మంది తీవ్ర నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 21 మంది గ్రాడ్యుయేషన్, అంతకంటే ఉన్నత విద్యావంతులని ఏడీఆర్ సంస్థ ప్రకటించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
స్వాతి మలివాల్పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్పై దాడిపై ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు చేస్తోంది. స్వాతి మలివాల్ ఆరోపణల్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి అతిషి కొట్టి పారేశారు. ఆమె చేస్తోన్న ఆరోపణలు బీజేపీ కుట్రలో భాగమేనని ఆరోపించారు. మే 13న ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ అపాయింట్మెంట్ లేకుండా సీఎం కేజ్రీవాల్ నివాసంలోకి ప్రవేశించారు. కేజ్రీవాల్ అందుబాటులో లేరు. అపాయింట్ లేకపోవడంపై సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ ఆమెను అడ్డుకున్నారు. డ్రాయింగ్ రూమ్లో వాదించడం ప్రారంభించింది’ అని అతిషి విలేకరుల సమావేశంలో తెలిపారు.‘అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ రావడం బీజేపీని ఉలిక్కిపడేలా చేసింది. కాబట్టే బీజేపీ ఓ కుట్ర పన్నింది. అందులో భాగంగా స్వాతి మలివాల్ను పావుగా వినియోగించుకుంది. మే 13 ఉదయం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి పంపింది. అక్కడే ఆమె కథంతా నెరిపింది. తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఈరోజు వెలుగులోకి వచ్చిన వీడియోలో ఆమె డ్రాయింగ్ రూమ్లో కూర్చొని పోలీసు అధికారులను బెదిరించడం కనిపించింది. తనపై క్రూరంగా దాడి చేశారిన స్వాతి ఆరోపణలకు.. వీడియోలో కస్తున్న కనిపిస్తున్న దృశ్యాలు పూర్తి విభిన్నంగా ఉన్నాయిఆ వీడియోలో స్వాతి మలివాల్ కనిపించారు. కొట్టినట్లు వీడియో తీస్తున్నదెవరు..ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తేనే అందరికీ నిజం తెలుస్తుంది. ఆ దేవుడు అంతా చూస్తున్నాడు. ఏదో ఒకరోజు ఆ నిజం ప్రపంచానికి తెలుస్తోంది’ అని అతిషి అన్నారు.కాగా, స్వాతి మలివాల్పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అతిషి తెలిపారు. -
ఓటమి భయం
-
ఏపీ బీజేపీని వెంటాడుతున్న ఓటమి భయం..
-
రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
లక్నో: ఈ లోక్సభ ఎన్నికల్లో 400పైగా సీట్లు సాధించి రిజర్వేషన్లు తీసేయాలని బీజేపీ చూస్తోందని ఆప్ అగ్ర నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే హోమంత్రి అమిత్ షా ప్రధాని అవుతారని, యోగి ఆదిత్యనాథ్ను యూపీ సీఎం పదవి నుంచి తొలగిస్తారని పునరుద్ఘాటించారు. ‘అధికారంలోకి వస్తే భారీ కార్యక్రమం ఒకటుంటుందని బీజేపీ చెబుతోంది. రిజర్వేషన్లను తొలగించడమే ఆ కార్యక్రమం. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఎల్లప్పుడూ వ్యతిరేకమే. మళ్లీ ఆ పార్టీకే అధికార పగ్గాలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు ముగింపు పలుకుతుంది’అని ఆయన అన్నారు. గురువారం కేజ్రీవాల్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీలో 75 ఏళ్లు దాటిన ఏ నేతకు కూడా ప్రభుత్వంతోపాటు పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వబోమని, అటువంటి వారు రిటైర్ కావాల్సిందేనంటూ ప్రధాని మోదీ నిబంధన తెచ్చారు. ఈ ప్రకారమే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలు కొందరు రిటైరయ్యారు. మరికొందరిని తొలగించడమో, ఎన్నికల్లో టికెట్ నిరాకరించమో జరిగింది. మోదీ ఈ నిబంధన అమలుకు కృషి చేస్తున్నారు’అని కేజ్రీవాల్ ఆరోపించారు. తనకు అడ్డుగా ఉంటారనుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజె, రమణ్ సింగ్, దేవేంద్ర ఫడ్నవీస్, మనోహర్లాల్ ఖట్టర్ వంటి వారి కథను మోదీ ముగింపునకు తెచ్చారని విమర్శించారు. ‘అమిత్ షాకు ఆదిత్యనాథ్ అడ్డుగా ఉన్నారు. బీజేపీయే మళ్లీ అధికారంలోకి వస్తే రెండు నెలల్లోనే యూపీ సీఎం ఆదిత్యనాథ్ను సైతం పక్కన బెట్టడం ఖాయం’అని కేజ్రీవాల్ అన్నారు. చీపురుకు ఓటేస్తే..జైలుకెళ్లాల్సిన పనుండదు అమృత్సర్: తాను మళ్లీ జైలుకు వెళ్లరాదని భావిస్తే ఆప్కే ఓటేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రజలను కోరారు. గురువారం ఆయన పంజాబ్లోని అమృత్సర్లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ‘నేను జైలుకు వెళ్లాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది. చీపురు గుర్తు బటన్ను మీరు నొక్కితే నేను మళ్లీ జైలుకెళ్లాల్సిన అవసరం ఉండదు. కేజ్రీవాల్కు స్వేచ్ఛా లేక జైలా అనే విషయం ఆలోచించి మీరు బటన్ నొక్కండి. చీపురు గుర్తుపై నొక్కితే దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించినట్లేనని గుర్తుంచుకోండి’అని ఆయన అన్నారు. -
టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
-
అమేథీలో గెలుపెవరిది..?
-
Amit Shah: కేజ్రీవాల్కు స్పెషల్ ట్రీట్మెంట్ !
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ సాధారణ ‘ప్రక్రియ’లాగా లేదని బీజేపీ అగ్రనేత అమిత్ షా వ్యాఖ్యానించారు. బుధవారం ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్ షా పలు అంశాలపై మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..జడ్జీలు ఇది గమనించాలి‘‘కేజ్రీవాల్కు ఎన్నికల సందర్భంగా బెయిల్ రావడం చూస్తుంటే సుప్రీంకోర్టు ఆయన విషయంలో స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. ఈ మాట నేను అనట్లేదు. దేశవ్యాప్తంగా చాలా మంది ఇలాగే భావిస్తున్నారు. విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే తాను మళ్లీ జైలు కెళ్లాల్సిన అవసరం రాదని బెయిల్ తర్వాత కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు పూర్తిగా కోర్టు ధిక్కారమే. ఎవరైనా ఎన్నికల్లో గెలిస్తే వాళ్లను సుప్రీంకోర్టు జైలుకు పంపదని ఆయన మాటల్లోని అసలు అర్థం. ఆయన మాటలు విన్నాక అయినా ఆయనకు బెయిల్ ఇచ్చిన జడ్జీలు.. కేజ్రీవాల్ బెయిల్ను ఎలా వాడుకుంటున్నారు, ఎంతగా దుర్వినియోగం చేస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి’’ అని షా విజ్ఞప్తిచేశారు.బెయిల్ తీర్పుపై..‘‘చట్టాన్ని ఏ కేసుల్లో ఎలా ఆపాదించాలో సర్వోన్నత న్యాయస్థానానికి బాగా తెలుసు. అయితే ఈ ఒక్క కేజ్రీవాల్ బెయిల్ విషయంలో మాత్రం కోర్టు ఇచ్చిన తీర్పు మిగతా తీర్పుల్లా సాధారణంగా అనిపించట్లేదు. దేశ జనాభాలో చాలా మంది మససుల్లో ఇలాంటి భావనే నెలకొంది. తిహార్ జైలు అమర్చిన కెమెరాల సీసీటీవీ ఫుటేజీ నేరుగా ప్రధాని మోదీకి వెళ్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. అది పూర్తిగా అబద్దం. ఎందుకంటే తిహార్ జైలు కేంద్రం అధీనంలో ఉండదు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుంది అని వివరించారు.ప్రధానిగా మోదీ రిటైర్మెంట్పై‘‘వచ్చే ఏడాదికి మోదీకి 75 ఏళ్లు వస్తాయి. 75కి చేరినందుకు బీజేపీ నియమావళి ప్రకారం మోదీని పక్కనబెట్టి అమిత్షాను ప్రధాని చేయాలని చూస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. అదంతా అబద్ధం. ఇప్పుడు, ఎప్పుడూ మోదీయే మా ప్రధాని అభ్యర్థి. మేం గెలిచాక 2029 ఏడాదిదాకా మోదీయే ప్రధానిగా కొనసాగుతారు. ఆయన సారథ్యం, మార్గదర్శకత్వంలోనే 2029 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తాం’’ అని అమిత్ అన్నారు. -
Lok Sabha Election 2024: మథువాల మద్దతెవరికో!
బన్గావ్. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దులోని లోక్సభ స్థానం. ఈ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో మథువాల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ పారీ్టల గెలుపోటములను నిర్ణయించేది వాళ్లే. దాంతో బీజేపీ, తృణమూల్ రెండూ మథువా సామాజిక వర్గానికి చెందిన వారినే బరిలోకి దించాయి. గత ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందిన శంతను కుమార్ బీజేపీ నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బిశ్వజిత్ దాస్ రంగంలో ఉన్నారు...బన్గావ్ లోక్సభ స్థానం 2009లో ఏర్పడింది. స్వాతంత్య్రానంతరం, 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో హిందూ శరణార్థులు భారీగా బన్గావ్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. వీరిలో అత్యధికులు మథువాలే. బన్గావ్ ఓటర్లలో 67 శాతం దాకా వాళ్లే ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నేపథ్యంలో వీరు సహజంగానే బీజేపీకి మద్దతిస్తున్నారు. బన్గావ్ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ బన్గావ్ నుంచి బెంగాల్ ప్రచారాన్ని ప్రారంభించారు. మథువా సామాజికవర్గానికి పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో వారి ఓట్లు అత్యధికంగా బీజేపీకే పడ్డాయి. అలా ఇక్కడ తొలిసారి బీజేపీ విజయం సాధించింది. శంతను లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా బన్గావ్లో సీఏఏ ప్రధాన ఎన్నికల అంశంగా మారింది. సీఏఏ చట్టాన్ని అమల్లోకి తెస్తూ ఎన్నికల ముందు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. అయితే ఆన్లైన్ దరఖాస్తుల్లో బంగ్లాదేశ్లో ఉన్నప్పటి చిరునామా, నివాస పత్రాల వివరాలను చాలామంది సమర్పించలేదు. ఇది సమస్యలకు దారి తీయడంపై ఇక్కడి మథువాలు అసంతృప్తితో ఉన్నారు. తప్పుదారి పట్టిస్తున్నారు: టీఎంసీ సీఏఏను తృణమూల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది మథువా వర్గాన్ని తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రగా అభివరి్ణస్తోంది. మథువాలు ఇప్పటికే భారతీయులని, వారికి ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు ఉన్నాయని తృణమూల్ అధినేత్రి మమత అంటున్నారు. ‘‘ఈ దేశ పౌరులు కాకుంటే ఇన్నేళ్లు వారు ఓటెలా వేశారు? ప్రజాప్రతినిధులుగా పార్లమెంటుకు, బెంగాల్ అసెంబ్లీకి ఎలా వెళ్లారు?’’ అని ప్రశి్నస్తున్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బన్గావ్లో ఘోర పరాజయం తర్వాత గతేడాది పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ దుమ్ము రేపింది. బోరో కుటుంబానిదే ఆధిపత్యం... బన్గావ్ రాజకీయాలను బోరో మా (బీనాపాణి దేవి) కుటుంబమే శాసిస్తోంది. 1947లో బీనాపాణి దేవి, ఆమె భర్త ప్రమథ్ రంజన్ ఠాకూర్ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి దక్షిణ కోల్కతాలోని బల్లిగంజ్లో స్థిరపడ్డారు. ప్రమథ్ నామశూద్ర (ఎస్సీ) కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు. మథువాల హక్కుల కోసం పోరాడారు. తమలా వలస వచి్చన వారికి ఆశ్రయం కోసం స్థానిక ఠాకూర్నగర్లో భూమి కొనుగోలు చేశారు. ‘ఠాకూర్బరీ ల్యాండ్ అండ్ ఇండస్ట్రీస్’ పేరుతో కొన్న ఆ స్థలంలో శరణార్థుల కోసం తొలి ప్రైవేట్ కాలనీ నిర్మించారు. ప్రమథ్ 1962లో కాంగ్రెస్ అభ్యరి్థగా హన్స్ఖాలీ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. కుమారుడు కపిల్ కృష్ణ ఠాకూర్ 2014లో ఎంపీ అయ్యారు. ఆయన మరణానంతరం భార్య మమత 2015 ఉప ఎన్నికలో గెలిచారు. చిన్న కుమారుడు మంజుల్ కృష్ణ ఠాకూర్ టీఎంసీ ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థి శంతను ఆయన రెండో కుమారుడే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను ఉద్దేశిస్తూ.. ప్రజలు బీజేపీకి ఓటు వేస్తే తాను తిరిగి జైలుకు వెళ్లాల్సి వస్తుందని, అందుకే ఇండియా కూటమి అభ్యర్ధులను ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు. ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఆప్, కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ చాందినీ చౌక్ లోక్సభ అభ్యర్థి జేపీ అగర్వాల్కు మద్దతుగా మోడల్ టౌన్లో కేజ్రీవాల్ రోడ్షో నిర్వహించారు.నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానుఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నేను మీ మధ్య ఉండటానికి జైలు నుండి నేరుగా వచ్చాను. ఈ వ్యక్తులు (బీజేపీ) నన్ను కటకటాల వెనక్కి నెట్టారు. నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారని నాకు బాగా తెలుసు. నేను చిన్న వ్యక్తిని. మాది ఢిల్లీ, పంజాబ్లలో ప్రభుత్వాలున్న చిన్న పార్టీ అని కేజ్రీవాల్ అన్నారు.ఇంతకీ నేను చేసిన తప్పు ఏమిటి? నన్ను ఎందుకు జైలులో పెట్టారని నేను ఆలోచిస్తున్నాను. ఇంతకీ నేను చేసిన తప్పు ఏమిటి? అని తనని తాను ప్రశ్నించుకున్నారు. పిల్లలకు మంచి విద్యను అందించడం, వారికి మంచి పాఠశాలలు నిర్మించడం, మొహల్లా క్లినిక్లు ప్రారంభించడం, ప్రజలకు ఉచితంగా మందులు అందేలా చేయడం నేను చేసిన తప్పా అని అన్నారు. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు. నేను జైలుకు వెళ్లాలా వద్దా అన్నది మీ చేతుల్లోనే ఉంది. మీరు కమలం (బీజేపీ గుర్తు) ఎంచుకుంటే నేను మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఇండియా కూటమి అభ్యర్థిని ఎంచుకుంటే.. నేను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఓటు వేసేముందు ఆలోచించండిఓటు వేయడానికి వెళ్లినప్పుడు కేజ్రీవాల్ జైలుకు వెళ్లాలా అని మీరు ఆలోచించాలి అని ఆయన అన్నారు. నేను జైలులో ఉన్నప్పుడు తనను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని కానీ హనుమంతుడి ఆశీర్వాదం వల్ల నేను బలంగా ఉన్నాను అని ఆరోపించారు. -
పోలింగ్పై పోస్టుమార్టం..
-
10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి తక్కువలో తక్కువ పది సీట్లు గెలుస్తామని, ఓటర్ల నుంచి అంచనాలకు మించి స్పందన వ్యక్తమైనందున 12 స్థానాల్లో గెలిచినా ఆశ్చర్యం లేదనే ధీమా రాష్ట్ర బీజేపీలో వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాని మోదీ ‘వేవ్’ స్పష్టంగా కనిపించిందని ముఖ్యనేతలు అభిప్రాయపడ్డారు. నాలుగు సిట్టింగ్ ఎంపీ సీట్లతోపాటు విజయావ కాశాలు అంతగా లేదని మొదట్లో భావించిన సీట్లలోనూ బీజేపీ సత్తా చాటుతుందని పేర్కొ న్నారు.నాగర్కర్నూల్, వరంగల్, పెద్దపల్లి వంటి సీట్లు కూడా వస్తాయని, ఎన్నడూ ఊహించనంత స్థాయిలో ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. పోలింగ్ సందర్భంగా ప్రజలు బీజేపీని, మోదీని చూశారని, అభ్యర్థులు ఎవరనేది కూడా చూడలేదన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అధ్యక్షతన ముఖ్యనేతలతో నిర్వహించిన సమా వేశంలో ఓటింగ్ సరళిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాలు, నియోజకవర్గాల్లోని పరిస్థితులను నాయకులు వివరించారు. ఈ భేటీలో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ తివారీ (సంస్థాగత), బంగారు శ్రుతి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలపై చర్చపార్టీ కార్యాలయంలో నల్లగొండ–వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 27న జరగనున్న ఉపఎన్నికపై సన్నాహక సమావే శం జరిగింది. పోలింగ్కు సమయం తక్కువగా ఉన్నందున ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇన్చార్జీలను నియమించుకుని, అన్ని మండలాల్లో పార్టీ నాయకులు పర్యటించేలా కార్యాచరణను సి ద్ధం చేశారు. ఈ ఎన్నిక కోసం ఎన్.రామచంద్రరా వును ఇన్చార్జీగా నియమించారు. పార్టీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్రెడ్డి బరిలో ఉన్న ఈ ఎన్నికకు సంబంధించిన కసరత్తు అంతా ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంగా నిర్వహించాలని నిర్ణయించారు. -
ఎవరి లెక్క వారిదే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠ రేపుతూనే ఉంది. ప్రధాన రాజకీయ పారీ్టలన్నీ ఎవరి అంచనాలు వారు వేసుకుంటుండటం, అన్ని పార్టీలూ తమకే ఎక్కువ సీట్లు వస్తాయని గట్టిగా వాదిస్తుండటంతో.. ఆసక్తి మరింత పెరుగుతోంది. సోమవారం జరిగిన పోలింగ్ సరళిని విశ్లేíÙంచుకున్నాక కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు తమ అంచనాలను ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. పైగా మరిన్ని స్థానాలు అదనంగా గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టు ప్రకటనలు చేస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి పెరిగిన పోలింగ్ శాతాన్ని ఎవరికి వారే తమకు అనుకూలమని అంచనా వేసుకుంటుండటం గమనార్హం. అయితే అన్ని పారీ్టలు మహిళలు, గ్రామీణ, పట్టణ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారో అన్నది తేల్చుకునేందుకు ప్రయతి్నస్తున్నాయి. పెరిగినది పాజిటివ్ ఓటింగేనంటున్న కాంగ్రెస్.. ఐదు నెలల కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పాజిటివ్ ఓటింగ్ జరిగిందని.. ప్రస్తుతం పెరిగిన ఓటింగ్ శాతం కూడా ప్రభుత్వ అనుకూల ఓటేనని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామని అంటున్నాయి. ప్రధానంగా మహిళలకు ఉపయోగపడే ఉచిత బస్సు, రూ.500కే సిలిండర్లుతోపాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంపు, ఎన్నికలకు ముందే రైతుభరోసా నిధులు వెళ్లడం, రైతు రుణమాఫీపై సీఎం రేవంత్రెడ్డి ఒట్టు వేసి మరీ ప్రకటించడం వంటివి పాజిటివ్ టాక్ తెచ్చాయని.. అవి ఓట్ల రూపంలో కాంగ్రెస్కే దక్కాయని నేతలు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే.. లోక్సభ ఎన్నికల్లో తమకు ఓటింగ్ శాతం పెరుగుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీనిచి్చన బీఆర్ఎస్.. లోక్సభ ఎన్నికల్లో పోటీలో లేకుండా పోయిందని చెప్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్న ప్రచారం బాగానే ప్రభావం చూపిందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కు పన్నెండు నుంచి 13 సీట్లు లభిస్తాయని పేర్కొంటున్నారు. బాగా బలోపేతం అయ్యామంటున్న బీజేపీ.. లోక్సభ ఎన్నికలతో రాష్ట్రంలో మరింతగా బలోపేతం అయ్యామని, ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగామని బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రధాని మోదీపై అభిమానం, కేంద్రం గత పదేళ్లుగా అందించిన నీతివంతమైన పాలనకు తగిన ప్రతిఫలం తమకు లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఎంతగా ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని అంటున్నారు.పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న తాము రాజ్యాంగం జోలికి కానీ, రిజర్వేషన్ల జోలికి కాని వెళ్లని విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని వివరిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో మోదీ మేనియా బాగా వర్కౌట్ అయిందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ, అమిత్ షా సహా జాతీయ నాయకులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొనడం.. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయడం కలసి వచి్చందని అంటున్నారు. ఈసారి రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు ఖాయమని ధీమాగా చెప్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్కు బీజేపీకి అనుకూలంగా ఉందని.. అసెంబ్లీ ఎన్నికల్లోకు ఓటేయని వర్గాలు కూడా లోక్సభ ఎన్నికల్లో ముందుకు వచ్చి తమకు ఓటు వేశాయని అంటున్నారు. కేసీఆర్ బస్సుయాత్ర ఊపుతో.. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తమకు లాభిస్తుందని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల్లో విశేష స్పందన లభించిందని ఆ పార్టీ ముఖ్యులు చెప్తున్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు, సాగునీటి ఇబ్బందులు, జిల్లాల రద్దు వంటి అంశాలతోపాటు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యం ఆ పార్టీపై వ్యతిరేకతను పెంచిందని అంటున్నారు.ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే బాగుండేదన్న అభిప్రాయానికి వచ్చారని, ఇది తమకు సానుకూలంగా మారిందని అంటున్నారు. రెండు జాతీయ పార్టీలకు నేరుగా తమతోనే పోటీ జరిగిందని చెప్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానం ఎక్కడికీ పోలేదని, కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టించామని పేర్కొంటున్నారు. ఆ రెండు పారీ్టలు పారాచూట్ లీడర్లకే ఎక్కువ టికెట్లు ఇవ్వడం కూడా.. కార్యకర్తలు, నేతల్లో అసంతృప్తిని రగిలించిందని అంటున్నారు. -
ప్రధాని నామినేషన్
వారణాసి: ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరం వారణాసి నుంచి ప్రధాని మోదీ మంగళవారం నామినేషన్ దాఖలుచేశారు. మూడోసారి వారణాసి నుంచి బరిలో దిగిన మోదీకి మద్దతుగా కేంద్ర మంత్రులు, బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి పార్టీల అగ్రనేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని నామినేషన్ను ప్రతిపాదించిన నలుగురిలో ఒక బ్రాహ్మణుడు, ఇద్దరు ఓబీసీలు, ఇక దళితుడు ఉన్నారు. పండిట్ జ్ఞానేశ్వర్ శాస్త్రి, బైజ్నాథ్ పటేల్, లాల్చంద్ కుష్వాహా, సంజయ్ సోంకర్లు మోదీ నామినేషన్ను ప్రతిపాదించారు. అయో« ద్యలో బాలరామాలయం ప్రాణ ప్రతిష్ఠ క్రతువుకు ముహూర్తాన్ని నిర్ణయించిన పండితుల్లో జ్ఞానేశ్వర్ శాస్త్రి కూడా ఒకరు. బైజ్నాథ్ పటేల్, లాల్చంద్ కుష్వాహా ఓబీసీలు కాగా, సోంకార్ బీజేపీ వారణాసి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న దళిత నేత.కలెక్టరేట్ నిండా ప్రముఖులేబీజేపీ చీఫ్ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్, హర్దీప్సింగ్ పురీ, అనుప్రియా పటేల్, రాందాస్ అథవాలే, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, హిందుస్తానీ అవామ్ మోర్చా(ఎస్) వ్యవస్థాపకుడు జితన్ రాం మాంఝీ, రాష్ట్రీయ లోక్మోర్చా చీఫ్ ఉపేంద్ర కుష్వాహా, నిషద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషద్, సుహేల్దేవ్ భారతీయ సమాజ్పార్టీ చీఫ్ ఓంప్రకాశ్ రాజ్భర్, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి, ఎల్జేపీ(రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అన్బుమణి రాందాస్, తమిళ మానిల కాంగ్రెస్ చీఫ్ జీకే వాసన్, బీజేపీ నేత దేవనాథన్ యాదవ్, భారతధర్మ జనసేన అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి, అసోమ్ గణపరిషత్ అధ్యక్షుడు అతుల్ బోరాలు వారణాసి కలెక్టరేట్లో మోదీ నామినేషన్ కార్యక్రమా నికి హాజరయ్యారు. మోదీ నామినేషన్ వేయడానికి వస్తున్నారని తెలిసి స్థానికులు పెద్ద సంఖ్యలో వారణాసి కలెక్టరేట్కు వచ్చారు. నామినేషన్ వేశాక మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేశారు. ‘‘ ఎన్డీఏ నేతలు మద్దతు గా ఇక్కడకు రావడం నాకు గర్వకారణం. దేశ ప్రగతికి, అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎన్డీఏ కూటమి కంకణబద్దమైంది. భవిష్యత్తు లోనూ ఇలాగే దేశ ప్రగతికి పాటుపడతాం’ అని మోదీ అన్నారు. దశశ్వమేథ్ ఘాట్లో పూజలునామినేషన్ వేయడానికి ముందు మోదీ మంగళవారం ఉదయం కాశీలో గంగా తీరాన దశశ్వమేథ్ ఘాట్లో పూజలు చేశారు. ఘాట్ వద్ద వేదమంత్రాల మధ్య గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత పడవలో నమో ఘాట్కు వెళ్లారు. అక్కడి కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత నేరుగా కలెక్టరేట్కు వెళ్లారు. బూత్కు ‘370’ ఓట్లు ఎక్కువ పడాలినామినేషన్ తర్వాత కాశీలోని రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో కాశీ నియోజకవర్గ బీజేపీ నేతలు, కార్యకర్తలతో మోదీ సమావేశమయ్యారు. ‘‘జమ్మూకశ్మీర్లో రద్దయిన ఆర్టికల్ 370కి గుర్తుగా కాశీలోని ప్రతి బూత్లో గతంతో పోలిస్తే నాకు 370 ఎక్కువ ఓట్లు పడేలా చేసే బాధ్యత మీదే’ అని మోదీ అన్నారు. కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి మరింతగా ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీ కార్యకర్తలకు మోదీ విజయమంత్రాలను ఉపదేశించారని బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాంగ్రెస్ యూపీ చీఫ్ అజయ్ రాయ్, బీఎస్పీ నేత అథ్హర్ జమాల్ లారీ మోదీకి పోటీగా బరిలో నిలబడ్డారు.సొంత ఇల్లు, కారు లేదు మోదీ అఫిడవిట్మోదీ తన స్థిరచరాస్తుల వివరాలను అఫిడవిట్లో పొందుపరిచారు. అఫిడవిట్ ప్రకారం.. మోదీకి సొంత భూమి, ఇల్లు, కారు లేవు. చేతిలో రూ.52,920 నగదు ఉంది. రూ.3.02 కోట్ల చరాస్తులు ఉన్నాయి. 2018–19లో రూ.11,14,230గా ఉన్న ఆదాయం 2022–23 వచ్చేసరికి రూ.23,56,080కు పెరిగింది. గాంధీనగర్ ఎస్బీఐ బ్రాంచీలో రూ.73,304, వారణాసి ఎస్బీఐ బ్రాంచీలో రూ. 7,000 నగదు ఉంది. ఎస్బీఐలో రూ.2.85 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. రూ.2.67 లక్షల విలువైన, 45 గ్రాముల బరువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి.9.12 లక్షల విలువైన నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు ఉన్నాయి. నామినేషన్ పత్రాల్లో భార్య పేరును జశోదాబెన్గా పేర్కొన్న మోదీ ఆమె ఆస్తుల వివరాలు తనకు తెలియదని పేర్కొన్నారు. ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. ఆయనకు అప్పులు కూడా లేవు. 1967లో ఎస్ఎస్సీ, 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ డిగ్రీ, 1983లో గుజరాత్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తిచేశారు. 2019 ఎన్నికల అఫిడవిట్లో గుజరాత్లోని గాంధీనగర్లో ఒక ప్లాట్ ఉందని పేర్కొన్న మోదీ ఈసారి దానిని ప్రస్తావించలేదు. -
‘రక్షణ’కు ఒక దిగ్దర్శనం అవసరం!
బీజేపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలు జాతీయ భద్రతకు భిన్న మార్గాల్లో ప్రాధాన్యం ఇచ్చాయి. అయితే రెండూ కూడా అత్యాధునిక మిలటరీ ఆయుధాలను సమకూర్చుకోవటానికి ఏమంత ప్రాముఖ్యం ఇవ్వలేదు. దేశంలోని ఈ రెండు ప్రధాన జాతీయ పార్టీల మేనిఫెస్టోలు పరిశీలించిన తరువాత రక్షణ, భద్రత అంశాల విషయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో కొంత మెరుగ్గా ఉన్నట్లు తోస్తోంది కానీ... త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులు కలిసి ఉన్న డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ... జాతీయ భద్రత వ్యూహం ఒకదాన్ని రూపొందించే విషయం రెండు మేనిఫెస్టోల్లోనూ స్పష్టంగా లేదు. అంతేకాదు, మన రక్షణ రంగానికి ఇప్పుడు దిగ్దర్శనం చేసే ఒక ‘ప్రొఫెషనల్’ అవసరం కూడా ఎంతైనా ఉంది.బీజేపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆత్మ నిర్భర్ భారత్’లో స్వావలంబనకు పెద్దపీట వేశారు కానీ... అత్యాధునిక మిలిటరీ ఆయుధాలను సమకూర్చుకోవడంపై మాత్రం దృష్టి పెట్టలేదు. జాతీయ భద్రత, రక్షణ వంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో చాలా అంశాలను ప్రస్తావించింది కానీ... ఏవీ అంత సమగ్రంగా ఉన్నట్టు కనిపించవు. ‘మోదీకి గ్యారెంటీ ఫర్ సురక్షిత్ భారత్’ పేరుతో మోదీ ప్రభుత్వం తను సాధించిన విజయాలను వెల్లడించింది, భవిష్యత్తు కోసం కొన్ని హామీలను ఇచ్చింది. 2014 తరువాత దేశంలోని ఏ నగరంలోనూ ఉగ్రదాడి ఏదీ జరగలేదని బీజేపీ చెప్పుకుంటోంది. ఇందులో కీలకం ‘నగరం’ అన్న పదం. 2016లో పఠాన్కోట వైమానిక స్థావరం, యూరీలు; 2019లో పుల్వామా ఘటనల్లో ‘నగరాల’పై దాడులు జరగలేదు కాబట్టి తాము తప్పుగా ఏమీ చెప్పలేదని బీజేపీ సమర్థించుకోవచ్చు.దీంతోపాటే ఆర్టికల్ 370 రద్దు ప్రభావం జమ్మూ కశ్మీర్లో ఎలా ఉందో కూడా మేనిఫెస్టోలో ప్రస్తావించారు. వామపక్ష తీవ్రవాద సంబంధిత హింస 52 శాతం వరకూ తగ్గిందనీ, ఈశాన్య భారతదేశంలో చొరబాటుదారుల సమస్య 71 శాతం నెమ్మదించిందని కూడా ఇందులో వివరించారు. ఉగ్రవాదాన్ని అస్సలు సహించేది లేదని చెబుతూ మేనిఫెస్టోలో 2016 నాటి సర్జికల్ స్ట్రైక్స్, 2019 నాటి బాలాకోట్ దాడి గురించి చెప్పారు. చైనా, పాకిస్తాన్, మయన్మార్ సరిహద్దుల్లో అత్యాధునికమైన రీతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామనీ, కార్యక్రమాలను వేగవంతం చేస్తామనీ, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో స్మార్ట్ ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేస్తామని కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే.. మణిపుర్ కూడా మన దేశ సరిహద్దులో ఉన్నా దాని ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ‘మోదీకి గ్యారెంటీ ఫర్ గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్’ విభాగంలో రక్షణ రంగ ఉత్పత్తులను మరింత విస్తృత స్థాయిలో తయారు చేస్తామనీ, ‘మేడిన్ భారత్’ ఎగుమతులకు ఊతమిస్తామని కూడా చెప్పుకున్నారు. ఈ ప్రయత్నాల వల్ల వాయు, పదాతిదళాలకు అవసరమైన ఆయుధాలు, వ్యవస్థలను దేశీయంగానే తయారు చేసేందుకు ప్రోత్సాహం లభిస్తుందని వివరించారు. గత ఏడాది అంటే బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అయిన తరువాత ‘నేషన్ ఫస్ట్: ఫారిన్ పాలసీ అండ్ నేషనల్ సెక్యూరిటీ’ పేరుతో బీజేపీ ఒక బుక్లెట్ విడుదల చేసి. అందులో తాము సాధించిన ఘనతలను ప్రస్తావించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రక్షణ, అంతర్గత భద్రతను, బయటి నుంచి రాగల సవాళ్లను వేర్వేరుగా సమీక్షించారు. లద్దాఖ్ ప్రాంతంలో సుమారు రెండు వేల కిలోమీటర్ల వైశాల్యమున్న భారత భూభాగాన్ని, మొత్తం 65 పెట్రోలింగ్ పోస్టుల్లో 25 పోస్టులపై పట్టు కోల్పోయామన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. అధికారంలోకి వస్తే జాతీయ భద్రతా వ్యూహం (ఎన్ఎస్ఎస్) ఒకదాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించింది. అలాగే ఎప్పుడో 2009లో రక్షణ మంత్రి జారీ చేసిన ఆపరేషనల్ డైరెక్టివ్లను సమీక్షిస్తామనీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామక ప్రక్రియను పారదర్శకంగా, వ్యవస్థీకృతంగా చేస్తామని కూడా హామీలు ఇచ్చింది. రక్షణ శాఖకు తగినన్ని నిధులు కేటాయించడమే కాకుండా ఈ రంగంలో తిరోగమిస్తున్న అంశాలను మళ్లీ పట్టాలెక్కిస్తామని తెలిపింది. ‘అగ్నిపథ్’ పథకం రద్దుతో పాటుగా, జాతీయ భద్రతా కౌన్సిల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్లను పార్లమెంటు పర్యవేక్షణలో పనిచేసేలా మార్పులు చేస్తామనీ, వ్యూహాత్మక అవసరాలకు అంతర్జాతీయ స్థాయి సరుకు రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తామనీ ‘వన్ ర్యాంక్– వన్ పెన్షన్’ అమల్లోని లోపాలను సవరిస్తామనీ వివరించింది. వైకల్యం కారణంగా లభించే పెన్షన్పై పన్నులు రద్దు చేస్తామని కూడా చెప్పింది. అంతర్గత భద్రత విషయాలను ప్రస్తావిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు, హింసలకు తావు ఇవ్వమనీ, ఇతర మతాల నిరాదరణనూ సహించబోమనీ స్పష్టం చేసింది. ‘నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్’ను ఆచరణలోకి తేవడం, ఏడాది లోపు ‘నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్’ ఏర్పాటు తమ లక్ష్యాలని వివరించింది. దేశంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీల మేనిఫెస్టోలు పరిశీలించిన తరువాత కాంగ్రెస్ మేనిఫెస్టో రక్షణ, భద్రత అంశాల విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నట్లు తోస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... మన ప్రభుత్వం రక్షణ రంగానికి జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో రెండు శాతం కంటే తక్కువ నిధులు కేటాయిస్తూండటం! ఫలితంగా మన మిలటరీ సామర్థ్యాలను చైనాకు దీటుగా మార్చుకునే విషయంలో వెనుకబడిపోయాం. త్రివిధ దళాల ఆధునికీకరణకు మరిన్ని నిధుల కేటాయిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అగ్నిపథ్ లాంటి పథకాల పుణ్యమా అని ఈ ఆధునికీకరణ మరో పదేళ్లకు కానీ పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. వన్ ర్యాంక్– వన్ పెన్షన్ బకాయిలు 2002–23లో మిలటరీ ఆధునికీకరణకు కేటాయించిన నిధుల కంటే ఎక్కువ కావడం, మిలటరీ సిబ్బంది సంఖ్యను మదింపు చేయడం ద్వారా ఈ లోటును అధిగమిస్తామని బీజేపీ చెప్పడం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఈ చర్యల కారణంగా మన యుద్ధ సన్నద్ధత, సామర్థ్యం తగ్గిపోయాయి. 2022లో కేవలం ఒక్క ఆర్మీలోనే 1.18 లక్షల ఖాళీలు ఉన్నాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆత్మ నిర్భరత’ కార్యక్రమం కూడా స్వావలంబనపై ఎక్కువ దృష్టి పెట్టింది కానీ... అత్యాధునిక ఆయుధాలనూ, వ్యవస్థలనూ ఏర్పాటు చేసుకోవడంపై కాదు. ఈ విషయాన్ని దేశ తొలి సీడీఎస్, దివంగత జనరల్ బిపిన్ రావత్ గతంలోనే కచ్చితంగా అంచనా కట్టారు. తగినన్ని, నాణ్యమైన ఆయుధ వ్యవస్థలు లేకపోయేందుకు ప్రస్తుతం అవలబిస్తున్న ‘ఎల్1’ టెండర్ వ్యవస్థ కారణం. మిత్ర దేశాలకు లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడంతో రక్షణ రంగ ఎగుమతులు పెరిగాయి. ఈ దేశాలన్నీ ప్రాణాంతకమైనవి కాకుండా ఇతర పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులు కలిసి ఉన్న డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ జాతీయ భద్రత వ్యూహం ఒకదాన్ని ఇంకా రూపొందించాల్సి ఉంది. ముసాయిదా ఒకదాన్ని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ 2021లోనే భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు ఇచ్చిన విషయం ప్రస్తావనార్హం. అప్పటి నుంచి ఇప్పటివరకూ దాన్ని అప్డేట్ చేస్తూనే ఉన్నారు.ఆర్మీ దళాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద, ముఖ్యమైన సమస్య వనరుల కొరత. దీంతోపాటే కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించక పోవటం కూడా. జాతీయ భద్రత విషయంలో 1980 మధ్య కాలం మిలటరీకి స్వర్ణయుగం అని చెప్పాలి. త్రివిధ దళాలు 15 ఏళ్ల రక్షణ ప్రణాళికను 1988లో పార్లమెంటులో ప్రస్తావించడం గమనార్హం. పదేళ్లలో బీజేపీ ఐదుగురు రక్షణ మంత్రులను నియమించింది. వీరిలో ఒకరు ఆర్థిక శాఖ మంత్రిగానూ పనిచేశారు. రెండుసార్లు రక్షణ మంత్రిత్వ శాఖను అదనపు బాధ్యతగా చేపట్టారు కూడా! మాజీ విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎస్.జయశంకర్ను ఆ శాఖ మంత్రిగానూ నియమించింది ఈ ప్రభుత్వం. జయశంకర్ అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభను వెలిగించారనడంలో సందేహం లేదు. అయితే దేశ రక్షణ రంగం కూడా ఇలాంటి ప్రొఫెషనల్ ఏర్పాటును కోరుకుంటోంది. రక్షణ మంత్రి లేదా ఆ శాఖ సహాయ మంత్రికైనా మిలటరీ విషయాలపై ఎంతో కొంత పట్టు ఉండాలి. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడం సులువు అవుతుంది. పథకాల అమలు వేగవంతమవుతుంది. ఆత్మ నిర్భరత సాధ్యమవుతుంది.– వ్యాసకర్త మిలటరీ వ్యవహారాల వ్యాఖ్యాత- మేజర్ జనరల్ అశోక్ కె. మెహతా (రిటైర్డ్) -
Lok Sabha Election 2024: ఎవరికి రిజర్వుడ్!
తూర్పు భారతంలో కీలక రాష్ట్రమైన జార్ఖండ్లో ఎన్నికల పర్వానికి రంగం సిద్ధమైంది. సోమవారం తొలి దశ పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 14 లోక్ సభ స్థానాలకు నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం 4 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. కేంద్ర గిరిజన శాఖ మంత్రి, జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా, మాజీ సీఎం మధు కోడా భార్య గీత, మాజీ డీజీపీ విష్ణు దయాళ్ రామ్ తదితర ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 10 జిల్లాల పరిధిలో విస్తరించిన ఈ నాలుగూ రిజర్వ్డ్ స్థానాలే కావడం విశేషం. పలాము ఎస్సీ, మిగతా మూడు ఎస్టీ నియోజకవర్గాలు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తదితరులు ఇక్కడ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో పోటీ ప్రధానంగా బీజేపీ; కాంగ్రెస్, జేఎంఎంలతో కూడిన విపక్ష ఇండియా కూటమి మధ్యే ఉంది. 2019 ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాల్లో మూడు బీజేపీ, ఒకటి కాంగ్రెస్ నెగ్గాయి... ఖుంటీ కేంద్ర మంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ అర్జున్ ముండా మరోసారి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాళీచరణ్ ముండాపై కేవలం 1,445 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారాయన. కాంగ్రెస్ నుంచి మళ్లీ కాళీచరణే బరిలో ఉన్నారు. ఖుంటీ బీజేపీ కంచుకోట. ఆ పార్టీ నేత కరియా ముండా ఇక్కడ ఏకంగా ఎనిమిదిసార్లు గెలిచారు. గిరిజనుల ఆరాధ్యుడు బిర్సా ముండా స్వగ్రామం ఉలిహట్ ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. గత నంబర్లో మోదీ ఈ గ్రామాన్ని సందర్శించి బిర్సా ముండాకు నివాళులర్పించారు. పేదరికం, మానవ అక్రమ రవాణా, మావోయిజం, నల్లమందు సాగు ఇక్కడి ప్రధాన సమస్యలు. కాంగ్రెస్ అభ్యర్థి కాళీచరణ్కు గిరిజనుల్లో పలుకుబడి ఉంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. కూటమి భాగస్వామి జేఎంఎం మాజీ ఎమ్మెల్యే బసంత్ కుమార్ లోంగా రెబల్గా పోటీ చేస్తున్నారు. దాంతో ఆ పార్టీ నుంచి కాంగ్రెస్కు ఓట్ల బదిలీ ఏ మేరకు జరుగుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.సింగ్భమ్ కాంగ్రెస్ పారీ్టకి బలమైన స్థానమిది. ఐదుసార్లు కాంగ్రెస్, మూడుసార్లు బీజేపీ, ఒసారి జేఎంఎం, ఐదుసార్లు జార్ఖండ్ పార్టీ గెలిచాయి. సింగ్భమ్లో మాజీ సీఎం మధు కోడా కుటుంబానికి గట్టి పట్టుంది. 2009లో మధు కోడా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 2014లో మాత్రం బీజేపీ నేత లక్ష్మణ్ గిలువా చేతిలో ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికల్లో మధు కోడా భార్య గీత కాంగ్రెస్ టికెట్పై గెలిచారు. జార్ఖండ్లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక స్థానం ఇదే. కానీ గీత గత ఫిబ్రవరిలో బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలో దిగారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ దీన్ని జేఎంఎంకు కేటాయించింది. దీంతో ఇక్కడ గెలుపును జేఎంఎం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర మంత్రిగా చేసిన ఐదుసార్లు ఎమ్మెల్యే జోబా మాంఝిని రంగంలోకి దింపింది.లోహర్దగ ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం. అయితే సిట్టింగ్ ఎంపీ సుదర్శన్ భగత్ను పక్కన పెట్టి సమీర్ ఒరాన్కు టికెటిచి్చంది. గత ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి సుఖ్దేవ్ భగత్ ఈసారీ బరిలో ఉన్నారు. జార్ఖండ్ పార్టీ నుంచి దియోకుమార్ ధాన్ పోటీ చేస్తున్నారు. బిష్ణుపూర్ జేఎంఎం ఎమ్మెల్యే చమ్రా లిండా కూడా ఇండిపెండెంట్గా బరిలో ఉండటం విశేషం! ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంది. ఈ నియోజకవర్గంలో 70 శాతానికి పైగా గిరిజన జనాభాయే.పలాము రాష్ట్రంలో ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానం. మాజీ డీజీపీ విష్ణు దయాళ్ రామ్ బీజేపీ టికెట్పై 2019లో 4.77 లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి నుంచి ఆర్జేడీ తరఫున మమతా భూయాన్ పోటీలో ఉన్నారు. ఇక్కడ 2009లో జేఎంఎం గెలవగా 2014లో విష్ణు దయాళ్ బీజేపీ అభ్యర్థిగా తొలిసారి నెగ్గారు. ఆయనకు మద్దతుగా ప్రధాని మోదీ పలాములో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. మమతా భూయాన్ రాజకీయాలకు కొత్తయినా ఇక్కడ ఆమె సామాజిక వర్గం ఓటర్లు 4.5 లక్షలకు పైగా ఉంటారు. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లలో నాలుగు బీజేపీ చేతిలోనే ఉన్నాయి.అక్కడ తొలిసారి ఓటింగ్ సింగ్భమ్ లోక్సభ స్థానం పరిధిలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ. దాంతో మారుమూల గ్రామాల్లోని వారికి ఓటేసే అవకాశం ఉండేది కాదు. అడవులు, కొండల్లోని అలాంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ప్రజలు కూడా దశాబ్దాల విరామం తర్వాత ఈసారి ఓటేయనున్నారు. అనేక కష్టనష్టాలకోర్చి అక్కడ 118 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం పోలింగ్ సిబ్బంది కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లారు. దట్టమైన అడవిలో ఉన్న సరండ అనే మారుమూల గ్రామానికైతే హెలికాప్టర్ ద్వారా ఎన్నికల సామగ్రిని తరలించారు. ఏ ఓటరూ ఓటింగ్కు దూరంగా ఉండొద్దన్నది తమ సంకల్పమని వెస్ట్ సింగ్భమ్ జిల్లా ఎన్నికల అధికారి కులదీప్ చౌదరి తెలిపారు.మహిళల ఓట్లే కీలకం సింగ్భమ్, ఖుంటి, లోహర్దగ స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం మహిళల చేతుల్లో ఉందని చెప్పాలి! ఎందుకంటే అక్కడ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. జార్ఖండ్లో గిరిజన మహిళలు పురుషులతో సమానంగా సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఓటింగ్లోనూ చురుకైన పాత్ర పోషిస్తుంటారు. దాంతో మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ, ఇండియా కూటమి అన్ని ప్రయత్నాలూ చేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భూ ఆక్రమణల్లో బకాసురుడు సీఎం రమేష్
అతడు.. భూఆక్రమణల్లో బకాసురుడు. అరాచకాల్లో రజాకార్లు కూడా ఆయన ముందు దిగదుడుపే. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో తన గురువు చంద్రబాబుకు తగ్గ శిష్యుడు. చివరకు సొంత గ్రామస్తులు, బంధువులు కూడా ఆయన అంతులేని ధనదాహార్తికి చితికిపోయారు. తన ఆక్రమణలకు అడ్డూ అదుపు లేదు.నదీ, వాగు అనే అభ్యంతరాలు లేవు. దొరికినదాన్నల్లా కబ్జా చేయడమే. సారా వ్యాపారం నుంచి మొదలై చంద్రబాబు అనుంగు శిష్యుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టి వాటినీ కలుíÙతం చేసిన ఆ చీడపురుగు.. సీఎం రమేశ్. సొంత గ్రామస్తులు ఛీ కొడుతున్న ఆయన అక్రమాలు, అరాచకాలు తెలిస్తే కళ్లు తేలేయకమానరు.పోట్లదుర్తి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : సీఎం రమేశ్, ఆయన సోదరుడు సురేశ్ నాయుడు రజాకార్ల కన్నా దుర్మార్గులని వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామస్తులు ధ్వజమెత్తారు. అదే గ్రామానికి చెందిన సీఎం రమేశ్, ఆయన సోదరుడు అరాచకాలకు బలికాని వర్గమంటూ లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. వారి ఆవేదన, ఆక్రందన వింటే ఈ కాలంలోనూ ఇన్ని దురాగతాలు ఎలా చేయగలుగుతున్నారనే ఆశ్చర్యం కలుగుతుంది.అన్ని వ్యవస్థలను అంతలా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారని అవాక్కవ్వక తప్పదు. సొంత గ్రామస్తులకు వారు బతికుండగానే నరకం చూపిన సీఎం రమేశ్ ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ తరఫున అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడేం చేయబోతున్నారో ఊహించడానికే కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రమేశ్ స్వగ్రామంలో ఆయన ‘వ్యవహారాలు’ తెలుసుకోవడానికి ‘సాక్షి’ పోట్లదుర్తిలో పర్యటించింది. సారా వ్యాపారంతో మొదలెట్టి.. సీఎం రమేశ్ కుటుంబం సారా వ్యాపారంతో మొదలైంది. టీడీపీలో చేరి చంద్రబాబుతో చెలిమి చేశాక ఇక ఆయన వెనుతిరిగి చూడలేదు. బాబు సహకారంతో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అన్నిరకాల అక్రమాలు, అడ్డగోలు వ్యవహారాల్లో ఆరితేరి రూ.వేల కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలున్నాయి. బయట కాంట్రాక్టులు, కంపెనీల వ్యవహారాలను అలా ఉంచినా.. సొంత గ్రామంలో మచ్చుకు కొన్నింటిని పరిశీలిస్తే వామ్మో రమేశ్ అనకుండా ఉండలేం. వాగులు, నదుల్ని చెరబట్టి.. ప్రొద్దుటూరు నుంచి ఎర్రగుంట్లకు వెళ్లే మార్గంలో పెన్నానది ఒడ్డున పోట్లదుర్తి ఉంది. పెన్నాకు– గ్రామానికి మధ్యలో కలమల్ల వాగు పోతోంది. సీఎం రమేశ్ అటు నదిని, ఇటు వాగును ఆక్రమించి ఫెన్సింగ్ వేశారు. ఆ భూమిని ఆక్రమించుకున్నారు. తన భూములకు చుట్టూ తీగతో ఫెన్సింగ్ వేయడం ద్వారా ఇతర రైతుల పొలాలకు రాకపోకలు లేకుండా చేశారు. పెన్నా నది, కలమల్ల వాగులకు రక్షణ గోడలు, చెక్డ్యామ్ల నిర్మాణ పనులు దక్కించుకున్న సీఎం రమేశ్ కుటుంబం వాటిపై ఎవరూ నడవకుండా అడ్డంకులు సృష్టించింది. చివరకు పశువులు, మూగజీవాలు నీరు తాగడానికి కూడా వీల్లేకుండా చేసింది. స్థానికులు నిరసనలు వ్యక్తం చేసినా సీఎం రమేశ్ రాక్షసంగానే వ్యవహరించారు. రైతుల్నే అమ్ముకునేలా చేసి.. తమ భూములున్న చోట పరిసరాల్లో కొందరి భూములు కొనుగోలు చేసి ఫెన్సింగ్ తీయించడం, ఆ తరువాత ఇతరులకు అడ్డంకులు కలి్పంచడం, వాటిని సొంతం చేసుకోవడం సీఎం రమేశ్, ఆయన సోదరుడి స్టైల్. పోనీ ఆ భూములను అక్కడున్న వాస్తవ ధర ప్రకారం తీసుకుంటారా అంటే అదీలేదు. ఎకరం రూ.పది లక్షల నుంచి రూ. ఇరవై లక్షలకు పైగా విలువచేసే భూమిని రూ.నాలుగు నుంచి ఆరేడు లక్షలకు రైతులే స్వయంగా వచ్చి అమ్ముకుపోయేలా వారిని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తారు. భూములను తక్కువకు ఇచ్చేలా బెదిరింపులకు పాల్పడటం షరామామూలని పలువురు సొంత బంధువులే వివరించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాం పాలన ముగిసే సమయానికి పోట్లదుర్తి పరిసరాల్లో మూడు వందల ఎకరాలకు పైగా భూములను సీఎం రమేశ్ తన వశం చేసుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అనేక పట్టా భూములను బినామీ పేర్లతో ఉంచారని తెలుస్తోంది. గొడ్డును బాదినట్లు బాదాడయ్యా మా అన్నదమ్ముల మధ్య పొలం విషయంలో తేడాలు వచ్చాయి. న్యాయం చెప్పమని సురేశ్ నాయుడు వద్దకు వెళ్లాం. ఎంతకూ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో మరో పెద్దమనిషి వద్దకు వెళ్లానని తెలుసుకుని ఇంటికి పిలిపించి గొడ్డును బాదినట్లు బాదాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో అని బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు మళ్లీ బెదిరిస్తున్నారు. మా ప్రభుత్వం రాగానే నీ అంతుచూస్తానని బెదిరిస్తున్నారు. – కలమల్ల బాదుల్లా, పోట్లదుర్తి బంధువులమైనా వదిలిపెట్టడం లేదు.. సీఎం రమేశ్, మేము అంతా దగ్గర బంధువులమే. మా భూములను తక్కువ ధరకు తీసేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. దీనిపై కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేదు. అయినా మా పోరాటం ఆపేది లేదు. – సీఎం రమేశ్ బంధువులు సీఎం రమేశ్ అక్రమాలు, అరాచకాలు» పెన్నా నది ఒడ్డున లిక్కర్ ఫ్యాక్టరీ నెలకొల్పుతానని, గ్రామంలోని వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలి్పస్తానని నమ్మబలికి సుమారు 40 ఎకరాలను పేదవర్గాల నుంచి సేకరించారు. అందులో అధునాతన అతిథిగృహాన్ని కట్టారు. » గ్రామంలో మోడల్ స్కూలు కట్టిస్తానని నమ్మబలికి ఎకరం రూ. కోటి విలువచేసే భూమిని కేవలం 11 లక్షలకే తీసుకుని గ్రామస్తులను మోసం చేశారు. ఆ భూముల్లో ఆకుకూరలు, కూరగాయలు పండేవని, భూయజమానులకు నిత్యం ఆదాయం ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. భూమి ఇవ్వడానికి నిరాకరించిన వారిని పోలీసుల పేరిట బెదిరించి మరీ తీసుకున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. » చంద్రబాబు పాలన 1999–2004 మధ్య ఎన్టీఆర్ కాలనీల పేరిట 294 (ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్థానాల సంఖ్య)గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్దిదారులకు ఆ ఇళ్ల హక్కుపట్టాలు రానీయకుండా సీఎం రమేశ్ తన కుటుంబీకుల వద్దే ఉంచుకుని రుణాల రూపంలో లబ్ధి పొందారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వాటిని అమ్మడానికి, ఇతరులకు అద్దెకు ఇవ్వడానికి వీల్లేకుండా పోయిందని లబ్దిదారులు వాపోతున్నారు. » గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కూల్ పిల్లలకు యూనిఫాం పేరిట కొనసాగిన పథకాన్ని సీఎం రమేశ్ తనకు అనుకూలంగా వినియోగించుకున్నారు. మహిళా టైలర్లకు తెలియకుండా వారి పేరిట బ్యాంకు అకౌంట్లు, పాన్ కార్డులు తీసుకుని టైలరింగ్ ఛార్జీలను ఆయా అకౌంట్లలో వేయించేవారు. అధికారులతో కుమ్మక్కయి బ్యాంకు లావాదేవీలు తనకు అనుకూలంగా కొనసాగించుకోవడంతో టైలర్లు తమకు తెలియకుండానే ఆదాయపన్ను పరి«ధిలోకి చేరారు. దీంతో వారు సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. » గ్రామస్తులు ఎవరైనా అత్యవసరాల కోసం డబ్బు తీసుకున్నా.. పెద్ద మొత్తం అయ్యేవరకు వేచిఉండి ఆ ప్రాంశరీ నోట్లను తిరిగి రాయించేవారు. ఆ తర్వాత ఆర్థికంగా వారిని పూర్తిగా కుంగదీసేవారు. ఇళ్ల స్థలాలు, ఇల్లు, భూములు ఇలా ఏవో ఒకటి లాగేసుకోవడం అన్నదమ్ములకు రివాజని స్థానికులు వివరించారు. సీఎం రమేశ్ సోదరుడు సురేశ్తో నిత్యం కలిసి ఉండే సోమశేఖరరెడ్డి తన అవసరాల కోసం రూ.40 వేలు తీసుకోగా కొన్నేళ్ల తర్వాత రూ. ఎనిమిది లక్షలకు పైగా తిరిగి చెల్లించాలని, లేదంటే తనకు భూమి రాసిచ్చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో సోమశేఖరరెడ్డి కుటుంబం దెబ్బతింది. అదేవిధంగా జబ్బుపడిన తన బిడ్డ వైద్యం కోసం ఒక పేద దళిత వ్యక్తి రూ.2 వేలు తీసుకోగా లక్షకు పైగా చెల్లించాలని అతడిని ఒత్తిడి చేశారు. సీఎం రమేశ్ సోదరుల దౌర్జన్యాలకు చివరకు వారి సొంత చిన్నాన్న కుటుంబం కూడా ఆర్థికంగా చితికిపోయింది. » ప్రొద్దుటూరులో ద్విచక్రవాహనాల స్కీమ్ పేరిట సీఎం రమేశ్ మోసం చేశారు. ప్రొద్దుటూరులో వ్యాపారులను, చుట్టుపక్కల గ్రామాల వారిని నిండా ముంచారు. » గ్రామానికి అంతటికి సోలార్ ఎనర్జీ వచ్చేలా చేస్తానని చెప్పి మోసగించారు. » పశువులు గ్రాసం కోసం ఇబ్బందిపడకుండా వసతి ఏర్పాటుచేస్తానని చెప్పి ప్రభుత్వ సొమ్ము దిగమింగారు. » నీరు – చెట్టు ప«థకంలోనూ రూ.కోట్ల రూపాయలు దిగమింగారు. » ఆర్టీపీపీకి వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డును కొంతమేర ఆక్రమించుకుని సీఎం రమేశ్ అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టారు. తన ఇంటి కోసం రోడ్డును ఓ వైపునకు పొడిగించి భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం కూడా లేకుండా చేశారు. తమ ఇంటి ముందు ఉన్న పది అడుగుల రోడ్డును ఆక్రమించడంతో పరిసరాల్లోని తమకు దగ్గరి నడక మార్గం లేక చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని స్థానికులు వాపోయారు. -
అభ్యర్థుల ఆస్తులపైనా కన్ను!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లిలో మైనింగ్పై కన్నేసి.. ఇక్కడ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేశ్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థుల ఆస్తులపైనా కన్నేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులకు నిధుల కొరత ఉందంటూ.. వారికి నిధుల సమీకరణ పేరుతో వారి ఆస్తులను తాకట్టు పెట్టుకునేందుకు సీఎం రమేశ్ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే అభ్యర్థులు తమ వంతు వాటా నిధులను తన టీమ్ సభ్యులకు చూపించాకే ఆయన తన వాటా నిధులను విడుదల చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా తమ వద్ద నిధులు లేవంటే.. వారి ఆస్తి పత్రాలు తీసుకుని అప్పులిప్పిస్తున్నట్టు చెబుతున్నారు. అది కూడా అధిక వడ్డీకి తన సన్నిహితుల వద్ద నుంచే సీఎం రమేశ్ అప్పులిప్పుస్తుండటం అభ్యర్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఫోర్జరీ వ్యవహారంలో ఆయనపై హైదరాబాద్లో కేసు నమోదైంది. ఈ వ్యవహారం తెలిసిన ఎమ్మెల్యే అభ్యర్థులందరూ తాజా పరిణామాలతో భయాందోళనకు గురవుతున్నారు. అధిక వడ్డీకి తీసుకున్న ఈ మొత్తాలను సకాలంలో చెల్లించలేదన్న సాకుతో తమ ఆస్తులను తీసేసుకుంటే తమ పరిస్థితి ఏమిటని కూటమి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆస్తుల చిట్టాతో భయపెడుతున్న వైనం వాస్తవానికి కొందరు తెలుగుదేశం, జనసేన పార్టీల అభ్యర్థులు ఎంపీ కోటా నుంచి వచ్చిన నిధులతోనే ఎన్నికలు కానిచ్చేదామనుకున్నారు. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.13 కోట్ల మేర సీఎం రమేశ్ నిధులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు ఈ నిధులు సరిపోతాయని.. తమ వంతు వాటా నిధులు అవసరం లేదని ఎమ్మెల్యే అభ్యర్థులు భావించారు. అయితే, మీ వాటా నిధులు ఎక్కడున్నాయో చెప్పాలని.. తన టీమ్ పరిశీలిస్తుందని ఎమ్మెల్యే అభ్యర్థులను సీఎం రమేశ్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. మీ వంతుగా మీ వద్ద రూ.10 కోట్ల మేర ఉన్నాయని తన టీమ్ నిర్ధారించాకే తన కోటా రూ.13 కోట్లు విడుదల చేస్తానని ఆయన తేల్చిచెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో చోడవరం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి తన వద్ద నిధులు లేవని.. తనకు పెద్దగా ఆస్తులు కూడా లేవని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో సదరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆస్తుల మొత్తం వివరాలను డాక్యుమెంట్స్తో సహా సీఎం రమేశ్ ఆయన ముందు ఉంచడంతో విస్తుపోవడం ఆ అభ్యర్థి వంతైందని చెబుతున్నారు. ఇందులో కొన్ని ఆస్తులను తాను అమ్మివేశానని.. ప్లాట్లుగా విభజించి విక్రయించినట్టు ఆ అభ్యర్థి చెప్పడంతో తాజా ఎన్కంబరెన్స్ సరి్టఫికెట్ (ఈసీ)ని కూడా సీఎం రమేశ్ ఆయనకు చూపించినట్టు తెలుస్తోంది. ఇంతగా తమ ఆస్తులు, వాటి పత్రాలను కూడా ఆయన సేకరించడం పట్ల అభ్యర్థులు ఒకింత ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం.అధిక వడ్డీకి తాకట్టు.. అనకాపల్లి ఎంపీ స్థానం పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులకు చెందిన ఆస్తి పత్రాలన్నింటినీ సీఎం రమేశ్ సేకరించినట్టు చెబుతున్నారు. తమ వద్ద నిధులు లేవన్న అభ్యర్థులకు.. ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులిప్పించే ఏర్పాట్లను కూడా ఆయన చూసుకుంటున్నారు. ‘నీ ఆస్తి పత్రాలను తీసుకెళ్లి.. వైజాగ్లో ఫలానా వారిని కలిసి వడ్డీకి నిధులు తీసుకో’ అని వారిని ఆదేశిస్తున్నట్టు సమాచారం. తమ ఆస్తుల చిట్టాను సేకరించి.. వాటిని ఎక్కడ తాకట్టు పెట్టాలో కూడా సీఎం రమేశ్ చెబుతుండటంతో అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ ఆస్తుల చిట్టాను ఎందుకు సేకరించారు? వాటిని తీసుకెళ్లి ఫలానా వారి వద్దనే తాకట్టు పెట్టాలని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టుకుని అధిక వడ్డీకి అప్పులు ఇస్తున్న వారంతా సీఎం రమేశ్కు చెందినవారే కావడంతో వీరి అనుమానాలు రెట్టింపవుతున్నాయి. ఎన్నికల తర్వాత తమ ఆస్తులు తమకు దక్కుతాయా? ఈ అప్పు పేరుతో తీసుకున్న పత్రాలను తీసుకెళ్లి సొంతం చేసుకుంటారా అనే భయాందోళనకు గురవుతున్నట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ఆస్తుల చిట్టాను మొత్తం విప్పుతుండటంతో అభ్యర్థుల్లో ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా నెలకొందని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
రివర్స్ గేర్లో కాంగ్రెస్ సర్కార్
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడం.. బీజేపీ పదేళ్లలో ఏమీ చేయకపోవడంతో ఆ పార్టీలు ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయాయని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే టి.హరీశ్రావు చెప్పారు.కాంగ్రెస్పై ఓటర్లకు విరక్తి కలిగిందని, ఉదయ్పూర్ డిక్లరేషన్ అభాసుపాలైందని, రాష్ట్రంలో మంత్రులు అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని, అనూహ్య ఫలితాలు రానున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా హరీశ్రావు శనివారం సాక్షితో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే..రాహుల్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారుఅసెంబ్లీ ఎన్నికల్లో హామీలుగా ఇచ్చిన ఆరు గ్యారంటీలనే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అలాంటిది పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త గ్యారంటీలంటూ అబద్ధపు మాటలతో ప్రజల ముందుకొస్తున్నారు. ఈ గ్యారంటీలను ప్రజలు నమ్మేపరిస్థితిలో లేరు. రాష్ట్రంలో ఏం జరుగుతుందనే అవగాహన లేకుండా సీఎం రేవంత్రెడ్డి ఏది రాసిస్తే దాన్ని రాహుల్గాంధీ చదువుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్లో నడుస్తోంది. రాహుల్ గాంధీ ఉదయ్పూర్లో చేసిన డిక్లరేషన్ అమలు చేయకపోవడంతో నాయకులు, కార్యకర్తల్లో విశ్వసనీయతను కోల్పోయారు. ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వమని చెబుతూ వచ్చి చివరకు వారికే ఎక్కువగా టికెట్ ఇచ్చి పార్టీని నమ్ముకున్నవారిని నట్టేట ముంచారు. సర్కారు నుంచి వేధింపులురాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విరక్తి కలిగింది. హైదరాబాద్లో రాహుల్ గాంధీ సభనే దీనికి నిదర్శనం. జనాలు రాకపోతే సుమారు 45 నిమిషాలపాటు రాహుల్ బస్సులోనే ఉండిపోయారు. సభ ప్రాంగణంలోకి వెళ్లండంటూ స్వయంగా రేవంత్రెడ్డి గేట్ దగ్గరుండి కోరినా.. ప్రజలు లోపలికి పోని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ మంత్రులు అహంకారంతో మాట్లాడుతున్నారు. గాలిలో ఉన్న కాంగ్రెస్ను భూమి మీదకు దించాలంటే ఆ పార్టీ నేతలను ఓడించాలి. నిరుద్యోగులు, ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. వ్యాపారులతోపాటు అన్ని వర్గాల వారికి ప్రభుత్వం నుంచి వేధింపులు మొదలయ్యాయి. అక్రమ కేసులు పెట్టి గౌడన్నలను జైలు పాలు చేశారు, చంచల్గూడ జైలులో ఇప్పుడు సగం మంది వారే ఉన్నారు.బీజేపీ ఒరగబెట్టింది ఏమీలేదుపదేళ్లలో బీజేపీ తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీలేదు, అందుకే దేవుని పేరుతో ఎన్నికల్లోకి వస్తున్నారు. అయోధ్యలో రామాలయాన్ని ట్రస్ట్ నిర్మించింది. ఆలయ నిర్మాణానికి చాలామంది ప్రజలు ఇచ్చారు... నేను కూడా విరాళం ఇచ్చా. అయితే, ఆ గుడిని తాము కట్టించామని బీజేపీ చెప్పుకుంటోంది. విదేశాల నుంచి నల్లధనాన్ని తెచ్చి పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం చేయలేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసింది. బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు రాష్ట్రానికి చేసింది గుండు సున్నా. బీజేపీ ప్రభుత్వం బీడీ కార్మికులకు పెన్షన్ను దూరం చేసింది. బీడీ కట్టలకు జీఎస్టీ పెట్టడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. తులం బంగారం తుస్సుపేదింటి ఆడ బిడ్డల పెళ్లికి ప్రభుత్వం నుంచి కల్యాణలక్ష్మి కింద ఇస్తామని చెప్పిన రూ.లక్ష చెక్ బౌన్స్ అయింది. తులం బంగారం హామీ కూడా తుస్సుమంది. వడ్లకు తరుగు తీస్తున్నారని స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నారు. వడ్లకు తరుగు తీస్తున్న కాంగ్రెస్కు రైతులు ఓట్లలో తరుగు పెట్టాలి. రాష్ట్రంలో అప్పులు చూపించి.. దివాళా తీసిందని ప్రభుత్వం చెబుతుండటంతో పెట్టుబడులు రాకుండా పోతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటివరకు నా సవాల్ను స్వీకరించలేదు. ఆగస్టు 15లోపు ఆరు గ్యారంటీలు, రూ 2లక్షల రుణ మాఫీ అమలు చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పినా సీఎం ఇప్పటివరకు స్పందించలేదు. సవాల్ను స్వీకరించకపోతే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ బీజేపీలు బోగస్ సర్వేలు విడుదల చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నాయి. యువత వాటిని నమ్మొద్దు.(గజవెల్లి షణ్ముఖరాజు) -
మోదీ నుంచి నడ్డా వరకు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ హైవోల్టేజీ ప్రచారం ముగిసింది. ప్రధాని నరేంద్రమోదీ మొదలు కేంద్ర హోంమంత్రి అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల పర్యటనలతో ప్రచారపర్వాన్ని దూకుడుగా పూర్తి చేసింది. బహిరంగసభలు, వివిధ సామాజికవర్గాల వారీగా సమావేశాలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, ఇంటింటికి బీజేపీ వంటి కార్యక్రమాలతో హోరెత్తించింది. ముఖ్యంగా మోదీ, అమిత్షా, నడ్డా వంటి అగ్రనేతలు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవ ర్గాలను ఒక ప్రణాళికాబద్ధంగా చుట్టివచ్చేలా ఎన్నికల ప్రచార కార్యక్రమాల రూపకల్పన ఆ పార్టీకి కలిసొచ్చిందనే చెప్పాలి. పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశమున్న సీట్లు, ఇంకా కొంచెం కష్టపడితే గెలవగలిగే స్థానాలు, పోటీలో ఉన్న స్థానాలు...ఇలా వర్గీకరించుకుని తప్పకుండా విజయం సాధిస్తామనే చోట్ల అధిక దృష్టిని కేంద్రీకరించారు. ఇందుకు అనుగుణంగానే.. ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి ప్రచార గడువు ముగిసే వరకు బీజేపీ నేతలు ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార పర్వం పూర్తయ్యే ముందురోజు అంటే...శుక్రవారం సాయంత్రం ఎల్బీస్టేడియంలో ఐదు ఎంపీ సీట్ల పరిధిలో నిర్వహించిన బహిరంగసభలో మోదీ ప్రసంగించారు. అదేరోజు మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొన్నారు. ఇక ప్రచారం ముగిసిన శనివారం చేవేళ్ల ఎంపీ సీటు పరిధిలోని వికారాబాద్లో, నాగర్కర్నూల్లోని వనపర్తిలో నిర్వహించిన సభల్లో అమిత్షా పాల్గొన్నారు.ప్రచారంలో దూకుడుగానేప్రధానపార్టీల కంటే ముందుగా అభ్యర్థుల ప్రకటనతో పాటు ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడేలోగానే తొలివిడత ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన బీజేపీ.. మొత్తంగా రాష్ట్రంలో ప్రచార విషయంలో మాత్రం బీజేపీ‘అడ్వాంటేజ్ పొజిషన్’లోకి ప్రవేశించిందనే చెప్పాలి. పదేళ్లపాటు కేంద్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు, తెలంగాణకు వివిధ రూపాల్లో రూ.10 లక్షల కోట్ల వరకు నిధుల కేటాయింపు వెరసి మోదీ సర్కార్ సాధించిన విజయాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రచారాన్ని ఉరకలెత్తేలా చేసింది. అయితే సీఎం రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ఆరోపించిన రిజర్వేషన్ల రద్దు అంశం, మళ్లీ బీజేపీ వస్తే హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేస్తారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ నేతలు సర్వశక్తులూ ఒడ్డాల్సి వచ్చింది. ఈ రెండు విషయాలపై ఏకంగా మోదీ, అమిత్షా సహా రాష్ట్ర పార్టీ అ«ధ్యక్షుడు కిషన్రెడ్డి కూడా ప్రధానంగా ఫోకస్ చేయాల్సి వచ్చిందనే చెప్పాలి. -
Lok Sabha Election 2024: నాలుగో విడతలో బెంగాల్ లో ముక్కోణాలు
కీలక రాష్ట్రాల్లో ఒకటైన పశి్చమ బెంగాల్లో నాలుగో విడతలో సోమవారం 8 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 42 లోక్సభ స్థానాలకు గాను మూడు విడతల్లో 10 చోట్ల పోలింగ్ ముగిసింది. నాలుగో విడత అభ్యర్థుల్లో పీసీసీ చీఫ్ అదీర్ రంజన్ చౌదరి, తృణమూల్ ఫైర్బ్రాండ్ మహువా మొయిత్రా, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు...కృష్ణానగర్ఈ లోక్సభ ఎన్నికల్లో ఆసక్తికరమైన పోరుకు వేదికైన స్థానాల్లో కృష్ణానగర్ ఒకటి. పార్లమెంటులో మోదీ సర్కారుపై విరుచుకుపడే తృణమూల్ ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా మళ్లీ బరిలో ఉండటమే అందుకు కారణం. ఆమె 2019లో తొలిసారి తృణమూల్ టికెట్ మీదే ఇక్కడ గెలిచి లోక్సభలో అడుగు పెట్టారు. లోక్సభలో అదానీ గ్రూప్కు వ్యతిరేకంగా ప్రశ్నలడిగేందుకు నగదు, కానుకలు తీసుకున్నారన్న ఆరోపణలపై సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయినా ఆమెకే తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మళ్లీ అవకాశమిచ్చారు. ఈసారి మరింత మెజారిటీతో నెగ్గి లోక్సభలో అడుగు పెడతానని మొయిత్రా ధీమాగా ఉన్నారు. ఆమెపై బీజేపీ నుంచి స్థానిక రాజ కుటుంబం మహరాజా కృష్ణచంద్ర రాయ్ వంశీకురాలు అమృతరాయ్ పోటీలో ఉన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆమె బాగా పరిచయం. ఈ ఏడాదే బీజేపీలో చేరి టికెట్ సాధించారు. ఆమెకు మద్దతుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇక సీపీఎం అభ్యర్థి ఎస్ఎం సాది ముస్లింలతో పాటు ఇతర వర్గాల్లోనూ మంచి పేరున్న నేత. మొయిత్రాకు పడే ముస్లిం ఓట్లను సాది గణనీయంగా చీల్చి ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.బహ్రాంపూర్ పశ్చిమబెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అ«దీర్ రంజన్ చౌదరి 1999 ఎన్నికల నుంచి ఇక్కడ నాన్స్టాప్గా గెలుస్తున్నారు. ఈసారి తృణమూల్ నుంచి ప్రముఖ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఆయనకు సవాలు విసురుతున్నారు. నిర్మల్ కుమార్ సాహాకు బీజేపీ టికెట్ లభించింది. దాంతో ముక్కోణపు పోటీకి బహ్రాంపూర్ కేంద్రంగా మారింది. 1999కి ముందు వరుసగా మూడుసార్లు ఆర్ఎస్పీ నేత ప్రమోతెస్ ముఖర్జీ ఇక్కడ నెగ్గారు. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి. బహ్రాంపూర్లో 50 శాతం ముస్లింలే ఉన్నారు. వారంతా కాంగ్రెస్కే దన్నుగా నిలుస్తున్నారు. అందుకే ఈసారి అ«దీర్కు ఎలాగైనా చెక్ పెట్టేందుకు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పఠాన్ను తృణమూల్ ఎంచుకుంది. అయితే స్థానికేతరుడు కావడం ఆయనకు కాస్త మైనస్గా మారింది. ముస్లిం ఓట్లు కాంగ్రెస్, తృణమూల్ మధ్య చీలితే బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలూ లేకపోలేదు.భోల్పూర్ బెంగాల్లోని బీర్భుమ్ జిల్లా పరిధిలో ఉన్న ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో ముక్కోణపు పోటీ నెలకొంది. బోల్పూర్తో పాటు బీర్భుమ్ లోక్సభ స్థానంలోనూ టీఎంసీ విజయంలో స్థానిక నాయకుడు అనుబ్రత మోండల్ది కీలక పాత్ర. పశువుల అక్రమ రవాణా కేసులో ఆయన రెండేళ్లుగా తిహార్ జైల్లో ఉండడం ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసేదే. అయినా భోల్పూర్లో మోండల్ పేరుతోనే టీఎంసీ ఓట్లడుగుతోంది! దివంగత లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ 1985 నుంచి 2009 వరకు ఏడుసార్లు ఇక్కడి ఎంపీగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ అసిత్ కుమార్ మల్పైనే మరోసారి టీఎంసీ ఆశలు పెట్టుకుంది. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లూ ఆ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి! ఇది తృణమూల్కు బాగా కలిసొచ్చే అంశం. బీజేపీ నుంచి ప్రియా షా పోటీ చేస్తున్నారు. 2014తో పోలిస్తే 2019లో బీజేపీకి ఇక్కడ ఓట్లు భారీగా పెరిగాయి. ఈసారి సీఏఏ తదితరాల దన్నుతో గెలిచి తీరతామని బీజేపీ నేతలంటున్నారు. సీపీఎం నుంచి స్థానికంగా బాగా పట్టున్న శ్యామలి ప్రధాన్ పోటీలో ఉన్నారు. భోల్పూర్ లోక్సభ స్థానం పరిధిలో సీపీఎంకు ఆదరణ కూడా ఎక్కువే. బీజేపీ, తృణమూల్ ఓట్లలో శ్యామలి వేటిని చీలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.రాణాఘాట్బెంగాల్లో ఈ విడతలో ఎక్కువ ఆసక్తి నెలకొన్న స్థానాల్లో ఇదీ ఒకటి. సిట్టింగ్ ఎంపీ జగన్నాథ్ సర్కార్నే బీజేపీ మరోసారి పోటీకి నిలిపింది. ఆయన గత ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి రూపాలి బిశ్వాస్పై 2.33 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2009, 2014ల్లో ఇక్కడ తృణమూల్దే విజయం. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు చోట్ల బీజేపీ చేతిలో, రెండు తృణమూల్ ఖాతాలో ఉన్నాయి. అయితే రానాఘాట్ దక్షిణ్ ఎమ్మెల్యే ముకుత్ మణి అధికారి బీజేపీకి ఝలక్ ఇస్తూ లోక్సభ ఎన్నికల ముందు తృణమూల్లో చేరారు. ఆయననే పార్టీ అభ్యరి్థగా మమత బరిలోకి దింపారు. దాంతో పోరు ఆసక్తికరంగా మారింది. కానీ ముకుత్కు టికెటివ్వడంతో స్థానిక తృణమూల్ నేతలు భగ్గుమన్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారానికి ముందుకు రావడం లేదు. బంగ్లాదేశ్ నుంచి వలస వచి్చన మథువా సామాజికవర్గ ప్రాబల్యం ఇక్కడ ఎక్కువ. సీఏఏ అమలుతో వీరికి భారత పౌరసత్వం రానుంది. ఇది బీజేపీకి బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు. సీపీఎం తరఫున అలోకేశ్ దాస్ పోటీలో ఉన్నారు.బర్ధమాన్ – దుర్గాపూర్దేశానికి ప్రపంచకప్ తెచ్చిపెట్టిన ఇద్దరు మాజీ క్రికెటర్లు బెంగాల్లో ఈ విడత బరిలో ఉండటం విశేషం. వారిలో ఒకరు 2007 టీ20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టు సభ్యుడు యూసఫ్ పఠాన్, మరొకరు 1983 వన్డే ప్రపంచ కప్ నెగ్గిన ‘కపిల్ డెవిల్స్’లో ఒకరైన కీర్తి ఆజాద్. వీరిద్దరూ తృణమూల్ అభ్యర్థులుగా బీజేపీకి సవాల్ విసురుతున్నారు. కీర్తి ఆజాద్ బీజేపీ మాజీ ఎంపీ. 2015లో సస్పెన్షన్కు గురై కాంగ్రెస్లో చేరారు. 2021లో తృణమూల్ గూటికి చేరారు. బర్ధమాన్–దుర్గాపూర్ లోక్సభ స్థానంలో రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ దిలీప్ ఘోష్తో తలపడుతున్నారు. నియోజకవర్గాల పునరి్వభజన అనంతరం ఏర్పడిన ఈ స్థానంలో ఓటర్లు ఏ పార్టీని రెండోసారి దీవించిన చరిత్ర లేదు. 2009లో సీపీఎం నేత సాదుల్ హక్ గెలవగా, 2014లో తృణమూల్ అభ్యర్థి ముంతాజ్ సంఘమిత్ర నెగ్గారు. 2019 ఎన్నికల్లో ముంతాజ్పై బీజేపీ నేత ఎస్ఎస్ అహ్లూవాలియా కేవలం 2,400 ఓట్లతో గట్టెక్కారు. ఈ విడత బీజేపీ అభ్యర్థి ఘోష్కు అజాద్ గట్టి పోటీ ఇస్తున్నారు. సీపీఎం ఇక్కడ సుకీర్తి ఘోషాల్ను నిలబెట్టింది.బీర్భుమ్2004 తర్వాత ఎస్సీ నుంచి జనరల్కు మారినప్పటి నుంచీ ఇక్కడ తృణమూల్ నేత, నటి శతాబ్దీ రాయ్ చక్రం తిప్పుతున్నారు. 2009 నుంచి ఆమే గెలుస్తూ వస్తున్నారు. అయితే 2014 ఎన్నికల నుంచి ఇక్కడ బీజేపీ బాగా పుంజుకుంది. 2019లో ఏకంగా 5.65 లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. మాజీ ఐపీఎస్ అధికారి దేవాశిష్ ధార్ను అభ్యరి్థగా బీజేపీ ప్రకటించగా సాంకేతిక కారణాలతో పోటీకి అనర్హుడయ్యారు. దాంతో దేబతను భట్టాచార్య పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మిల్టన్ రషీద్ పోటీలోకి ఉన్నారు. అవినీతి, మహిళలపై నేరాలు, సీఏఏ తదితర అంశాలు ఇక్కడి ఎన్నికలపై ప్రభావం చూపించనున్నాయి. టీఎంసీ నేత అనుబ్రత మోండల్ అందుబాటులో లేకపోవడం బీజేపీకి కొలిసొచ్చేదే. అయితే ఈ లోక్సభ పరిధిలోని ఏడు స్థానాల్లో ఆరు తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి.ఆస్తుల్లో అమృతా రాయ్ టాప్ పశి్చమబెంగాల్లో నాలుగో విడతలో బరిలో ఉన్న 75 మంది అభ్యర్థుల్లో 21 మంది కోటీశ్వరులు. కృష్ణానగర్ బీజేపీ అభ్యర్థి రాయ్ రూ.554 కోట్ల ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. తర్వాత అసన్సోల్ తృణమూల్ అభ్యరి్థ, బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హాకు రూ.210 కోట్లు ఉన్నాయి. రాణా ఘాట్ స్వతంత్ర అభ్యర్థి జగన్నాథ్ సర్కార్ తన వద్ద కేవలం రూ.3,586 ఉన్నట్టు చూపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాట్లకు కావాల్సిన సీట్లను బీజేపీ గెలుచుకోలేదని ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాను తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఎంతో మంది నిపుణులు, సెఫాలజిస్టులతో మాట్లాడనని చెప్పారు. బీజేపీ ఈసారి కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, వెస్ట్బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్లలో చాలా సీట్లు కోల్పోనున్నట్లు తెలిసిందన్నారు. ‘ఫోన్లో చాలా మంది సెఫాలజిస్టులతో మాట్లాడాను. ప్రతి ఒక్కరు బీజేపీకి మెజారిటీ రాదనే చెబుతున్నారు. ఇక ఢిల్లీ విషయానికి వస్తే మొత్తం 7 ఎంపీ సీట్లలో బీజేపీ ఓడిపోతుంది. జూన్4న మోదీ అధికారం కోల్పోతారు. ఇండియూ కూటమి అధికారంలోకి వస్తుంది’అని కేజ్రీవాల్ చెప్పారు. -
పాక్కు మోదీ బుల్లెట్తో సమాధానం చెప్తారు.. అమిత్ షా
తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి అమిత్షా కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ‘పాకిస్తాన్ దగ్గర ఆణుబాంబు ఉందని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ భయపడుతున్నారు. బాంబ్ ఉందని పీవోకేని పాకిస్తాన్కు అప్పగిద్దామా? అని ప్రశ్నించారు. మీరు ఆందోళన చెందొద్దు. మోదీ మరోసారి ప్రధాని కానున్నారు. పాక్కు బుల్లెట్లతోనే సమాధానం చెబుతారని అన్నారు. అంతకుముందు, ప్రధాని మోదీ మణిశంకర్ అయ్యర్పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నిరంతరం తన సొంత దేశాన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. జాగ్రత్త, పాకిస్థాన్లో అణుబాంబులు ఉన్నాయి' అని అంటున్నారు.ఈ బలహీనులు భారతదేశ స్ఫూర్తిని తగ్గించే ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఇలాంటి వైఖరిలోనే ఉంది. పాక్ వారి సొంత బాంబులను నిర్వహించలేని స్థితిలో ఉంది. అమ్మడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎవరూ కొనడానికి ఇష్టపడడం లేదు. ఈ బలహీనమైన వైఖరి కారణంగా జమ్మూ కాశ్మీర్లోని ప్రజలు ఆరు దశాబ్దాలకు పైగా తీవ్రవాదాన్ని చవిచూడాల్సి వచ్చింది అని ప్రధాని మోదీ అన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
- Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
Advertisement