-
యువ భారత్కు వయసు మళ్లిన ఎంపీలు!
భారత్ యువ దేశం.. మొత్తం జనాభాలో 65 శాతం కంటే ఎక్కువ మంది 35 ఏళ్లలోపు వాళ్లే. సగటు వయస్సు 29 కంటే తక్కువ ఉన్నందున భారత్ను యువ దేశం అని పిలుస్తారు. దేశమయితే యువతది కానీ.. పరిపాలిస్తున్నవారు మాత్రం వయసు మల్లినవారు. గత 20 ఏళ్లలో ఎన్నికైన ఎంపీల సగటు వయసును పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది.ఇప్పటివరకూ 17 లోక్సభలు పూర్తయ్యాయి. ప్రస్తుతం 18వ లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1999లో 13వ లోక్సభ నుంచి 2019లో 17వ లోక్సభ వరకూ ఎన్నికైన ఎంపీల సగటు వయసు 50 ఏళ్లు దాటింది. 2014, 2019 ఎన్నికల్లో ఎంపీలైనవారి సగటు వయసు అయితే ఏకంగా 55 ఏళ్లకు చేరడం గమనార్హం. ఎంపీగా పోటీ చేయడానికి భారత రాజ్యాంగం నిర్దేశించిన వయసు 25 ఏళ్లే అయినా ఎన్నికవుతున్న ఎంపీల సగటు వయసు 55 ఏళ్లు తాకింది. ఎంత ఎక్కువ మంది వయసు మళ్లినవారు ఎంపీలుగా ఎన్నికవుతున్నారంటే అంత ఎక్కువగా యువత ప్రాతినిధ్యం తగ్గుతోందని అర్థం.17వ లోక్సభకు ఎన్నికైన అత్యంత పెద్ద వయస్కుడైన ఎంపీ షఫీకర్ రెహ్మాన్ బార్క్. ఈయన ఉత్తర ప్రదేశ్లోని సంభాల్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇక ఇదే లోక్సభలో అత్యంత పిన్నయస్కురాలైన ఎంపీ చంద్రాని ముర్ము. ఒడిశాలోని కియోంజార్ స్థానం నుంచి ఈమె గెలుపొందారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతీయ జనాభాలో దాదాపు 11 శాతం మంది 25-30 ఏళ్ల వయస్సులో ఉన్నారు. 2019 లోక్సభలో, ఈ వయస్సులో 1.5 శాతం మంది ఎంపీలు కూడా లేరు. 2011 జనాభా గణన కూడా భారతీయ జనాభాలో 25 శాతం కంటే ఎక్కువ మంది 25-40 ఏళ్ల వయస్సులో ఉన్నారని చెబుతోంది. అయితే ఈ ఏజ్ గ్రూపు 17వ లోక్సభలో కేవలం 12 శాతం మాత్రమే. ఈసారి 18వ లోక్సభలో అయినా యువత ప్రానిధ్యం మెరుగుపడుతుందేమో చూడాలి. -
Thodu Needa Founder Rajeswari: సీనియర్ సిటిజన్స్కు భరోసా ఏది?
దేశం నిశ్శబ్దంగా ఒక ముఖ్యమైన జనాభా మార్పుకు గురవుతోంది. ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశ జనాభాలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు దాదాపు 15 కోట్ల మంది ఉన్నారు. ఈ సంఖ్య 2050 నాటికి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. సంతానోత్పత్తి రేటు తగ్గడం, అందుబాటులోకి వచ్చిన చికిత్సా విధానాల వల్ల భారతదేశ జనాభాలో వృద్ధుల వాటా నిశ్శబ్దంగా పెరుగుతోంది. అయితే, దీనికి తగినట్టుగా వారి ఆర్థిక శక్తి పెరగడం లేదు. ఫలితంగా వృద్ధులు సొంత కుటుంబాల నుంచే ఈసడింపులకు, వేధింపులకూ గురవుతున్నారు. వృద్ధుల జీవితం భరోసాగా గడవడం ఎలా?! పాశ్చాత్య దేశాల మాదిరి కాకుండా భారతదేశంలోని 40 శాతం మంది వృద్ధులు అత్యంత పేదరికంలో ఉన్నారు. 60 నుంచి 80 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు ఆర్థిక, ఇతర అవసరాల కోసం వారి కుటుంబాలపై పూర్తిగా ఆధారపడి ఉన్నారు. గ్రామీణ వృద్ధులు కుల, వర్గ ఆధారిత వివక్షకూ గురవుతున్నారు. గ్రామాల్లో పెను సవాల్! నగరాలలో ఉండే సీనియర్ సిటిజన్స్ జీవితాలతో పోల్చితే గ్రామాల్లో వారి పరిస్థితి దయనీయంగా ఉంది. వీరు కనీస సౌకర్యాలు కూడా లేకుండా జీవిస్తున్నారు. మన ఆరోగ్య విధానం సాధారణంగా మాతా, శిశు సంరక్షణపైనే ఉంటుంది. వృద్ధుల సంరక్షణకు అంతగా ్రపాధాన్యత ఇవ్వడం లేదు. గ్రామీణ వృద్ధులలో ప్రత్యేకించి మహిళలు ఆర్థిక, అవసరాల కోసం వారి కుటుంబాలపై పూర్తిగా ఆధారపడుతున్నారు. మన దేశంలో వృద్ధుల సంరక్షణ ఎక్కువ భాగం వారి పిల్లలు చూసుకోవడం ఆనవాయితీ. అయితే, కాలంతో పాటు ఈ విధానాలూ వేగంగా మారుతున్నాయి. పిల్లల వలస.. పెరుగుతున్న ఒంటరితనం విద్య, ఉద్యోగాల కోసం పిల్లలు వలసలు వెళ్లడం, ఉమ్మడి కుటుంబం వ్యవస్థ విచ్చిన్నం కావడం, వృద్ధుల సంరక్షణను ప్రశ్నార్థకంగా మార్చింది. నివేదికల ప్రకారం 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో 6 శాతం మంది ఒంటరిగా జీవిస్తున్నారు. 20 శాతం మంది పిల్లలు లేకుండా వారి జీవిత భాగస్వామితో మాత్రమే జీవిస్తున్నారు. ఈ సంఖ్య భవిష్యత్తులో గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. తక్కువ ఆదాయ కుటుంబాలలో వృద్ధుల ఆరోగ్య అవసరాలు ఆర్థికంగా భరించలేనంత భారంగా మారుతున్నాయి. భారతదేశంలో వృద్ధులపై వేధింపుల కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ‘హెల్ప్ ఏజ్ ఇండియా’ నివేదిక ప్రకారం 25 శాతం మంది పెద్దలు తమ సొంత కుటుంబాల ద్వారా వేధింపులకు గురవుతున్నారు. సామాజిక భద్రత హె ల్ప్ ఏజ్ ఇండియా సూచనల మేరకు.. ► దేశంలో వృద్ధుల కోసం అధికారిక సంస్థాగత సంరక్షణలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది. పటిష్టమైన పెన్షన్, సామాజిక భద్రతా వ్యవస్థ, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించడం ద్వారా వారి కుటుంబ సభ్యులపై వృద్ధులు ఆధారపడటం తగ్గించవచ్చు. ► దాదాపు 33 శాతం మంది వృద్ధ స్త్రీలకు ఎటువంటి ఆదాయం లేదు. 11 శాతం మందికి మాత్రమే పెన్షన్ ద్వారా ఆదాయం వస్తోంది. 16.3 శాతం మంది సామాజిక పెన్షన్ పొందుతున్నారు. సీనియర్ కేర్ సంస్కరణలపై ఇటీవల ‘నీతి అయోగ్’ సమర్పించిన ఓ నివేదిక ప్రకారం వృద్ధుల ఆర్థిక సాధికారతను నిర్ధారించడానికి ప్రభుత్వ నిధుల కవరేజీని పెంచడం, తిరిగి పని నైపుణ్యాలవైపు మళ్లించడం, తప్పనిసరి ΄÷దుపు ప్రణాళికలు, రివర్స్ మార్టిగేజ్ మెకానిజమ్స్, పన్ను, జీఎస్టీ సంస్కరణల వంటి అనేక చర్యలు చేపట్టాలని పేర్కొంది. ► ఎటువంటి ఆస్తులు, ఆదాయం లేకుండా ఉన్నవారి అవసరాలకు అనుగుణంగా సంపూర్ణ వృద్ధాప్య సంరక్షణ నమూనాను అభివృద్ధి చేయాల్సి ఉంటుందనేది మరో సూచన. నలుగురు కలిసి ఉంటే ఎంతో మేలు.. వృద్ధులైనా డబ్బున్నవారి పరిస్థితి బాగానే ఉంది. డబ్బులేని వారే జీవశ్ఛవాలుగా బతుకీడుస్తున్నారు. ► వృద్ధులకు ఓల్డేజీ హోమ్స్ తప్ప మరో మార్గం లేదు. ఫుడ్ షెల్టర్ ఈ రెండే ఇస్తుంది. కానీ, ఎమోషనల్గా ఒంటరితనం ఫీలవుతుంటారు. అందుకే, రీ మ్యారేజ్ ద్వారా మేం ఒక సొల్యూషన్ చూపిస్తున్నాం. లేదంటే, ఒంటరిగా ఉన్న వృద్ధులు ప్రమాదాలకు, దోపిడీలకు గురవుతున్నారు. ఇలాంటప్పుడు నలుగురు వృద్ధులు కలిసి ఒక చోట ఉండవచ్చు. దీని వల్ల ఒంటరితనం పోగొట్టుకోగలుగుతారు. ► అప్పడాలు, వడియాలు వంటివి చేసి, వ్యాపారం చేసుకోవచ్చు. కానీ, 70 ఏళ్ల వయసులో ఏ పనీ చేయడానికి ఓపిక ఉండదు. పెట్టింది తినడం తప్ప ఏ రకమైన ఫిజికల్ స్ట్రెయిన్ పడలేరు. అందుకని, రూమ్మెట్స్ లాగా కలిసి ఉండాలి. అక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇండోర్గేమ్స్, స్థానిక పర్యాటక స్థలాలు చూసి రావచ్చు. ► యువత పట్టించుకోదు, మధ్య వయసువారికి కుటుంబ సమస్యలు. సీనియర్ సిటిజన్స్ పట్ల ఎవరికీ జాలి, దయ ఉండదు. వృద్ధులకు ఇచ్చే ఆత్మీయ స్పర్శను ఎంతో ఓదార్పుగా ఫీలవుతారు. ► రాజకీయ వర్గం తరచుగా యువ జనాభాను ఆర్థిక ఆస్తిగా పేర్కొంటుంది. పెరుగుతున్న వృద్ధ జనాభాకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక, సామాజిక మద్దతును అందించడానికి అంతగా ఆసక్తి చూపదు. ఏ రకమైన ఆదాయం లేనివారికి ప్రభుత్వమే వారికో దారి చూపించాల్సి ఉంటుంది. ప్రభుత్వం పెన్షన్ రూపేణ వచ్చే వనరుతోనూ నలుగురు కలిసి ఉండవచ్చు. – ఎన్.ఎమ్.రాజేశ్వరి, తోడు నీడ స్వచ్ఛంధ సంస్థ, హైదరాబాద్ -
రెట్టింపు కానున్న వృద్ధుల జనాభా
పరిపరి శోధన ఆధునిక వైద్య పరిశోధనల పుణ్యమాని ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఆయుఃప్రమాణం రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా దాదాపు అన్ని దేశాల్లోనూ వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతోంది. మరో ముప్పయ్యేళ్లలో వృద్ధుల జనాభా రెట్టింపు కాగలదని అంతర్జాతీయ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 65 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య దాదాపు 60 కోట్ల వరకు ఉంది. వృద్ధుల సంఖ్య ఏటా 8.5 శాతం మేరకు పెరుగుతూ వస్తోంది. అయితే, 2050 నాటికి వృద్ధుల జనాభా 160 కోట్లకు చేరుకోగలదని, వృద్ధుల జనాభా పెరుగుదల వేగం ఏడాదికి 17 శాతానికి చేరుకోగలదని అమెరికా సెన్సస్ బ్యూరో తన తాజా నివేదికలో ప్రకటించింది. -
జపాన్లో పెరుగుతున్న 'పెద్దోళ్లు'
ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి చిరునామాగా వెలుగొందుతున్న జపాన్ అతిపెద్ద వయస్కులకు నిలయం. మిగతా దేశాలతో పోల్చితే ఈ దేశంలో అతిపెద్ద వయస్కుల సంఖ్య అధికం. విశేషమేమిటంటే జపాన్లో వృద్ధుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. ఇక్కడ రికార్డు స్థాయిలో వృద్ధులున్నట్టు తాజా గణంకాలు వెల్లడిస్తున్నాయి. 2010 జనాభా లెక్కల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారు 31.86 మిలియన్ల మంది ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే ఇది 1.12 మిలియన్ ఎక్కువ. 13.69 మిలియన్ల మంది పురుషులు, 18.18 మంది మహిళలు వృద్ధ జనాభాలో ఉన్నారు. జపాన్ జనాభాలో నలుగురిలో ఒక్కరు 65 ఏళ్ల కంటే పైబడిన వారు ఉన్నారని వివరించింది. 2035 నాటికి ప్రతి ముగ్గురిలో ఒక వృద్ధుడు ఉంటారని అంచనా వేసింది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
No Headline
కౌంటింగ్ ప్రక్రియకు సన్నాహాలు
జీవాలకు విధిగా చిటుకు వ్యాధి నివారణ టీకా
టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
భూ యాజమాన్య హక్కు చట్టంతో మేలు
వైభవంగా పోలేరమ్మ తిరునాళ్ల
అసాంఘిక చర్యలకు పాల్పడితే రౌడీషీట్
ఎన్నికలవేళ తీవ్ర ఒడుదొడుకుల్లో స్టాక్మార్కెట్లు.. కారణం..
వేరబుల్స్ రంగానికీ పీఎల్ఐ స్కీమ్.. కేంద్రానికి ఎంఏఐటీ విజ్ఞప్తి
ఎమ్మెల్యే ఇంటిపై దాడి కేసులో నిందితుల అరెస్టు
తప్పక చదవండి
- కమెడియన్ అని చిన్నచూపు చూడొద్దు..
- ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
- మోదీ గ్యారంటీలా? కేజ్రీ పథకాలా?.. ఢిల్లీ జనం మదిలో ఏముంది?
- రెప్పపాటులోనే మృత్యు ఒడికి
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- ఐఏఎస్లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
- దారి మళ్లనున్న తుపాను!
- పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
Advertisement